ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అత్యంత సంకట స్థితిలో ఉంది. ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న విధంగా పార్టీ పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు జగన్ పక్కనే ఉన్న నాయకులు.. ఆయన వెంట నడిచిన నేతలు.. చెప్పాపెట్టకుండా.. చేయిచ్చేస్తున్నారు. కనీసం మీడియాకు కూడా సమాచారం లేకుండా.. ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరు రాజీనామా చేసే వరకు పార్టీకి కూడా సమాచారం లేదని తెలియడం గమనార్హం. ఇక, రాజ్యసభలోనూ.. పార్టీ బలం తగ్గుతోంది.
ఈ పరిణామాలతో వైసీపీలో డేంజర్ బెల్స్ మొగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ చాలా వరకు అలెర్ట్ అయ్యారు. ముఖ్యనాయకులను పిలిచి మాట్టాడారు. కానీ, వారు పైకి మీతోనే ఉంటామని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం మనసులు మాత్రం కలపులేకపోతున్నారు. దీనికి కారణం.. వారికి ఉన్న వ్యక్తిగత కారణాలు.. అవసరాలే! వ్యాపారాలు ఉన్నవారు.. తమ వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక, జంప్ జిలానీలుగా ఉన్న నాయకులు కూడా ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణాలు వైసీపీని డేంజర్ జోన్లోనే ఉంచాయి. ముఖ్యంగా పార్టీ నాయకులు చెబుతున్నది ఒక్కటే.. జగన్ తీరు మారాలన్నదే! కానీ, ఇప్పటికీ ఆ మాటను పార్టీ అధినేతకు ధైర్యంగా చెప్పలేక పోతున్నారు. ఎక్కడా వారి మనసులో ఉన్నది చెప్పుకోలేకపోతున్నారు. కొందరు పార్టీకి దూరం అయితే..మరికొందరు పొరుగు పార్టీల్లోకి చేరిపోతున్నారు.
మొత్తంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు జగన్ను కలిసి మాటిచ్చి.. “మేం మీతోనే ఉంటాం.. మా భవిష్యత్తు” మీతోనే అని చెబుతున్నా.. మనసులు మాత్రం కలవడం లేదు. దీనిని బట్టి ఏ క్షణంలో అయినా.. మార్పులు ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే.. ఎన్ని జరిగినా.. జగన్ ఒంటరి ప్రయాణానికి రెడీ అయిపోయారన్న సంకేతాలు వస్తున్నాయి. ఒంటరిగానే పార్టీ పెట్టా.. ఒంటరిగానే.. ముందుకు వెళ్తా.. అని అంతర్గత సమావేశాల్లో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు గమనార్హం.
This post was last modified on September 1, 2024 10:46 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…