Political News

మాటిచ్చినా.. మ‌న‌సులు క‌ల‌వ‌ట్లేదు.. వైసీపీకి డేంజ‌రే!

ప్ర‌స్తుతం వైసీపీ ప‌రిస్థితి అత్యంత సంక‌ట స్థితిలో ఉంది. ఏ నిముషానికి ఏమి జ‌రుగునో అన్న విధంగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప‌క్క‌నే ఉన్న నాయ‌కులు.. ఆయ‌న వెంట న‌డిచిన నేత‌లు.. చెప్పాపెట్ట‌కుండా.. చేయిచ్చేస్తున్నారు. క‌నీసం మీడియాకు కూడా స‌మాచారం లేకుండా.. ఇద్ద‌రు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరు రాజీనామా చేసే వ‌ర‌కు పార్టీకి కూడా స‌మాచారం లేద‌ని తెలియ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, రాజ్య‌స‌భ‌లోనూ.. పార్టీ బ‌లం త‌గ్గుతోంది.

ఈ ప‌రిణామాల‌తో వైసీపీలో డేంజ‌ర్ బెల్స్ మొగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ చాలా వ‌ర‌కు అలెర్ట్ అయ్యారు. ముఖ్య‌నాయ‌కుల‌ను పిలిచి మాట్టాడారు. కానీ, వారు పైకి మీతోనే ఉంటామ‌ని చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం మ‌న‌సులు మాత్రం క‌లపులేక‌పోతున్నారు. దీనికి కార‌ణం.. వారికి ఉన్న వ్య‌క్తిగ‌త కార‌ణాలు.. అవ‌స‌రాలే! వ్యాపారాలు ఉన్న‌వారు.. త‌మ వ్యాపారాల‌కు ఇబ్బందులు లేకుండా రాకుండా చూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక‌, జంప్ జిలానీలుగా ఉన్న నాయ‌కులు కూడా ఎప్పుడు ఏం చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిణాలు వైసీపీని డేంజ‌ర్ జోన్‌లోనే ఉంచాయి. ముఖ్యంగా పార్టీ నాయ‌కులు చెబుతున్న‌ది ఒక్క‌టే.. జ‌గ‌న్ తీరు మారాల‌న్న‌దే! కానీ, ఇప్ప‌టికీ ఆ మాట‌ను పార్టీ అధినేత‌కు ధైర్యంగా చెప్ప‌లేక పోతున్నారు. ఎక్క‌డా వారి మ‌న‌సులో ఉన్న‌ది చెప్పుకోలేక‌పోతున్నారు. కొంద‌రు పార్టీకి దూరం అయితే..మరికొంద‌రు పొరుగు పార్టీల్లోకి చేరిపోతున్నారు.

మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్‌ను క‌లిసి మాటిచ్చి.. “మేం మీతోనే ఉంటాం.. మా భ‌విష్య‌త్తు” మీతోనే అని చెబుతున్నా.. మ‌న‌సులు మాత్రం క‌ల‌వ‌డం లేదు. దీనిని బ‌ట్టి ఏ క్ష‌ణంలో అయినా.. మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే.. ఎన్ని జ‌రిగినా.. జ‌గ‌న్ ఒంట‌రి ప్ర‌యాణానికి రెడీ అయిపోయారన్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఒంట‌రిగానే పార్టీ పెట్టా.. ఒంట‌రిగానే.. ముందుకు వెళ్తా.. అని అంత‌ర్గ‌త స‌మావేశాల్లో జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు గ‌మ‌నార్హం.

This post was last modified on September 1, 2024 10:46 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

2 minutes ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago