వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. శనివారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. స్థానికులతో ఆయన భేటీ అవుతారని పార్టీ కార్యాలయం తెలిపింది. ఎన్నికల తర్వాత.. పులివెందుల పర్యటనకు వెళ్లడం..ఇది నాలుగోసారి. అయితే.. ఈసారి అచ్చంగా.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారని పార్టీ నాయకులు తెలిపారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన సతీసమేతంగా పులివెందుల వెళ్లనున్నారు. తిరిగి మంగళవారం తాడేపల్లికి చేరుకుంటారు.
కాగా.. ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్ల సమయంలో జగన్ ఇలా పులివెందుల పర్యటన పెట్టుకోవడంపై విమర్శ లు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఏనాయకుడు జంప్ చేస్తాడో.. ఎవరు రాజీనామాల బాట పడుతున్నా రో.. అనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ఇలాంటి సమయంలో పార్టీ నాయకులకు అందుబాటులో ఉండకుండా.. పులివెందుల పర్యటన పెట్టుకోవడం ఏంటనేది పార్టీలోనే జరుగుతున్న చర్చ. అయితే.. జగన్ పులివెందుల పర్యటనను కొందరు సమర్థిస్తున్నారు. ఆయన ఉన్నా.. జరిగేది ఆగదని.. ఆయన లేకపోయినా.. అన్నీ బాగానే ఉంటాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. మరోవైపు రాష్ట్రంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన, తర్వాత పరిణామాలు, ఇంకో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారని రోజూ మీడియాలో వస్తూనే ఉంది. వైద్య శాలల్లో సరైన సౌకర్యాలు లేవన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి ఇన్ని సమస్యలు పెట్టుకుని.. జగన్ ప్రజలను కలవకుండా.. బాధితులను కలిసి వారి సమస్యలు వినకుండా.. ఇప్పుడు అంత అర్జంటుగా పులివెందుల పర్యటన పెట్టుకోవడం వెనుక విషయం ఏంటనేది ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రశ్న.
విషయం ఇదేనా..
అయితే.. ఇటీవల పులివెందుల మునిసిపాలిటీపైనా.. కూటమి సర్కారు కన్నేసింది. దీంతో పార్టీ నాయకులు చెల్లాచెదురయ్యే అవకాశం ఉంది. తన సొంత నియోజకవర్గంలోనే మునిసిపాలిటీని కాపాడుకోకపోతే ఇబ్బందులు తప్పవని భావించే జగన్ అక్కడకు వెళ్తున్నారన్న మరో చర్చ కూడా సాగుతోంది.
This post was last modified on August 31, 2024 9:33 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…