నాలో పాత ముఖ్యమంత్రిని చూస్తారు.. అంటూ.. సీఎం చంద్రబాబుపదే పదే చెబుతున్నారు. అయితే.. పాత ముఖ్యమంత్రి అంటే.. ఆయన చెబుతున్నట్టు 1995ల నాటి ముఖ్యమంత్రి కాదు. 2014 నాటి చంద్రబాబే కనిపిస్తున్నారన్నది ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న చర్చ. అప్పట్లో చంద్రబాబు వైసీపీని ఘోరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నుంచి జంపింగులను ఆయన ప్రోత్సహిస్తున్నారన్న చర్చసాగుతోంది.
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా గత చంద్రబాబునే తలపిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా అసవరం ఉంది. ముఖ్యంగా రాజ్యసభలో పార్టీకి బలం లేదు. కనీసం ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా రాజ్యసభలో లేరు. ఈ క్రమంలో వైసీపీ నుంచి కనీసంలో కనీసం నలుగురి నుంచి ఐదుగురి వరకు తీసుకుంటే.. టీడీపీకి మేలు జరుగుతుంది. ఈ విషయంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. అందుకే.. తొలి ప్రయత్నంలో రెండు వికెట్లు పడగొట్టారని తెలుస్తోంది.
ఇక, మండలిలో టీడీపీకి సభ్యులు ఉన్నా.. బలమైన మెజారిటీ లేదు. వైసీపీ డామినేషన్ కనిపిస్తోంది. ప్రభుత్వం పరంగా ఎలాంటి నిర్నయం తీసుకున్నా.. ఎలాంటి బిల్లు తీసుకువచ్చినా.. ఇక్కడ వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. దీంతో సర్కారు పనులు ముందుకు సాగేలా కనిపించడం లేదు. అందుకే.. ఇక్కడ కూడా బలం పెంచుకునేందుకు చంద్రబాబు జంపింగులను ప్రోత్సహిస్తున్నార న్నదిటీడీపీ నేతల మాట.
తద్వారా.. అటు రాజ్యసభలోనూ.. ఇటు మండలిలోనూ.. టీడీపీని బలోపేతం చేయాలనేది చంద్రబాబు ఆలోచన.. ఇలా జంపింగులను ప్రోత్సహించడం తప్పుకాదన్నది ఆయన భావన మాత్రమే కాదు.. వైసీపిని మరింత దెబ్బ కొట్టాలంటే.. ఇలాంటివి చేయడం తప్పుకాదన్నది ఎన్డీయే విధానం కూడా. సో.. దీనిని కూటమి పార్టీలు కూడా తప్పు పట్టడం లేదు. పైగా.. కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తున్న పని కూడా ఇదే కావడంతో ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. సో.. దీనిని బట్టి చంద్రబాబు.. మారిన విధానం ఇదే నని అంటున్నారు తమ్ముళ్లు!
This post was last modified on September 1, 2024 3:11 pm
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…