కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడిన తమ్ముళ్లే.. ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నారు. ఎక్కడికక్కడ వివాదాలు.. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చాలా మంది తమ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తున్నారు. కొన్ని ఘటనలు మెయిన్ మీడియాలో వస్తుండగా.. మరిన్ని ఘటనలపై పార్టీకి ప్రతి రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇవన్నీ.. కలగలిపి చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఆయా అంశాలపై మరింత ప్రచారం పెరుగుతున్ననేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.
తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాలను ఉద్దేశించి.. చంద్రబాబు సీరియస్గానే స్పందించారు. “మీరు మారతారని ఆశిస్తున్నా. మారకపోతే.. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గతంలో ఇలానే చేసినవారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆలోచిం చుకోండి” అని కొందరి పేర్లను కూడా చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. వీరిలో కొందరికి తాజా ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. మరికొందరికి మంత్రి పీఠాలు దక్కలేదు. వీరి పేర్లను ప్రస్తావించిన చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో గట్టిగానే హెచ్చరించారు. అంతేకాదు.. వచ్చే వారంలో నేతలందరితోనూ.. జూమ్ సమావేశం పెట్టనున్నట్టు తెలిపారు.
ఇదేసమయంలో మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ ఎలాంటి గలాటా జరిగినా.. దానిలో టీడీపీ ఎమ్మల్యేలు, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా.. అక్కడికక్కడే హెచ్చరించాలని పవర్స్ ఇచ్చారు. ఆ విషయాలను తన దృష్టికి కూడా తీసుకురావాలని చంద్రబాబు చెప్పారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోదని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే.. కారణం.. అలాంటి ఘటనలేనని చెప్పారు.
నాయకులు, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలే తెగబడితే.. సాధారణ ప్రజల్లో అలుసై పోమా? అని హెచ్చరించారు. ఈ పరిస్థితి మారకపోతే.. తానే మారే పరిస్థితి వస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే మొదటి, ఫైనల్ వార్నింగ్ అని తేల్చి చెప్పారు. అయితే.. చంద్రబాబు హెచ్చరికలను ఎంత మంది తమ్ముళ్లు పాటిస్తారో చూడాలి. ఎక్కడికక్కడ ఆధిపత్య ధోరణి, పైచేయి కోసం ప్రయత్నిస్తున్న తమ్ముళ్లు.. ఇప్పటికైనా మారకపోతే.. చంద్రబాబు వారిపై కొరడా ఝళిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…