కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడిన తమ్ముళ్లే.. ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నారు. ఎక్కడికక్కడ వివాదాలు.. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చాలా మంది తమ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తున్నారు. కొన్ని ఘటనలు మెయిన్ మీడియాలో వస్తుండగా.. మరిన్ని ఘటనలపై పార్టీకి ప్రతి రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇవన్నీ.. కలగలిపి చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఆయా అంశాలపై మరింత ప్రచారం పెరుగుతున్ననేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.
తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాలను ఉద్దేశించి.. చంద్రబాబు సీరియస్గానే స్పందించారు. “మీరు మారతారని ఆశిస్తున్నా. మారకపోతే.. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గతంలో ఇలానే చేసినవారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆలోచిం చుకోండి” అని కొందరి పేర్లను కూడా చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. వీరిలో కొందరికి తాజా ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. మరికొందరికి మంత్రి పీఠాలు దక్కలేదు. వీరి పేర్లను ప్రస్తావించిన చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో గట్టిగానే హెచ్చరించారు. అంతేకాదు.. వచ్చే వారంలో నేతలందరితోనూ.. జూమ్ సమావేశం పెట్టనున్నట్టు తెలిపారు.
ఇదేసమయంలో మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ ఎలాంటి గలాటా జరిగినా.. దానిలో టీడీపీ ఎమ్మల్యేలు, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా.. అక్కడికక్కడే హెచ్చరించాలని పవర్స్ ఇచ్చారు. ఆ విషయాలను తన దృష్టికి కూడా తీసుకురావాలని చంద్రబాబు చెప్పారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోదని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే.. కారణం.. అలాంటి ఘటనలేనని చెప్పారు.
నాయకులు, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలే తెగబడితే.. సాధారణ ప్రజల్లో అలుసై పోమా? అని హెచ్చరించారు. ఈ పరిస్థితి మారకపోతే.. తానే మారే పరిస్థితి వస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే మొదటి, ఫైనల్ వార్నింగ్ అని తేల్చి చెప్పారు. అయితే.. చంద్రబాబు హెచ్చరికలను ఎంత మంది తమ్ముళ్లు పాటిస్తారో చూడాలి. ఎక్కడికక్కడ ఆధిపత్య ధోరణి, పైచేయి కోసం ప్రయత్నిస్తున్న తమ్ముళ్లు.. ఇప్పటికైనా మారకపోతే.. చంద్రబాబు వారిపై కొరడా ఝళిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 29, 2024 10:28 am
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…
నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…