కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడిన తమ్ముళ్లే.. ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నారు. ఎక్కడికక్కడ వివాదాలు.. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చాలా మంది తమ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తున్నారు. కొన్ని ఘటనలు మెయిన్ మీడియాలో వస్తుండగా.. మరిన్ని ఘటనలపై పార్టీకి ప్రతి రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇవన్నీ.. కలగలిపి చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఆయా అంశాలపై మరింత ప్రచారం పెరుగుతున్ననేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.
తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాలను ఉద్దేశించి.. చంద్రబాబు సీరియస్గానే స్పందించారు. “మీరు మారతారని ఆశిస్తున్నా. మారకపోతే.. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గతంలో ఇలానే చేసినవారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆలోచిం చుకోండి” అని కొందరి పేర్లను కూడా చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. వీరిలో కొందరికి తాజా ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. మరికొందరికి మంత్రి పీఠాలు దక్కలేదు. వీరి పేర్లను ప్రస్తావించిన చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో గట్టిగానే హెచ్చరించారు. అంతేకాదు.. వచ్చే వారంలో నేతలందరితోనూ.. జూమ్ సమావేశం పెట్టనున్నట్టు తెలిపారు.
ఇదేసమయంలో మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ ఎలాంటి గలాటా జరిగినా.. దానిలో టీడీపీ ఎమ్మల్యేలు, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా.. అక్కడికక్కడే హెచ్చరించాలని పవర్స్ ఇచ్చారు. ఆ విషయాలను తన దృష్టికి కూడా తీసుకురావాలని చంద్రబాబు చెప్పారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోదని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే.. కారణం.. అలాంటి ఘటనలేనని చెప్పారు.
నాయకులు, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలే తెగబడితే.. సాధారణ ప్రజల్లో అలుసై పోమా? అని హెచ్చరించారు. ఈ పరిస్థితి మారకపోతే.. తానే మారే పరిస్థితి వస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే మొదటి, ఫైనల్ వార్నింగ్ అని తేల్చి చెప్పారు. అయితే.. చంద్రబాబు హెచ్చరికలను ఎంత మంది తమ్ముళ్లు పాటిస్తారో చూడాలి. ఎక్కడికక్కడ ఆధిపత్య ధోరణి, పైచేయి కోసం ప్రయత్నిస్తున్న తమ్ముళ్లు.. ఇప్పటికైనా మారకపోతే.. చంద్రబాబు వారిపై కొరడా ఝళిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 29, 2024 10:28 am
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…