Political News

జంపింగుల ఎఫెక్ట్‌: జ‌గ‌న్ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే నెలలో త‌న కుమార్తె పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఆయ‌న ఆలోచ‌న చేస్తున్నారు. అనూహ్యంగా బుధ‌వారం ఒక్క‌రోజే.. ఉరుములు లేని పిడుగులు ప‌డిన‌ట్టుగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. నిన్న గాక మొన్న త‌న‌తో క‌లిసి నెల్లూరు జైలుకు వ‌చ్చి.. పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డిని ప‌రామ‌ర్శించిన‌.. పోతుల సునీత వంటి న‌మ్మ‌క‌స్తురాలైన నాయ‌కురాలు హ్యాండిచ్చారు.

ఇక‌, ఎంతో నెత్తిన పెట్టుకుని.. అన్ని ప‌దవుల‌కు ఎంపిక చేసిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ కూడా .. జంప్ అయిపోతున్నారు. ఇక‌, రేపో మాపో… మ‌రింత మంది రెడీగా ఉన్నార‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు బ్రిట‌న్ కు వెళ్తే.. పార్టీపై మ‌రింత ప్ర‌బావం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ త‌ల‌పోస్తున్నార‌ని తెలిసింది. నిజానికి వ‌చ్చే నెల‌లో 20 రోజుల పాటు ఆయ‌న బ్రిట‌న్‌లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

సిబీఐ కోర్టు నుంచి అనుమ‌తి కూడా తెచ్చుకున్నారు. కుమార్తెల‌తో క‌లిసి.. అక్క‌డ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత‌.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల‌తో జ‌గ‌న్ ఒక్క‌సారిగా ఆలోచ‌న‌లో కూరుకుపోయారు. అయితే.. జ‌గ‌న్‌కు ఇలాంటి ప‌రిస్థితులు కొత్త‌కావు. గ‌తంలోనూ అనేక మంది నాయ‌కులు వ‌చ్చారు వెళ్లారు. కానీ, అప్పుడు పార్టీ బ‌లంగా ఉంది. కానీ,ఇప్పుడు ప్ర‌జ‌ల్లోనే పార్టీ బ‌లంగా లేదు. పైగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేస్తున్న ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పికొట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు స్థానికంగా ఉండాల్సి ఉంది. అందుకే ఆయన బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏం జ‌రిగినా ఎదిరించాలంటే.. ఆయ‌న ఇక్క‌డే ఉండ‌డం మంచిద‌ని కొంద‌రు సీనియ‌ర్లు కూడా భావిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. కొంద‌రిని బుజ్జగించాల‌ని కూడా భావిస్తున్నారు. నిజానికి ఇది జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వానికి వ్య‌తిరేక‌మే అయినా.. ఇప్పుడు త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. సో.. మొత్తానికి పార్టీలో ఏర్ప‌డిన క‌ల్లోలం కార‌ణంగా జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యే అవకాశం మెండుగా క‌నిపిస్తోంది. 

This post was last modified on August 29, 2024 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

15 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

42 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago