Political News

జంపింగుల ఎఫెక్ట్‌: జ‌గ‌న్ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే నెలలో త‌న కుమార్తె పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఆయ‌న ఆలోచ‌న చేస్తున్నారు. అనూహ్యంగా బుధ‌వారం ఒక్క‌రోజే.. ఉరుములు లేని పిడుగులు ప‌డిన‌ట్టుగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. నిన్న గాక మొన్న త‌న‌తో క‌లిసి నెల్లూరు జైలుకు వ‌చ్చి.. పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డిని ప‌రామ‌ర్శించిన‌.. పోతుల సునీత వంటి న‌మ్మ‌క‌స్తురాలైన నాయ‌కురాలు హ్యాండిచ్చారు.

ఇక‌, ఎంతో నెత్తిన పెట్టుకుని.. అన్ని ప‌దవుల‌కు ఎంపిక చేసిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ కూడా .. జంప్ అయిపోతున్నారు. ఇక‌, రేపో మాపో… మ‌రింత మంది రెడీగా ఉన్నార‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు బ్రిట‌న్ కు వెళ్తే.. పార్టీపై మ‌రింత ప్ర‌బావం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ త‌ల‌పోస్తున్నార‌ని తెలిసింది. నిజానికి వ‌చ్చే నెల‌లో 20 రోజుల పాటు ఆయ‌న బ్రిట‌న్‌లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

సిబీఐ కోర్టు నుంచి అనుమ‌తి కూడా తెచ్చుకున్నారు. కుమార్తెల‌తో క‌లిసి.. అక్క‌డ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత‌.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల‌తో జ‌గ‌న్ ఒక్క‌సారిగా ఆలోచ‌న‌లో కూరుకుపోయారు. అయితే.. జ‌గ‌న్‌కు ఇలాంటి ప‌రిస్థితులు కొత్త‌కావు. గ‌తంలోనూ అనేక మంది నాయ‌కులు వ‌చ్చారు వెళ్లారు. కానీ, అప్పుడు పార్టీ బ‌లంగా ఉంది. కానీ,ఇప్పుడు ప్ర‌జ‌ల్లోనే పార్టీ బ‌లంగా లేదు. పైగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేస్తున్న ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పికొట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు స్థానికంగా ఉండాల్సి ఉంది. అందుకే ఆయన బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏం జ‌రిగినా ఎదిరించాలంటే.. ఆయ‌న ఇక్క‌డే ఉండ‌డం మంచిద‌ని కొంద‌రు సీనియ‌ర్లు కూడా భావిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. కొంద‌రిని బుజ్జగించాల‌ని కూడా భావిస్తున్నారు. నిజానికి ఇది జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వానికి వ్య‌తిరేక‌మే అయినా.. ఇప్పుడు త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. సో.. మొత్తానికి పార్టీలో ఏర్ప‌డిన క‌ల్లోలం కార‌ణంగా జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యే అవకాశం మెండుగా క‌నిపిస్తోంది. 

This post was last modified on August 29, 2024 10:24 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

13 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

57 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago