వైసీపీ అధినేత జగన్ వచ్చే నెలలో తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని బ్రిటన్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పర్యటనను రద్దు చేసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. అనూహ్యంగా బుధవారం ఒక్కరోజే.. ఉరుములు లేని పిడుగులు పడినట్టుగా పార్టీ పరిస్థితి మారిపోయింది. నిన్న గాక మొన్న తనతో కలిసి నెల్లూరు జైలుకు వచ్చి.. పిన్నెల్లి రామకృష్నారెడ్డిని పరామర్శించిన.. పోతుల సునీత వంటి నమ్మకస్తురాలైన నాయకురాలు హ్యాండిచ్చారు.
ఇక, ఎంతో నెత్తిన పెట్టుకుని.. అన్ని పదవులకు ఎంపిక చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా .. జంప్ అయిపోతున్నారు. ఇక, రేపో మాపో… మరింత మంది రెడీగా ఉన్నారని సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బ్రిటన్ కు వెళ్తే.. పార్టీపై మరింత ప్రబావం పడే అవకాశం ఉంటుందని జగన్ తలపోస్తున్నారని తెలిసింది. నిజానికి వచ్చే నెలలో 20 రోజుల పాటు ఆయన బ్రిటన్లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
సిబీఐ కోర్టు నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నారు. కుమార్తెలతో కలిసి.. అక్కడ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ ఒక్కసారిగా ఆలోచనలో కూరుకుపోయారు. అయితే.. జగన్కు ఇలాంటి పరిస్థితులు కొత్తకావు. గతంలోనూ అనేక మంది నాయకులు వచ్చారు వెళ్లారు. కానీ, అప్పుడు పార్టీ బలంగా ఉంది. కానీ,ఇప్పుడు ప్రజల్లోనే పార్టీ బలంగా లేదు. పైగా.. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు స్థానికంగా ఉండాల్సి ఉంది. అందుకే ఆయన బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరిగినా ఎదిరించాలంటే.. ఆయన ఇక్కడే ఉండడం మంచిదని కొందరు సీనియర్లు కూడా భావిస్తున్నారు. అవసరమైతే.. కొందరిని బుజ్జగించాలని కూడా భావిస్తున్నారు. నిజానికి ఇది జగన్ మనస్తత్వానికి వ్యతిరేకమే అయినా.. ఇప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. సో.. మొత్తానికి పార్టీలో ఏర్పడిన కల్లోలం కారణంగా జగన్ విదేశీ పర్యటన రద్దయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
This post was last modified on August 29, 2024 10:24 am
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…