Political News

జంపింగుల ఎఫెక్ట్‌: జ‌గ‌న్ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే నెలలో త‌న కుమార్తె పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఆయ‌న ఆలోచ‌న చేస్తున్నారు. అనూహ్యంగా బుధ‌వారం ఒక్క‌రోజే.. ఉరుములు లేని పిడుగులు ప‌డిన‌ట్టుగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. నిన్న గాక మొన్న త‌న‌తో క‌లిసి నెల్లూరు జైలుకు వ‌చ్చి.. పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డిని ప‌రామ‌ర్శించిన‌.. పోతుల సునీత వంటి న‌మ్మ‌క‌స్తురాలైన నాయ‌కురాలు హ్యాండిచ్చారు.

ఇక‌, ఎంతో నెత్తిన పెట్టుకుని.. అన్ని ప‌దవుల‌కు ఎంపిక చేసిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ కూడా .. జంప్ అయిపోతున్నారు. ఇక‌, రేపో మాపో… మ‌రింత మంది రెడీగా ఉన్నార‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు బ్రిట‌న్ కు వెళ్తే.. పార్టీపై మ‌రింత ప్ర‌బావం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ త‌ల‌పోస్తున్నార‌ని తెలిసింది. నిజానికి వ‌చ్చే నెల‌లో 20 రోజుల పాటు ఆయ‌న బ్రిట‌న్‌లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

సిబీఐ కోర్టు నుంచి అనుమ‌తి కూడా తెచ్చుకున్నారు. కుమార్తెల‌తో క‌లిసి.. అక్క‌డ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత‌.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల‌తో జ‌గ‌న్ ఒక్క‌సారిగా ఆలోచ‌న‌లో కూరుకుపోయారు. అయితే.. జ‌గ‌న్‌కు ఇలాంటి ప‌రిస్థితులు కొత్త‌కావు. గ‌తంలోనూ అనేక మంది నాయ‌కులు వ‌చ్చారు వెళ్లారు. కానీ, అప్పుడు పార్టీ బ‌లంగా ఉంది. కానీ,ఇప్పుడు ప్ర‌జ‌ల్లోనే పార్టీ బ‌లంగా లేదు. పైగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేస్తున్న ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పికొట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు స్థానికంగా ఉండాల్సి ఉంది. అందుకే ఆయన బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏం జ‌రిగినా ఎదిరించాలంటే.. ఆయ‌న ఇక్క‌డే ఉండ‌డం మంచిద‌ని కొంద‌రు సీనియ‌ర్లు కూడా భావిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. కొంద‌రిని బుజ్జగించాల‌ని కూడా భావిస్తున్నారు. నిజానికి ఇది జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వానికి వ్య‌తిరేక‌మే అయినా.. ఇప్పుడు త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. సో.. మొత్తానికి పార్టీలో ఏర్ప‌డిన క‌ల్లోలం కార‌ణంగా జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యే అవకాశం మెండుగా క‌నిపిస్తోంది. 

This post was last modified on August 29, 2024 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

34 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago