ఏపీపై ప్రధాని నరేంద్ర మోడీ కరుణించారు. ప్రస్తుతం ఇటు ఏపీలోనూ.. కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి సర్కారు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించడం ప్రారంభించింది. ఇటీవల బడ్జట్లో అమరావతి నిర్మాణానికి.. రూ.15 వేల కోట్ల మేరకు నిధులు సమకూరుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అదేసమయంలో పారిశ్రామిక పార్కులు సహా ఇతర అంశాల్లోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది.
తాజాగా బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెండింగ్ నిధులతో పాటు రూ.12,500 కోట్ల విడుదలకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అయితే.. ఇది కొంత వరకే సాయం. ఎందుకంటే.. అసలు సమస్య పునరావాసంతోనే ముడిపడి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఇచ్చిన నిధులు కొంత వరకు ప్రయోజనమనే చెప్పాలి.
ఇతర నిర్ణయాలు..
+ కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తారు.
+ కొప్పర్తి పారిశ్రామిక హబ్కు రూ.2,137 కోట్లు ఖర్చు చేయనున్నారు.
+ కొప్పర్తి పారిశ్రామిక హబ్తో 54 వేల మందికి ఉపాధి కల్పిస్తారు.
+ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
+ దీనిని రూ.2,786 కోట్లతో ఏర్పాటు చేస్తారు.
+ ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
సమాచార విప్లవం..
ఏపీలో సమాచార విప్లవానికి కూడా మోడీ సర్కారు పావులు కదిపింది. దీనిలో భాగంగా ఎఫ్ ఎం. రేడియో కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయనుంది. మొత్తం 22 నగరాల్లో 68 కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా.. ఉపాధి, సృజనాత్మక రంగాలు పుంజుకోనున్నాయి.
This post was last modified on August 28, 2024 10:27 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…