ఏపీపై ప్రధాని నరేంద్ర మోడీ కరుణించారు. ప్రస్తుతం ఇటు ఏపీలోనూ.. కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి సర్కారు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించడం ప్రారంభించింది. ఇటీవల బడ్జట్లో అమరావతి నిర్మాణానికి.. రూ.15 వేల కోట్ల మేరకు నిధులు సమకూరుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అదేసమయంలో పారిశ్రామిక పార్కులు సహా ఇతర అంశాల్లోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది.
తాజాగా బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెండింగ్ నిధులతో పాటు రూ.12,500 కోట్ల విడుదలకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అయితే.. ఇది కొంత వరకే సాయం. ఎందుకంటే.. అసలు సమస్య పునరావాసంతోనే ముడిపడి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఇచ్చిన నిధులు కొంత వరకు ప్రయోజనమనే చెప్పాలి.
ఇతర నిర్ణయాలు..
+ కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తారు.
+ కొప్పర్తి పారిశ్రామిక హబ్కు రూ.2,137 కోట్లు ఖర్చు చేయనున్నారు.
+ కొప్పర్తి పారిశ్రామిక హబ్తో 54 వేల మందికి ఉపాధి కల్పిస్తారు.
+ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
+ దీనిని రూ.2,786 కోట్లతో ఏర్పాటు చేస్తారు.
+ ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
సమాచార విప్లవం..
ఏపీలో సమాచార విప్లవానికి కూడా మోడీ సర్కారు పావులు కదిపింది. దీనిలో భాగంగా ఎఫ్ ఎం. రేడియో కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయనుంది. మొత్తం 22 నగరాల్లో 68 కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా.. ఉపాధి, సృజనాత్మక రంగాలు పుంజుకోనున్నాయి.
This post was last modified on August 28, 2024 10:27 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…