Political News

ఏపీపై మోడీ క‌రుణ‌.. నిధులు.. పార్కులు..  కేంద్రాలు!

ఏపీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌రుణించారు. ప్ర‌స్తుతం ఇటు ఏపీలోనూ.. కేంద్రంలోనూ ఎన్డీయే కూట‌మి స‌ర్కారు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు నెల‌ల కాలంలోనే మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ప్రారంభించింది. ఇటీవ‌ల బ‌డ్జట్‌లో అమ‌రావ‌తి నిర్మాణానికి.. రూ.15 వేల కోట్ల మేర‌కు నిధులు స‌మ‌కూరుస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో పారిశ్రామిక పార్కులు స‌హా ఇత‌ర అంశాల్లోనూ దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

తాజాగా బుధ‌వారం జ‌రిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ జీవ‌నాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెండింగ్ నిధులతో పాటు రూ.12,500 కోట్ల విడుదలకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివ‌ల్ల పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌రుగులు పెట్టేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అయితే.. ఇది కొంత వ‌ర‌కే సాయం. ఎందుకంటే.. అస‌లు స‌మ‌స్య పున‌రావాసంతోనే ముడిపడి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఇచ్చిన నిధులు కొంత వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌మ‌నే చెప్పాలి.

ఇత‌ర నిర్ణ‌యాలు..

+ కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తారు.

+ కొప్ప‌ర్తి పారిశ్రామిక హ‌బ్‌కు రూ.2,137 కోట్లు ఖర్చు చేయనున్నారు.

+ కొప్ప‌ర్తి పారిశ్రామిక  హబ్‌తో 54 వేల మందికి ఉపాధి కల్పిస్తారు.

+ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.

+ దీనిని రూ.2,786 కోట్లతో ఏర్పాటు చేస్తారు.

+ ఓర్వ‌క‌ల్లు పారిశ్రామిక కారిడార్ ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయి.

స‌మాచార విప్ల‌వం..

ఏపీలో స‌మాచార విప్ల‌వానికి కూడా మోడీ స‌ర్కారు పావులు క‌దిపింది. దీనిలో భాగంగా ఎఫ్ ఎం. రేడియో కేంద్రాల‌ను విస్తృతంగా ఏర్పాటు చేయ‌నుంది. మొత్తం 22 నగరాల్లో 68 కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు  చేస్తారు. వీటి ద్వారా.. ఉపాధి, సృజ‌నాత్మ‌క రంగాలు పుంజుకోనున్నాయి.

This post was last modified on August 28, 2024 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

28 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago