Political News

ఏపీపై మోడీ క‌రుణ‌.. నిధులు.. పార్కులు..  కేంద్రాలు!

ఏపీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌రుణించారు. ప్ర‌స్తుతం ఇటు ఏపీలోనూ.. కేంద్రంలోనూ ఎన్డీయే కూట‌మి స‌ర్కారు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు నెల‌ల కాలంలోనే మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ప్రారంభించింది. ఇటీవ‌ల బ‌డ్జట్‌లో అమ‌రావ‌తి నిర్మాణానికి.. రూ.15 వేల కోట్ల మేర‌కు నిధులు స‌మ‌కూరుస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో పారిశ్రామిక పార్కులు స‌హా ఇత‌ర అంశాల్లోనూ దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

తాజాగా బుధ‌వారం జ‌రిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ జీవ‌నాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెండింగ్ నిధులతో పాటు రూ.12,500 కోట్ల విడుదలకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివ‌ల్ల పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌రుగులు పెట్టేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అయితే.. ఇది కొంత వ‌ర‌కే సాయం. ఎందుకంటే.. అస‌లు స‌మ‌స్య పున‌రావాసంతోనే ముడిపడి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఇచ్చిన నిధులు కొంత వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌మ‌నే చెప్పాలి.

ఇత‌ర నిర్ణ‌యాలు..

+ కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తారు.

+ కొప్ప‌ర్తి పారిశ్రామిక హ‌బ్‌కు రూ.2,137 కోట్లు ఖర్చు చేయనున్నారు.

+ కొప్ప‌ర్తి పారిశ్రామిక  హబ్‌తో 54 వేల మందికి ఉపాధి కల్పిస్తారు.

+ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.

+ దీనిని రూ.2,786 కోట్లతో ఏర్పాటు చేస్తారు.

+ ఓర్వ‌క‌ల్లు పారిశ్రామిక కారిడార్ ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయి.

స‌మాచార విప్ల‌వం..

ఏపీలో స‌మాచార విప్ల‌వానికి కూడా మోడీ స‌ర్కారు పావులు క‌దిపింది. దీనిలో భాగంగా ఎఫ్ ఎం. రేడియో కేంద్రాల‌ను విస్తృతంగా ఏర్పాటు చేయ‌నుంది. మొత్తం 22 నగరాల్లో 68 కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు  చేస్తారు. వీటి ద్వారా.. ఉపాధి, సృజ‌నాత్మ‌క రంగాలు పుంజుకోనున్నాయి.

This post was last modified on August 28, 2024 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

18 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

44 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago