వైసీపీ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వా నికి రాజీనామా చేసిన సునీత.. మండలి కార్యదర్శికి పంపించారు. ఈ రాజీనామా ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే.. వైసీపీ సభ్యత్వానికి కూడా పోతుల సునీత రాజీనామా చేయడం గమనార్హం. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పోతుల.. నేరుగా ఆ పార్టీ అధినేత జగన్కు పంపిం చారు. కాగా.. ప్రస్తుతం పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఎమ్మల్సీ పదవి సహా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ఆమె ఈ పదవికి కూడా రాజీనామా చేసినట్టయింది. అయితే.. సునీత రాజకీయ ప్రస్థానం చూస్తే.. ఆయారాం.. గయారాం.. అన్నట్టు ఉంటుంది. గతంలో టీడీపీలోనే ఉన్న సునీత.. చీరాల నుంచి 2014లో పోటీ చేశారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన సునీత.. ఫైర్బ్రాండ్ నాయకురాలిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ఓటమి తర్వాత.. చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
అయితే.. తనకు మంత్రిపదవి ఇవ్వాలేదని ఆరోపిస్తూ.. టీడీపీ అదికారం కోల్పోయిన తర్వాత.. సునీత.. వైసీపీలోకి జంప్ చేశారు. అయితే.. అప్పుడు కూడా.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి జగన్ ఆ పదవిని ఆమెకే ఇవ్వడంతోపాటు.. పార్టీలోనూ గౌరవంగానే చూసుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటించినప్పుడు కూడా.. పోతుల సునీత వెంటే ఉన్నారు.
అయితే.. ఇక, పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడం ఎలా ఉన్నా.. వ్యక్తిగత సమస్యల కారణంగానే పోతుల వైసీపీని వీడినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. పైగా అదేపదవిని ఆమె సొంతం చేసుకోవడం కూడా ఖాయం. ఇదిలావుంటే.. చీరాలలోను, మంగళగిరిలోనూ చేనేత సామాజిక వర్గాన్ని ఆకర్షించాలన్న వ్యూహంతోనే పొతులకు టీడీపీ రెడ్ కార్పెట్ పరిచినట్టు తెలుస్తోంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…