ఊహించినట్టుగానే వైసీపీలో రాజ్యసభ సభ్యుల జంపింగులకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. అయి తే.. వీరిలో జగన్ అత్యంత ఇష్టంగా భావించి.. మరీ రాజ్యసభ సీట్లు ఇచ్చిన వారు ఉండడమే ఆశ్చర్యంగా ఉంది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మోపిదేవి వెంకట రమణ, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్రావులు ప్రస్తుతం ఢిల్లీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరూ కూడా.. జగన్కు అత్యంత ఆప్తులన్న విషయం తెలిసిందే.
2019 ఎన్నికలకు ముందు.. బీద మస్తాన్రావు.. టీడీపీలో ఉన్నారు. తర్వాత.. ఆయన ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంతరం.. జగన్ ఆయనను రాజ్యసభకు పంపించారు. ఇక, మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. అనంతరం.. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. తర్వాత.. రాజ్యసభలో ఖాళీ అయిన సీట్లకు.. బీసీ కోటాలో మోపిదేవి వెంకట రమణను పంపించారు. అప్పట్లో వీరిద్దరూ కూడా జగన్ను ఆకాశానికి ఎత్తేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు వారిద్దరూ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇద్దరూ కూడా నేరుగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారనేది సమాచారం. ఢిల్లీ వెళ్లి.. అక్కడ రాజ్యసభ చైర్మన్కు రాజీనామాలు సమర్పించి.. తిరిగి ఏపీకి రానున్నారు. అనంతరం వైసీపీకి రాజీనామా చేయనున్నారు. బీద మస్తాన్ రావు ప్రముఖ వ్యాపార వేత్త అన్న విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం వైసీపీలో ఇలాంటి జంపింగులు చాలా మందే ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on August 28, 2024 6:18 pm
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…