Political News

జ‌గ‌న్‌కు హ్యాండిస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యులు.. టీడీపీలోకి ఇద్ద‌రు!

ఊహించిన‌ట్టుగానే వైసీపీలో రాజ్య‌స‌భ స‌భ్యుల జంపింగుల‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. అయి తే.. వీరిలో జ‌గ‌న్ అత్యంత ఇష్టంగా భావించి.. మ‌రీ రాజ్య‌స‌భ సీట్లు ఇచ్చిన వారు ఉండ‌డ‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. గుంటూరు జిల్లా రేప‌ల్లెకు చెందిన మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మ‌స్తాన్‌రావులు ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వీరిద్ద‌రూ కూడా.. జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుల‌న్న విష‌యం తెలిసిందే.

2019 ఎన్నిక‌ల‌కు ముందు.. బీద మ‌స్తాన్‌రావు.. టీడీపీలో ఉన్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంత‌రం.. జ‌గ‌న్ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఇక‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. అనంత‌రం.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన సీట్ల‌కు.. బీసీ కోటాలో మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణను పంపించారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రూ కూడా జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వారిద్ద‌రూ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇద్ద‌రూ కూడా నేరుగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌నేది స‌మాచారం. ఢిల్లీ వెళ్లి.. అక్క‌డ రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు రాజీనామాలు స‌మ‌ర్పించి.. తిరిగి ఏపీకి రానున్నారు. అనంత‌రం వైసీపీకి రాజీనామా చేయ‌నున్నారు. బీద మ‌స్తాన్ రావు ప్ర‌ముఖ వ్యాపార వేత్త అన్న విష‌యం తెలిసిందే. కాగా.. ప్ర‌స్తుతం వైసీపీలో ఇలాంటి జంపింగులు చాలా మందే ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on August 28, 2024 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

18 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

44 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago