ఊహించినట్టుగానే వైసీపీలో రాజ్యసభ సభ్యుల జంపింగులకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. అయి తే.. వీరిలో జగన్ అత్యంత ఇష్టంగా భావించి.. మరీ రాజ్యసభ సీట్లు ఇచ్చిన వారు ఉండడమే ఆశ్చర్యంగా ఉంది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మోపిదేవి వెంకట రమణ, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్రావులు ప్రస్తుతం ఢిల్లీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరూ కూడా.. జగన్కు అత్యంత ఆప్తులన్న విషయం తెలిసిందే.
2019 ఎన్నికలకు ముందు.. బీద మస్తాన్రావు.. టీడీపీలో ఉన్నారు. తర్వాత.. ఆయన ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంతరం.. జగన్ ఆయనను రాజ్యసభకు పంపించారు. ఇక, మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. అనంతరం.. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. తర్వాత.. రాజ్యసభలో ఖాళీ అయిన సీట్లకు.. బీసీ కోటాలో మోపిదేవి వెంకట రమణను పంపించారు. అప్పట్లో వీరిద్దరూ కూడా జగన్ను ఆకాశానికి ఎత్తేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు వారిద్దరూ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇద్దరూ కూడా నేరుగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారనేది సమాచారం. ఢిల్లీ వెళ్లి.. అక్కడ రాజ్యసభ చైర్మన్కు రాజీనామాలు సమర్పించి.. తిరిగి ఏపీకి రానున్నారు. అనంతరం వైసీపీకి రాజీనామా చేయనున్నారు. బీద మస్తాన్ రావు ప్రముఖ వ్యాపార వేత్త అన్న విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం వైసీపీలో ఇలాంటి జంపింగులు చాలా మందే ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on August 28, 2024 6:18 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…