Political News

జ‌గ‌న్‌కు హ్యాండిస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యులు.. టీడీపీలోకి ఇద్ద‌రు!

ఊహించిన‌ట్టుగానే వైసీపీలో రాజ్య‌స‌భ స‌భ్యుల జంపింగుల‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. అయి తే.. వీరిలో జ‌గ‌న్ అత్యంత ఇష్టంగా భావించి.. మ‌రీ రాజ్య‌స‌భ సీట్లు ఇచ్చిన వారు ఉండ‌డ‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. గుంటూరు జిల్లా రేప‌ల్లెకు చెందిన మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మ‌స్తాన్‌రావులు ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వీరిద్ద‌రూ కూడా.. జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుల‌న్న విష‌యం తెలిసిందే.

2019 ఎన్నిక‌ల‌కు ముందు.. బీద మ‌స్తాన్‌రావు.. టీడీపీలో ఉన్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంత‌రం.. జ‌గ‌న్ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఇక‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. అనంత‌రం.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన సీట్ల‌కు.. బీసీ కోటాలో మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణను పంపించారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రూ కూడా జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వారిద్ద‌రూ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇద్ద‌రూ కూడా నేరుగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌నేది స‌మాచారం. ఢిల్లీ వెళ్లి.. అక్క‌డ రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు రాజీనామాలు స‌మ‌ర్పించి.. తిరిగి ఏపీకి రానున్నారు. అనంత‌రం వైసీపీకి రాజీనామా చేయ‌నున్నారు. బీద మ‌స్తాన్ రావు ప్ర‌ముఖ వ్యాపార వేత్త అన్న విష‌యం తెలిసిందే. కాగా.. ప్ర‌స్తుతం వైసీపీలో ఇలాంటి జంపింగులు చాలా మందే ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on August 28, 2024 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

2 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

3 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

6 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

6 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

7 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

9 hours ago