Political News

జ‌గ‌న్‌కు హ్యాండిస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యులు.. టీడీపీలోకి ఇద్ద‌రు!

ఊహించిన‌ట్టుగానే వైసీపీలో రాజ్య‌స‌భ స‌భ్యుల జంపింగుల‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. అయి తే.. వీరిలో జ‌గ‌న్ అత్యంత ఇష్టంగా భావించి.. మ‌రీ రాజ్య‌స‌భ సీట్లు ఇచ్చిన వారు ఉండ‌డ‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. గుంటూరు జిల్లా రేప‌ల్లెకు చెందిన మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మ‌స్తాన్‌రావులు ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వీరిద్ద‌రూ కూడా.. జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుల‌న్న విష‌యం తెలిసిందే.

2019 ఎన్నిక‌ల‌కు ముందు.. బీద మ‌స్తాన్‌రావు.. టీడీపీలో ఉన్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంత‌రం.. జ‌గ‌న్ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఇక‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. అనంత‌రం.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన సీట్ల‌కు.. బీసీ కోటాలో మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణను పంపించారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రూ కూడా జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వారిద్ద‌రూ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇద్ద‌రూ కూడా నేరుగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌నేది స‌మాచారం. ఢిల్లీ వెళ్లి.. అక్క‌డ రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు రాజీనామాలు స‌మ‌ర్పించి.. తిరిగి ఏపీకి రానున్నారు. అనంత‌రం వైసీపీకి రాజీనామా చేయ‌నున్నారు. బీద మ‌స్తాన్ రావు ప్ర‌ముఖ వ్యాపార వేత్త అన్న విష‌యం తెలిసిందే. కాగా.. ప్ర‌స్తుతం వైసీపీలో ఇలాంటి జంపింగులు చాలా మందే ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on August 28, 2024 6:18 pm

Share

Recent Posts

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

11 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

15 minutes ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago