వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో రోజా ఇక జగనన్నకు గుడ్ బై చెప్పేసినట్టేనని అంటున్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019లో విజయం దక్కించుకున్న రోజా.. మంత్రిగా కూడా రెండేళ్లపాటు అవకాశం చిక్కించుకున్నారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణం.. పైగా కూటమి దూకుడుతో వైసీపీ పుంజుకునేలా కనిపించడం లేదని సీనియర్లు చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో రోజా కూడా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పైగా తమిళనాడులోనే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పైగా తమిళనాడు సీఎం స్టాలిన్ను తరచుగా రోజా దంపతులు కలుస్తుండడం.. అక్కడి సంక్షేమ కార్యక్రమాలకు చెక్కుల రూపంలో సాయం చేస్తుండడం కూడా.. తెలిసిందే. ఇక, ఇప్పుడు డీఎంకేలో చేరేందుకు రోజా మార్గం సుగమం చేసుకున్నారనేది చర్చగా మారింది. వైసీపీకి అందుకే దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దీనికి దన్నుగా.. ఎప్పుడూ తన సోషల్ మీడియా మాధ్యమాలైన.. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్లలో జగన్ ఫొటోలు, వైసీపీ జెండాలను ఆమె తీసేశారు.
నిన్న మొన్నటి వరకు కూడీ డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జగన్ ఫొటోలను, జెండాలను పెట్టుకున్నారు. కానీ, రెండు రోజులుగా ఆమె వైఖరి మారిపోయింది. తాజాగా ఆమె డీపీలను మార్చేసి.. పూర్తిగా తన పేరును మాత్రమే పెట్టుకున్నారు. ఎక్కడా వైసీపీ అన్న పేరు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పరిణామాలతో ఇక, రోజా.. పార్టీ మార్పు ఖాయమైందనే చర్చకు బలం చేకూరింది. ఆమె భర్త సెల్వమణికి తమిళనాడు నేపథ్యం ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన దర్శకుడు కూడా. ఈ నేపథ్యంలోనే రోజా తన రాజీకయ రైలు బండిని రూటు మార్చుకునేలా చేశారని తెలుస్తోంది.
This post was last modified on August 27, 2024 10:46 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…