సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలికి సంబంధించిన లీకులు, అప్డేట్స్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు రేపుతున్నాయి. ముందు నాగార్జున ప్రత్యేక పాత్ర చేస్తున్నారని బయటికొచ్చింది. కానీ ఇటీవలే ఉపేంద్ర సెట్లో అడుగు పెట్టాడు. అంటే నాగ్ వద్దనుకున్న క్యారెక్టర్ ని తనకిచ్చారనే టాక్ చెన్నై వర్గాల్లో బలంగా ఉంది. ఒకవేళ కింగ్ కూడా ఉంటే ఎల్లుండి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అనౌన్స్ మెంట్ ఉంటే తప్ప నమ్మలేం. విక్రమ్ లో రోలెక్స్ తరహాలో ఇందులో లోకేష్ రెండు మూడు పవర్ ఫుల్ క్యామియోలు డిజైన్ చేశాడని టాక్.
తాజాగా అమీర్ ఖాన్ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే లోకేష్ కథ చెప్పాడని సానుకూల స్పందన వచ్చిందని ఇన్ సైడ్ న్యూస్. లాల్ సింగ్ చద్దా తర్వాత గ్యాప్ తీసుకున్న అమీర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సితారే జమీన్ పర్ ఒకటే. దక్షిణాది దర్శకులతో పని చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు కానీ ఇప్పుడు రజనితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కావడంతో నో చెప్పకపోవచ్చు. విక్రమ్, లియో, ఖైదీలు ఎంత బ్లాక్ బస్టర్ అయినా నార్త్ లో ఆశించిన మేజిక్ చేయలేకపోయాయి. అమీర్ లాంటి సపోర్ట్ ఉంటే సులువవుతుంది కాబట్టి అలా ప్లాన్ చేసి ఉండొచ్చు.
వచ్చే ఏడాది వేసవికి ప్లాన్ చేసుకున్న కూలిని తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇంకా మెయిన్ క్యాస్టింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టలేదు. బంగారం స్మగ్లింగ్ చుట్టూ ఎనభై తొంబై దశకంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా కూలీ రూపొందుతోంది. అక్టోబర్ 10 వెట్టయన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఖచ్చితంగా ఒక రిలీజ్ ఉండేలా చూసుకుంటున్న రజినీకాంత్ లిస్టులో తర్వాత కూడా యువ దర్శకులే ఉన్నారట. జైలర్ 2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ అది కాగానే ఫైనల్ వెర్షన్ ఓకే చేయించుకుని సెట్స్ పైకి తీసుకెళ్తాడు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…