Political News

రోజుకో రీజ‌న్‌.. అన్ని వేళ్లూ జ‌గ‌న్ వైపే!

వైసీపీ ఓట‌మికి.. ఇంకా రీజ‌న్లు వెతుకుతూనే ఉన్నారు. ఎన్నిక‌లు పూర్త‌యి.. రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసి మూడు మాసాలు అయిపోతున్నా.. ఇత‌మిత్థంగా త‌మ త‌ప్పుల‌ను తేల్చుకోలేక పోతున్నారు. దీంతో రోజుకో రీజ‌న్ ప‌ట్టుకుని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు పార్టీ సోష‌ల్ మీడియాలో భారీ మార్పులు తీసుకువ‌చ్చారు. అప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాను న‌డిపించిన సాయిరెడ్డిని ప‌క్క‌న పెట్టేశారు.

అప్ప‌టి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి సూచ‌ల‌నలు, స‌ల‌హాల‌తో ఆయ‌న కుమారుడు స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డిని తీసుకువ‌చ్చారు. దీనిని జ‌గ‌న్ గుడ్డిగా ఆమోదించార‌న్న‌ది.. పార్టీ నేత‌ల తాజా ఫిర్యా దు. రాజ‌కీయంగా క‌నీస ప‌రిజ్ఞానం కూడా లేని భార్గ‌వ‌రెడ్డికి కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో సోష‌ల్ మీడియాను అప్ప‌గించ‌డాన్ని తాను ముందు నుంచి వ్య‌తిరేకించాన‌ని.. అనంత‌పురం జిల్లాకుచెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు.

ఆదివారం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టిన స‌మావేశంలో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. త‌మ మాట‌కు విలువ లేకుండా పోయింద‌న్నారు. పైగా.. పాసు బుక్కుల‌పై జ‌గ‌న్ ఫొటోలు వ‌ద్ద‌న్నందుకు.. త‌న‌ను దూరం పెట్టార‌ని కూడా కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధానం ఇచ్చినా.. వైసీపీ సోష‌ల్ మీడియా త‌మ లాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

“ఒక విమ‌ర్శ వ‌చ్చిన‌ప్పుడు.. మ‌నం ఖండించాలి. ఎదురు దాడి చేయాలి. కానీ, ఈ రెండూ లేకుండా.. భ‌జ‌న చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు” అని ప‌రోక్షంగా ఆయ‌న స‌జ్జ‌ల ఫ్యామిలీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనినే త‌మ నాయ‌కుడు న‌మ్మిన‌ట్టు చెప్పుకొచ్చారు. సోష‌ల్ మీడియా ద్వారా చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌చారం వ‌దిలేసి.. ఏవేవో ప్ర‌చారం చేశార‌ని.. ముక్కుమొహం తెలియ‌ని వారితో చ‌ర్చ‌లు పెట్టార‌ని ఆయ‌న ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు.

This post was last modified on August 27, 2024 8:12 pm

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

35 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago