Political News

వ‌లంటీర్లు.. ఇక నుంచి అంతా ‘డిఫ‌రెంట్‌’…!

వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఏపీలో మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. గ‌త వైసీపీ హ‌యాంలో 2.3 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్లను నియ‌మించారు. వీరికి నెల‌కు రూ.5000 చొప్పున గౌర‌వ వేత‌నం ఇస్తూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేలా.. వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపేలా.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. వైసీపీ హ‌యాంలో నియ‌మితులైన వ‌లంటీర్ల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగిందనేది నిర్వివాదాంశం. ఎక్క‌డొ ఒక‌రిద్ద‌రు త‌ప్పులు చేయ‌డం అనేది అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ ఉన్న‌దే.

అయితే.. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల‌కు ముందు వ‌లంటీర్ల‌ను కొన‌సాగిస్తామ‌న్నారు. రూ.5000 గౌర‌వ వేత‌నం స్థానంలో రూ.10 వేలు ఇస్తామ‌ని కూడా చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చారు. అయితే.. ప్ర‌బుత్వం ఏర్ప‌డి 70 రోజులు దాటిపోయినా… వ‌లంటీర్ల‌ను ఎక్క‌డా వినియోగించుకోవ‌డం లేదు. వారి పేరు, ఊరు కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఈ విష‌యంపై కొన్నాళ్ల కింద‌ట శాస‌న‌ మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు కూడా తెలియ‌దు అని స‌మాధాన‌మే చెప్పారు.

అయితే.. తాజాగా మాత్రం స‌ర్కారు వ్యూహం మారింది. ఈ ద‌ఫా వ‌లంటీర్లను తెర‌మీదికి తీసుకురానుంది. అయితే.. వారితోనే పింఛ‌న్ల పంపిణీ చేయించే కార్య‌క్ర‌మానికి కాకుండా.. వేరే ప‌నులు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే నెల 1 న కూడా స‌చివాల‌య ఉద్యోగుల‌తోనే పింఛ‌న్లు పంపిణీ చేయించ‌నుంది. అయితే.. వ‌లంటీర్ల‌ను నైపుణ్య గ‌ణ‌న స‌హా.. ఇత‌ర అవ‌స‌రాల కోసం వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ఇదే విషయాన్ని స‌ర్కారు స్ప‌ష్టం చేసింది.

వ‌లంటీర్ల‌ను వినియోగించుకుంటామ‌ని.. వారిని తొల‌గించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. వారికి బ‌కాయి ఉన్న‌ రూ.5000 చొప్పున వేత‌నం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపింది. వ‌చ్చే నెల నుంచి రూ.10 వేల చొప్పున వారికి వేత‌నం ఇవ్వనున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో వారి సేవ‌ల‌ను వేరేగా వినియోగించు కోవ‌డంతోపాటు.. ఒక్కొరికీ 100 చొప్పున ఇళ్ల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్నారు. గ‌తంలో 50 ఇళ్ల‌కు మాత్ర‌మే ఒక వలంటీర్ ఉండ‌గా.. ఇప్పుడు ఈ సంఖ్య‌.. 100కు పెర‌గ‌నుంది.

This post was last modified on August 26, 2024 6:50 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

43 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

4 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

5 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

6 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

10 hours ago