కూటమి సర్కారు పాలనకు రెండు మాసాలు పూర్తయ్యాయి. దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది. కొందరు సూపర్ సిక్స్పై ప్రశ్నిస్తుంటే.. మరికొందరు చంద్రబాబు ఇలానే పాలించాలని కోరుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచన ఏంటి? అసలు ఆయన పంథా ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. వాస్తవానికి చంద్రబాబు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు గుప్పించారు. అయితే.. వాటిలో ఒక్క పింఛను తప్ప.. మిగిలిన వాటి ప్రస్తావన చేయడం లేదు.
పైగా.. చంద్రబాబు ఏమైనా బహిరంగ వేదికలపైకి రావడం లేదా? అంటే.. వస్తున్నారు. ప్రజలతో కలవడం లేదా? అంటే కలుస్తున్నారు. కానీ, సూపర్ సిక్స్ అనే మాట వినిపించడం లేదు. ఎన్నికలకు ముందు మాత్రం ఆయన ఎక్కడకు వెళ్లినా.. సూపర్ సిక్స్ గురించి పదే పదే చెప్పారు. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, ఇప్పడు ఆ ఊసే లేకుండా పోయింది. తాజాగా జరిగిన గ్రామ సభల్లోనూ సూపర్ సిక్స్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
అయితే.. ప్రజల నుంచి పెద్దగా సూపర్ సిక్స్ హామీల గురించి వినిపించకపోవడం గమనార్హం. దీనికి కారణం.. రాష్ట్రం అభివృద్ది చెందితే చాలనే మెజారిటీ ప్రజలే చంద్రబాబుకు ఓటేశారు. ఆయన అనుభవాన్ని రంగరించి.. పరిశ్రమలు తీసుకువచ్చి.. ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలని కోరుకున్నారు. రాజధాని నిర్మాణం జరిగే చాలని అనుకున్నవారే మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు చద్రబాబు అదే పని చేస్తున్నారు.
దీనికి తోడు అప్పులు చేసి భారీ ఎత్తున నగదు పంచినా.. జగన్ను ప్రజలు ఆదరించలేదు. కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యేకంగా అప్పులు చేసి.. ప్రజలకు పంచినా.. తన కు వచ్చే మైలేజీ ఏమీ లేదని చంద్రబాబు సైతం భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు సూపర్ సిక్స్లో కీలకమైన పథకాలను ప్రవేశ పెట్టే యోచన అయితే .. కనిపించడం లేదు. తాజాగా ఆన్లైన్ చానెళ్లు చేసిన సర్వేల్లోనూ నూటికి 70 మంది ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. చంద్రబాబు ప్రజల నాడిని పసిగట్టి దాని ప్రకారమే ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
This post was last modified on August 26, 2024 6:01 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…