టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం రెండు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని తిమ్మిడిగుంట చెరువు పరిధిలో దీన్ని అక్రమంగా నిర్మించారనే కారణంతో ప్రభుత్వం కూల్చివేయగా.. నాగార్జున ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
చెరువులో ఒక్క సెంట్ భూమిని కూడా ఆక్రమించలేదని.. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని ఆయన అంటున్నారు. ఈ విషయమై కోర్టుకు వెళ్లి కూల్చివేతకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు నాగ్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు నడుస్తుండగా.. సీపీఐ సీనియర్ నేత నారాయణ ఈ ప్రాంతాన్ని పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాగార్జునపై ఆయన ధ్వజమెత్తారు.
సాధారణంగా చెరువు ఉన్న చోట.. చెరువు పరిధి అయిపోయాక కూడా వంద మీటర్ల బఫర్ జోన్ ఉంటుందని.. దాన్ని దాటే నిర్మాణాలు చేపట్టాలని.. కానీ నాగార్జున మాత్రం బఫర్ జోన్లో కూడా కాకుండా చెరువులోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించారని నారాయణ అన్నారు. నాగార్జున పెద్ద సినిమా స్టార్ కావచ్చని.. సినిమాలతో పాటు బిగ్ బాస్ ద్వారా ఎంతో సంపాదిస్తారని.. కానీ చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ కట్టాల్సినంత కక్కుర్తి ఆయనకు ఎందుకని నారాయణ ప్రశ్నించారు.
నాగ్ తండ్రి ఆదర్శవంతుడని.. కానీ నాగ్ మాత్రం తప్పు చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఈ కట్టడాన్ని కూల్చివేసి మంచి పని చేసిందని.. అంతటితో ఆగకుండా పదేళ్లుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా సంపాదించిన ఆదాయం మొత్తం నాగ్ నుంచి కక్కించాలని.. ఆ డబ్బుతో పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇళ్లు కట్టించాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఇంకా చాలామంది చెరువులను ఆక్రమించి అనేక నిర్మాణాలు చేశారని.. వాటన్నింటినీ కూల్చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
This post was last modified on August 26, 2024 1:47 am
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…