Political News

నెల‌కు రెండు సార్లు ప్ర‌జ‌ల్లోకి.. చంద్ర‌బాబు స్పెష‌ల్‌

ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 70 రోజుల‌కు పైగానే అయింది. ఈ మ‌ధ్య కాలంలో నెల‌కు రెండు సార్లు సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌లు వినేందుకు ప్రాదాన్యం ఇస్తున్నారు. వారికి చేరువ‌గా కూడా ఉంటున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ .. నెల‌కు కాదుక‌దా.. ఆరు మాసాల‌కు ఒక్క‌సారి కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేని ప‌రిస్థితిని క‌ల్పించుకున్నారు. వ‌చ్చినా.. నేరుగా ప్ర‌జ‌ల‌తో క‌లిసే ప‌రిస్థితి లేదు. ప‌రాదు, డేరాలు.. క‌ట్టుకునిరావడం.. స‌భ‌ల‌కు వ‌చ్చేవారికి ఆంక్ష‌లు విధించ‌డం అంద‌రికీ తెలిసిందే.

దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లు స‌భ‌ల‌కు వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. దీంతో ప్ర‌జ‌ల‌కు-జ‌గ‌న్‌కు మ‌ధ్య దూరం పెరిగింది. ఇక‌, చంద్ర‌బాబు విష యానికి వ‌స్తే.. దీనికి భిన్నంగా కార్య‌క్ర‌మాలు రూపొందించుకుంటున్నారు. ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. నెల‌కు ఖ‌చ్చితంగా రెండు నుంచి మూడు సార్ల‌యినా.. ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌ల ముంగిట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిన రెండు మాసాల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటే.. చంద్ర‌బాబు రెండేసి సార్లు చొప్పున ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. ప్ర‌తి నెలా 1వ‌ తేదీన ఖ‌చ్చితంగా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల పంపిణీ పేరుతో ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి.. ఉద‌యం 6 గంట‌ల‌కే ల‌బ్ధిదారుల ఇంటికి వెళ్తున్నారు.

ఎంపిక చేసిన జిల్లాల్లోగ‌త రెండుసార్లు(జూలై1, ఆగ‌స్టు 1) చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పింఛ‌ను దారుల క‌ష్టాలు విన్నారు. వారికి నేనున్నానంటూ భ‌రోసా క‌ల్పించారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత‌ చేతులు ముడుచుకుని స‌చివాల‌యానికో.. ఉండ‌వ‌ల్లి నివాసానికో చంద్ర‌బాబు ప‌రిమితం కాలేదు. చేనేత జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయా వ‌ర్గాల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. త‌ర్వాత విజ‌య‌వాడ‌లోనూ భారీ ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించారు. అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించారు. మూడు సార్లు ఈ రెండు మాసాల కాలంలో ఢిల్లీ వెళ్లివ‌చ్చారు.

మ‌రోవైపు.. ఎక్క‌డ ఏ స‌మ‌స్య వ‌చ్చినా..వెళ్లి బాధితుల‌ను ఓదారుస్తున్నారు. విశాఖ‌లో సంభవించిన అచ్యుతాపురం ఘ‌ట‌న‌లో బాధితుల‌ను ఓదార్చేందుకు, ప‌రిహారం ప్ర‌క‌టించేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. అదేవిధంగా గ్రామ స‌భ‌ల పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలోనూ ఆయ‌న పాల్గొన్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ప్ర‌జాద‌ర్బార్ పేరుతో మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి కూడా చంద్ర‌బాబు త‌ర‌చుగా వెళ్తున్నారు. ఇక్క‌డ‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల క‌ష్టాలు వింటున్నారు. వారి నుంచి విన‌తులు తీసుకుంటున్నారు. ఇలా.. ఈ రెండు మాసాల కాలంలో ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్న ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago