తెలుగుదేశంపార్టీకి ఊహిచని షాక్ తగిలింది. ఎన్టీయార్ పార్టీని పెట్టినప్పటి నుండి పనిచేస్తున్న సీనియర్ నేత గద్దె బాబూరావు ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. బాబూరావు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి ఎంఎల్సీగా పనిచేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్దె విజయనగరం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరు. అలాగే ఉత్తరాంధ్రలోని పార్టీ బీసీ నేతల్లో కీలకంగా ఉంటున్నారు. అలాంటిది హఠాత్తుగా గద్దె పార్టీకి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు.
రాజీనామా చేసిన గద్దె మాట్లాడుతూ ఇపుడున్నది ఎన్టీయార్ స్ధాపించిన టిడిపి కాదన్నారు. పార్టీకి రాజీనామా చేసిన వెంటనే గద్దె ఇటువంటి కామెంట్లు చేయటమే విచిత్రంగా ఉంది. పార్టీ నుండి ఎన్టీయార్ ను పంపేసి సుమారు 25 ఏళ్ళవుతోంది. ముఖ్యమంత్రిగా దింపేసి, అధ్యక్షుడిగా దింపేసిన ఇన్ని సంవత్సరాలకు బాబురావు ఇటువంటి కామెంట్లు చేయటమంటే ప్రత్యేకమైన అజెండా ఉన్నట్లు అర్ధమవుతోంది. పైగా పార్టీలో సీనియర్లకి గౌరవం లేదనటం కూడా ఆశ్చర్యమనే చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల తర్వాతే ఉత్తరాంధ్రలోని టిడిపి నేతల్లో అంతర్మధనం మొదలైందన్నది వాస్తవం. జగన్ ప్రకటించిన రాజధానిగా విశాఖనగరాన్ని వ్యతిరేకించలేక అలాగాని బహిరంగంగా మద్దతు ప్రకటించలేక చాలామంది టిడిపి నేతలు అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే మొన్ననే ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేశారు. జగన్ ప్రకటన చేయగానే స్వాగతిస్తు మాజీ ఎంఎల్ఏ రహమాన్ లాంటి వాళ్ళు టిడిపికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది.
మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విజయనగరం జిల్లాలో టిడిపి అసలు ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. ఉన్న ఎంపి స్ధానంలో కూడా వైసిపినే గెలిచింది. దానికితోడు దశాబ్దాల పాటు పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి రాజు కూడా వయస్సయిపోయింది. ప్రస్తుతం రాజుగారు 76 ఏళ్ళలో అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో మరో సీనియర్ నేత రాజీనామా అంటే పార్టీకి ఇబ్బందనే చెప్పాలి.
This post was last modified on September 27, 2020 3:24 pm
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…