బీజేపీ రాష్ట్ర మంత్రి, సీనియర్ నాయకుడు సత్యకుమార్ యాదవ్కు కొత్త చిక్కు వచ్చింది. పార్టీ పరంగా కంటే.. మంత్రిత్వ శాఖ పరంగా ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నాయకుడు కావడం.. పైగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సత్యకుమార్ ఓ కీలక విషయంలో చిక్కులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే ఆయుష్మాన్ భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
అంతేకాదు.. బీజేపీ పాలిత, లేదా ఎన్డీయే కూటమి పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనూ ఆయుష్మా భారత్ కార్డులను పెంచాలని కేంద్రంలోని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టింది. ఇది.. కూటమి పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలకు బాగానే ఉన్నప్పటికీ.. ఏపీ వంటి బహుళ కార్యక్రమాలు అమలవుతున్న రాష్ట్రంలో మాత్రం ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే.. ఏపీ ప్రజలు ఆరోగ్యశ్రీ పథకానికి అలవాటయ్యారు. వారికి ఏ చిన్న అనారోగ్యం కలిగినా.. ఆరోగ్య శ్రీని వాడుకుంటున్నారు.
పైగా.. జగన్ హయాంలో ఈ పథకం కింద.. మరిన్ని కేసులు కూడా చేరాయి. దీంతో ఇది పేదలకు చాలా వరకు అందివచ్చిన పథకంగా పేరు తెచ్చుకుంది. ఎన్నికలకు ముందు దీని పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచారు. దీనిని అనేక మంది పేదలు కూడా వినియోగించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ పథకాన్ని ఎత్తేయాలన్నది కేంద్రం నుంచి తమ నాయకుడు, మంత్రి సత్యకుమార్ పై పెరుగుతున్న ఒత్తిడిగా చెబుతున్నారు. అంతేకాదు.. ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని కూడా చెబుతున్నారు.
ఇక, ఆరోగ్య శాఖ విషయంలో సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యతలను మంత్రి సత్యకుమార్కే ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆరోగ్య శ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేయాలని చూస్తున్నారు.కానీ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఎలా ఉంటుందనే విషయంపైనే తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు.. ఆరోగ్య శ్రీలో 25 లక్షల వరకు వైద్య సదుపాయం ఉంటే.. ఆయుష్మాన్ భారత్లో రూ.5 లక్షల వరకే ఉంది. ఇదిప్రజలు హర్షించే అవకాశం లేదు. ఈ పరిణామాలతోనే సత్యకుమార్ కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. చివరకు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 20, 2024 2:45 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…