టీడీపీ అధినేత చంద్రబాబుకు, దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న ఫెవికాల్ బం ధం గురించి అందరికీ తెలిసిందే. 1983లో రామారావు కోసం అహర్నిశలు పనిచేసిన.. రామోజీ తర్వాత కాలంలో ఆయనతో విభేదించారు. ఇదేసమయంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. దీనికికారణం వేరే ఉందని అంటారు. రామోజీ ఫిలింసిటీ ఆలోచన 1980లలో నేరామోజీరావు మొగ్గ తొడిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టూడియోలను ఆయన పరిశీలించారు.
ఈక్రమంలో అంతకుమించిన ఫిలిం నగరాన్ని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేయాలని, అది కూడా హైదరా బాద్కు సమీపంలో ఉంచాలని ఆయన అనుకున్నారు. ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు సహకరించలేదనేది ఒక వాదన. దీనిలో నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, ప్రచారం అయితే ఉంది. రామోజీరావు.. 1000ఎకరాలు ఇవ్వాలని కోరినట్టు.. దీనికి రామారావు వ్యతిరేకించినట్టు ప్రచారం ఉంది. ఇక, చంద్రబాబు పగ్గాలుచేపట్టాక.. క్షణాలలో దీనికి అనుమతి వచ్చేసిందని అంటారు.
దీంతో అటు చంద్రబాబుకు ఇటు రామోజీకి..పరస్పరం అవగాహన కుదిరింది. ఆ తర్వాత.. చంద్రబాబు కు ఈనాడు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. 2014లో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ఈనాడు పాత్ర ఉంది. ఇక, 2024 ఎన్నికల్లోనూ ఈనాడు పాత్ర అమోఘం. ఈ నేపథ్యంలోరామోజీ రుణాన్ని తీర్చుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఎడిటర్స్ గిల్డ్ప్రతిపాదనను ఆయన దాదాపు అంగీకరించినట్టు సమాచారం.
దీని ప్రకారం.. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టనున్నారని తెలిసిం ది. ఇదేసమయంలో గుడివాడ ప్రాంతానికి కూడా రామోజీరావుపేరు పెట్టనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతు న్నాయి. రామోజీరావు గుడివాడలో జన్మించారు కాబట్టి.. ఆయనపేరును గుడివాడ నగరానికి పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని పార్టీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. `రామోజీ-గుడివాడ నియోజకవర్గం` పేరును పరిశీలిస్తున్నట్టు తెలిపాయి. మరి చంద్రబాబు ఈ రూపంలో రుణం తీర్చుకుంటారేమో చూడాలి.
This post was last modified on August 20, 2024 7:52 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…