టీడీపీ అధినేత చంద్రబాబుకు, దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న ఫెవికాల్ బం ధం గురించి అందరికీ తెలిసిందే. 1983లో రామారావు కోసం అహర్నిశలు పనిచేసిన.. రామోజీ తర్వాత కాలంలో ఆయనతో విభేదించారు. ఇదేసమయంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. దీనికికారణం వేరే ఉందని అంటారు. రామోజీ ఫిలింసిటీ ఆలోచన 1980లలో నేరామోజీరావు మొగ్గ తొడిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టూడియోలను ఆయన పరిశీలించారు.
ఈక్రమంలో అంతకుమించిన ఫిలిం నగరాన్ని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేయాలని, అది కూడా హైదరా బాద్కు సమీపంలో ఉంచాలని ఆయన అనుకున్నారు. ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు సహకరించలేదనేది ఒక వాదన. దీనిలో నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, ప్రచారం అయితే ఉంది. రామోజీరావు.. 1000ఎకరాలు ఇవ్వాలని కోరినట్టు.. దీనికి రామారావు వ్యతిరేకించినట్టు ప్రచారం ఉంది. ఇక, చంద్రబాబు పగ్గాలుచేపట్టాక.. క్షణాలలో దీనికి అనుమతి వచ్చేసిందని అంటారు.
దీంతో అటు చంద్రబాబుకు ఇటు రామోజీకి..పరస్పరం అవగాహన కుదిరింది. ఆ తర్వాత.. చంద్రబాబు కు ఈనాడు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. 2014లో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ఈనాడు పాత్ర ఉంది. ఇక, 2024 ఎన్నికల్లోనూ ఈనాడు పాత్ర అమోఘం. ఈ నేపథ్యంలోరామోజీ రుణాన్ని తీర్చుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఎడిటర్స్ గిల్డ్ప్రతిపాదనను ఆయన దాదాపు అంగీకరించినట్టు సమాచారం.
దీని ప్రకారం.. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టనున్నారని తెలిసిం ది. ఇదేసమయంలో గుడివాడ ప్రాంతానికి కూడా రామోజీరావుపేరు పెట్టనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతు న్నాయి. రామోజీరావు గుడివాడలో జన్మించారు కాబట్టి.. ఆయనపేరును గుడివాడ నగరానికి పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని పార్టీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. `రామోజీ-గుడివాడ నియోజకవర్గం` పేరును పరిశీలిస్తున్నట్టు తెలిపాయి. మరి చంద్రబాబు ఈ రూపంలో రుణం తీర్చుకుంటారేమో చూడాలి.
This post was last modified on August 20, 2024 7:52 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…