టీడీపీ అధినేత చంద్రబాబుకు, దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న ఫెవికాల్ బం ధం గురించి అందరికీ తెలిసిందే. 1983లో రామారావు కోసం అహర్నిశలు పనిచేసిన.. రామోజీ తర్వాత కాలంలో ఆయనతో విభేదించారు. ఇదేసమయంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. దీనికికారణం వేరే ఉందని అంటారు. రామోజీ ఫిలింసిటీ ఆలోచన 1980లలో నేరామోజీరావు మొగ్గ తొడిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టూడియోలను ఆయన పరిశీలించారు.
ఈక్రమంలో అంతకుమించిన ఫిలిం నగరాన్ని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేయాలని, అది కూడా హైదరా బాద్కు సమీపంలో ఉంచాలని ఆయన అనుకున్నారు. ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు సహకరించలేదనేది ఒక వాదన. దీనిలో నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, ప్రచారం అయితే ఉంది. రామోజీరావు.. 1000ఎకరాలు ఇవ్వాలని కోరినట్టు.. దీనికి రామారావు వ్యతిరేకించినట్టు ప్రచారం ఉంది. ఇక, చంద్రబాబు పగ్గాలుచేపట్టాక.. క్షణాలలో దీనికి అనుమతి వచ్చేసిందని అంటారు.
దీంతో అటు చంద్రబాబుకు ఇటు రామోజీకి..పరస్పరం అవగాహన కుదిరింది. ఆ తర్వాత.. చంద్రబాబు కు ఈనాడు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. 2014లో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ఈనాడు పాత్ర ఉంది. ఇక, 2024 ఎన్నికల్లోనూ ఈనాడు పాత్ర అమోఘం. ఈ నేపథ్యంలోరామోజీ రుణాన్ని తీర్చుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఎడిటర్స్ గిల్డ్ప్రతిపాదనను ఆయన దాదాపు అంగీకరించినట్టు సమాచారం.
దీని ప్రకారం.. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టనున్నారని తెలిసిం ది. ఇదేసమయంలో గుడివాడ ప్రాంతానికి కూడా రామోజీరావుపేరు పెట్టనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతు న్నాయి. రామోజీరావు గుడివాడలో జన్మించారు కాబట్టి.. ఆయనపేరును గుడివాడ నగరానికి పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని పార్టీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. `రామోజీ-గుడివాడ నియోజకవర్గం` పేరును పరిశీలిస్తున్నట్టు తెలిపాయి. మరి చంద్రబాబు ఈ రూపంలో రుణం తీర్చుకుంటారేమో చూడాలి.
This post was last modified on August 20, 2024 7:52 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…