తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం సెక్రటేరియట్ ముందు తమ హయాంలో కేటాయిం చిన స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని పెడుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాగే చేస్తే.. తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారం లోకి వస్తామని.. అప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్గాంధీ పేరును తాము అధికారంలోకి వచ్చాక తీసేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో ఏర్పాటు చేసే రాజీవ్ విగ్రహాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. గతంలో తాము పదేళ్లు పాలించిన సమయంలోనూ కాంగ్రెస్ నాయకుల విగ్రహాల జోలికికానీ.. వారి పేర్లను మార్చడం కానీ చేయలేదన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస విజ్ఞత లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ పేరును తీసేసి పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ లేదా.. తెలంగాణ బిడ్డల పేర్లు పెడతా మని చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో కేటీఆర్ పోస్టు చేశారు. కాగా, సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ‘‘తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు.
This post was last modified on August 20, 2024 7:24 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…