తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం సెక్రటేరియట్ ముందు తమ హయాంలో కేటాయిం చిన స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని పెడుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాగే చేస్తే.. తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారం లోకి వస్తామని.. అప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్గాంధీ పేరును తాము అధికారంలోకి వచ్చాక తీసేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో ఏర్పాటు చేసే రాజీవ్ విగ్రహాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. గతంలో తాము పదేళ్లు పాలించిన సమయంలోనూ కాంగ్రెస్ నాయకుల విగ్రహాల జోలికికానీ.. వారి పేర్లను మార్చడం కానీ చేయలేదన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస విజ్ఞత లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ పేరును తీసేసి పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ లేదా.. తెలంగాణ బిడ్డల పేర్లు పెడతా మని చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో కేటీఆర్ పోస్టు చేశారు. కాగా, సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ‘‘తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు.
This post was last modified on August 20, 2024 7:24 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…