తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం సెక్రటేరియట్ ముందు తమ హయాంలో కేటాయిం చిన స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని పెడుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాగే చేస్తే.. తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారం లోకి వస్తామని.. అప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్గాంధీ పేరును తాము అధికారంలోకి వచ్చాక తీసేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో ఏర్పాటు చేసే రాజీవ్ విగ్రహాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. గతంలో తాము పదేళ్లు పాలించిన సమయంలోనూ కాంగ్రెస్ నాయకుల విగ్రహాల జోలికికానీ.. వారి పేర్లను మార్చడం కానీ చేయలేదన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస విజ్ఞత లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ పేరును తీసేసి పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ లేదా.. తెలంగాణ బిడ్డల పేర్లు పెడతా మని చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో కేటీఆర్ పోస్టు చేశారు. కాగా, సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ‘‘తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు.
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…