Political News

శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్చేస్తాం: కేటీఆర్‌

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం కోసం సెక్ర‌టేరియ‌ట్ ముందు త‌మ హ‌యాంలో కేటాయిం చిన స్థ‌లంలో రాజీవ్‌గాంధీ విగ్ర‌హాన్ని పెడుతుండ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇలాగే చేస్తే.. తీవ్ర‌ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌ని, తాము మ‌ళ్లీ అధికారం లోకి వ‌స్తామ‌ని.. అప్పుడు తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని తెలిపారు.

శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ఉన్న రాజీవ్‌గాంధీ పేరును తాము అధికారంలోకి వ‌చ్చాక తీసేస్తామ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం స్థానంలో ఏర్పాటు చేసే రాజీవ్ విగ్ర‌హాన్ని కూడా తొల‌గిస్తామ‌ని చెప్పారు. గ‌తంలో తాము ప‌దేళ్లు పాలించిన స‌మ‌యంలోనూ కాంగ్రెస్ నాయ‌కుల విగ్ర‌హాల జోలికికానీ.. వారి పేర్ల‌ను మార్చ‌డం కానీ చేయ‌లేద‌న్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌నీస విజ్ఞ‌త లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఖ‌రి ఇలానే ఉంటే.. తాము అధికారంలోకి వ‌చ్చాక శంషాబాద్ విమానాశ్ర‌యానికి రాజీవ్ పేరును తీసేసి పీవీ న‌ర‌సింహారావు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ లేదా.. తెలంగాణ బిడ్డ‌ల పేర్లు పెడ‌తా మ‌ని చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు. కాగా, సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ‘‘తెలంగాణ బహుజనుల‌ ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు.

This post was last modified on August 20, 2024 7:24 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

16 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

1 hour ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

1 hour ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago