Political News

రాఖీ ర‌గ‌డ‌: జ‌గ‌న్ వ‌ర్సెస్ ష‌ర్మిల‌

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న సోద‌రి, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య కుటుంబ వివాదాలు స‌హా.. రాజ‌కీయ వివాదాలు కూడా ఓ రేంజ్‌లో కొన‌సాగుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అన్న జ‌గ‌న్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఆమె తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌భావంతో పాటు ప్ర‌జ‌ల్లో పెల్లుబికిన వ్య‌తిరేక‌త కార‌ణంగా 151 స్థానాలున్న‌వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమితం అయిపోయింది. అయితే.. ఈ వివాదాల‌కు రాఖీ పండుగ‌తో అయినా.. ఫుల్ స్టాప్ ప‌డతాయ‌ని అంద‌రూ అనుకున్నారు. సోమవారం దేశం యావ‌త్తు రాఖీ పౌర్ణ‌మిని ఘ‌నంగా నిర్వ‌హించుకుంది.

తెలంగాణ మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే కేటీఆర్‌.. త‌న సోద‌రిని త‌లుచుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏటా ఆయ‌న‌కు సోద‌రి, ఎమ్మెల్సీ క‌విత రాఖీ క‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆమె లిక్క‌ర్ కేసులో చిక్కుకుని తీహార్ జైల్లో ఉండ‌డం తో ఈ అవ‌కాశం లేకుండా పోయింది. దీనిని నేరుగా ప్ర‌స్తావించ‌క‌పోయినా.. చెల్లితో రాఖీ క‌ట్టించుకోలేక పోయాన‌ని మాత్రం కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటు చూస్తే.. అన్నా.. చెల్లెళ్లు ష‌ర్మిల‌, జ‌గ‌న్‌లు బాగానే ఉన్నా.. రాఖీ పండుగ‌కు.. వారు క‌లుసుకోలేక పోవ‌డం.. పైగా ష‌ర్మిల అస‌లు జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న లేకుండానే వ్య‌వ‌హ‌రించ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

రాఖీ పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల చేసిన ట్వీట్‌లో కూడా .. ఎక్క‌డా సొంత అన్న ప్ర‌స్తావ‌న లేదు. తన‌తో ర‌క్త సంబంధం లేకపోయినా.. త‌న‌ను ఆద‌రిస్తున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ష‌ర్మిల శుభాకాంక్ష‌లు తెలిపారు. `దేవుడు మిమ్మ‌ల్ని ఆశీర్వ దించాల‌ని కోరుకుంటున్నా“ అంటూ ఆమె పోస్టు చేశారు. అయితే.. ఈ పోస్టులో కాంగ్రెస్ అగ్ర‌నేత  రాహుల్‌, పార్టీ నాయ‌కురాలు సోనియాగాంధీ, త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌హా ఇత‌ర నేత‌ల ఫొటోల‌ను మాత్ర‌మే ష‌ర్మిల పోస్టు చేశారు. మాట మాత్రంగా కూడా .. ఎక్క‌డా జ‌గ‌న్ పేరును కానీ.. ఊరును కానీ.. ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వీరి మ‌ధ్య వివాదాలు.. విభేదాలు.. రాఖీ పండుగ‌కు కూడా అలుముకున్నాయ‌న్న చ‌ర్చ సాగుతోంది.

రెండేళ్లుగా ఇంతే!

గ‌త రెండేళ్లుగా జ‌గ‌న్‌కు ష‌ర్మిల రాఖీ క‌ట్ట‌డం లేదు. తాను తెలంగాణ పార్టీ పెట్ట‌డానికి ముందు మాత్రం ఏపీకి వ‌చ్చి జ‌గ‌న్కు రాఖీ క‌ట్టిన ఆమె.. త‌ర్వాత‌.. మాత్రం ఈ పండుగ‌కు దూరంగా ఉండిపోయారు. ఇదేస‌మ‌యంలో రాహుల్‌కు మాత్రం శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో అన్నా చెల్లెళ్ల మ‌ధ్య వివాదాలు విభేదాలు ఇప్ప‌ట్లో తీరేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. వైసీపీ అధినేత‌కు గ‌తంలో రాఖీలు క‌ట్టి సంబ‌రాలు చేసిన ప‌లువురు వైసీపీ నాయ‌కురాళ్లు(రోజా, పుష్ప శ్రీవాణి, సుచ‌రిత ప‌లువురు) ఇప్పుడు సంద‌డి చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 20, 2024 3:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమయం దగ్గర పడుతోంది వీరమల్లూ

వాయిదాల పర్వంలో మునిగి తేలుతున్న హరిహర వీరమల్లు మే 9 విడుదల కావడం ఖరారేనని యూనిట్ వర్గాలు అంటున్నా ప్రమోషన్లు…

16 minutes ago

ఒక్క సీటు కూడా రాలేదు.. కానీ పవన్ ఫోకస్ అక్కడే

ఏపీలోని గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేన అధినేత, ఏపీ…

58 minutes ago

వావ్.. తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్

తెలుగమ్మాయిలకు తెలుగులో ఆశించిన అవకాశాలు రావు కానీ.. వాళ్లు వేరే భాషల్లోకి వెళ్లి సత్తా చాటుతుంటారు. అంజలి, ఆనంది, శ్రీదివ్య,…

1 hour ago

ఎక్స్‌క్లూజివ్: హృతిక్‌తో బాబీ

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్లు ఒక్కొక్కరుగా సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శకులకు అక్కడ మాంచి డిమాండ్ ఏర్పడింది.…

1 hour ago

జగన్ చేసిన తప్పుకు బాబును నిలదీసిన షర్మిల

ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిన సంగతి తెలిసిందే.…

2 hours ago

నానికి మరో జాక్ పాట్

కొన్నేళ్లుగా టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ఊపు మామూలుగా లేదు. ఇటు హీరోగా వరుస హిట్లు కొడుతున్నాడు. అటు నిర్మాతగానూ…

2 hours ago