Political News

రాఖీ ర‌గ‌డ‌: జ‌గ‌న్ వ‌ర్సెస్ ష‌ర్మిల‌

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న సోద‌రి, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య కుటుంబ వివాదాలు స‌హా.. రాజ‌కీయ వివాదాలు కూడా ఓ రేంజ్‌లో కొన‌సాగుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అన్న జ‌గ‌న్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఆమె తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌భావంతో పాటు ప్ర‌జ‌ల్లో పెల్లుబికిన వ్య‌తిరేక‌త కార‌ణంగా 151 స్థానాలున్న‌వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమితం అయిపోయింది. అయితే.. ఈ వివాదాల‌కు రాఖీ పండుగ‌తో అయినా.. ఫుల్ స్టాప్ ప‌డతాయ‌ని అంద‌రూ అనుకున్నారు. సోమవారం దేశం యావ‌త్తు రాఖీ పౌర్ణ‌మిని ఘ‌నంగా నిర్వ‌హించుకుంది.

తెలంగాణ మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే కేటీఆర్‌.. త‌న సోద‌రిని త‌లుచుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏటా ఆయ‌న‌కు సోద‌రి, ఎమ్మెల్సీ క‌విత రాఖీ క‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆమె లిక్క‌ర్ కేసులో చిక్కుకుని తీహార్ జైల్లో ఉండ‌డం తో ఈ అవ‌కాశం లేకుండా పోయింది. దీనిని నేరుగా ప్ర‌స్తావించ‌క‌పోయినా.. చెల్లితో రాఖీ క‌ట్టించుకోలేక పోయాన‌ని మాత్రం కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటు చూస్తే.. అన్నా.. చెల్లెళ్లు ష‌ర్మిల‌, జ‌గ‌న్‌లు బాగానే ఉన్నా.. రాఖీ పండుగ‌కు.. వారు క‌లుసుకోలేక పోవ‌డం.. పైగా ష‌ర్మిల అస‌లు జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న లేకుండానే వ్య‌వ‌హ‌రించ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

రాఖీ పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల చేసిన ట్వీట్‌లో కూడా .. ఎక్క‌డా సొంత అన్న ప్ర‌స్తావ‌న లేదు. తన‌తో ర‌క్త సంబంధం లేకపోయినా.. త‌న‌ను ఆద‌రిస్తున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ష‌ర్మిల శుభాకాంక్ష‌లు తెలిపారు. `దేవుడు మిమ్మ‌ల్ని ఆశీర్వ దించాల‌ని కోరుకుంటున్నా“ అంటూ ఆమె పోస్టు చేశారు. అయితే.. ఈ పోస్టులో కాంగ్రెస్ అగ్ర‌నేత  రాహుల్‌, పార్టీ నాయ‌కురాలు సోనియాగాంధీ, త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌హా ఇత‌ర నేత‌ల ఫొటోల‌ను మాత్ర‌మే ష‌ర్మిల పోస్టు చేశారు. మాట మాత్రంగా కూడా .. ఎక్క‌డా జ‌గ‌న్ పేరును కానీ.. ఊరును కానీ.. ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వీరి మ‌ధ్య వివాదాలు.. విభేదాలు.. రాఖీ పండుగ‌కు కూడా అలుముకున్నాయ‌న్న చ‌ర్చ సాగుతోంది.

రెండేళ్లుగా ఇంతే!

గ‌త రెండేళ్లుగా జ‌గ‌న్‌కు ష‌ర్మిల రాఖీ క‌ట్ట‌డం లేదు. తాను తెలంగాణ పార్టీ పెట్ట‌డానికి ముందు మాత్రం ఏపీకి వ‌చ్చి జ‌గ‌న్కు రాఖీ క‌ట్టిన ఆమె.. త‌ర్వాత‌.. మాత్రం ఈ పండుగ‌కు దూరంగా ఉండిపోయారు. ఇదేస‌మ‌యంలో రాహుల్‌కు మాత్రం శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో అన్నా చెల్లెళ్ల మ‌ధ్య వివాదాలు విభేదాలు ఇప్ప‌ట్లో తీరేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. వైసీపీ అధినేత‌కు గ‌తంలో రాఖీలు క‌ట్టి సంబ‌రాలు చేసిన ప‌లువురు వైసీపీ నాయ‌కురాళ్లు(రోజా, పుష్ప శ్రీవాణి, సుచ‌రిత ప‌లువురు) ఇప్పుడు సంద‌డి చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 20, 2024 3:25 am

Share

Recent Posts

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

48 minutes ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

1 hour ago

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…

1 hour ago

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

2 hours ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

3 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

4 hours ago