రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతున్నాయో.. అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో సంచలన వ్యవహారాలపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. తాజాగా ఇలాంటి చర్చే తెరమీదికి వచ్చింది. జగన్ కన్నా షర్మిల బెటరా? అనేది ప్రధాన అంశం. ఎందుకంటే.. రాజకీయాలను ఎంత వరకు చేయాలో.. అంత వరకే చేయడం.. ఎక్కడ వరకు మాట్లాడాలో అక్కడితోనే సరిపుచ్చడం వంటివి షర్మిలకు తెలిసినంతగా జగన్ కు తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా ఏపీ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ప్రబుత్వం వైపు నుంచి అదేవిధం గా విపక్షాల వైపు నుంచి కూడా నాయకులకు ఆహ్వానాలు అందాయి. వీటిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సహా చివరకు ఆప్ నాయకులకు కూడా ఆహ్వానాలు అందాయి. ఇక, కీలకమైన ప్రతిపక్షం వైసీపీకి కూడా ఆహ్వానం అందింది. ఎన్నికలకు ముందు వరకు కూడా.. గవర్నర్తో భేటీ అయ్యేందుకు పరితపించిన జగన్.. తర్వాత.. మాత్రం ముఖం చాటేస్తున్నారు.
అధికారం పోయిన దరిమిలా.. ఆయన ఒకే ఒక్కసారి గవర్నర్ను కలిశారు. ఆ తర్వాత.. మౌనంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఎట్ హోంకు పిలిచినా జగన్ రాలేదు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. షర్మిల హాజరయ్యారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరితోనూ కలివిడిగా ముందుకు సాగారు. టీడీపీ నుంచి జనసేన, కమ్యూనిస్టుల వరకు కూడా.. అందరితోనూ షర్మిల కలివిడిగా మాట్లాడారు. కుశల ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా నారా లోకేష్తోనూ హ్యాపీగా స్పందించారు. నిజానికి టీడీపీకి-కాంగ్రెస్కు పడదు.
రెండు రోజుల కిందటే ఆరోగ్య శ్రీ పథకంపై షర్మిల విమర్శలు గుప్పించింది. అయినప్పటికీ.. టీడీపీ నేత లతో ఆమె కలిసి పోయారు. ఈ పరిణామాలను గమనించిన నాయకులు.. జగన్ కన్నా షర్మిలే బెటరా? అనే కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాలన్నాక పట్టువిడుపులు ఉండాలి. ఉంటాయి కూడా. కానీ, తాను పట్టిన కుందేలుకు మూడుకాళ్లే అన్న చందంగా జగన్ వ్యవహరించడం.. ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీసింది. ఎట్ హోంకు వచ్చి.. అందరినీ పలకరించి ఉండి ఉంటే.. రాజకీయాలకు అతీతంగా జగన్ పేరు మరింత బలపడేదని చెబుతున్నారు.
This post was last modified on August 17, 2024 4:14 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…