తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని.. ఇది ఖాయమని చెప్పారు. ఆ వెంటనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. అంతేకాదు.. పార్టీ పరంగా కూడా మార్పులు ఉంటాయని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోయిన తర్వాత.. ఆ వెంటనే హరీష్ రావుకు అసెంబ్లీలో అప్పోజిషన్ లీడర్ పదవిని అప్పగిస్తారని అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒక్కటేనని చెప్పారు. “త్వరలోనే మీరు చూస్తారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. ప్రస్తుతం కవిత ఆపశోపాలు పడుతోంది. బెయిల్ రావడం లేదు. విలీనం అయిపోయిన వెంటనే ఆమెకు బెయిల్ వచ్చేస్తుంది. ఆ వెంటనే అప్పోజిషన్ లీడర్గా హరీష్రావు ఉంటారు. తర్వాత.. కొన్నాళ్లకు కేసీఆర్కు గవర్నర్కు పదవి దక్కుతుంది. ఇది రాసిపెట్టుకోండి” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వీరిని బీజేపీలోకి పంపించేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే అయిపోయిందన్నారు. త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. కవిత బెయిల్ కోసం.. పార్టీని విలీనం చేస్తున్నారని చెప్పారు. ఇక, కేసీఆర్కు గవర్నర్కు పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కుతాయని తెలిపారు. ఇవన్నీ పక్కా అని ఉద్ఘాటించారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో రుణ మాఫీ జరిగిందని సీఎం తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తాము రైతులకు రుణ మాఫీ చేశామని అన్నారు. ఇంకా ఎవరికైనా అందకపోతే.. వారికి కూడా ఇచ్చేందుకు మరో 5 వేల కోట్ల రూపాయలను రిజర్వ్ చేసి పెట్టామని తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నా రు. అందరికీ రుణమాఫీ చేస్తామని.. ఇచ్చిన మాటకు కట్టుబడతామని చెప్పారు.
This post was last modified on August 16, 2024 4:32 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…