తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని.. ఇది ఖాయమని చెప్పారు. ఆ వెంటనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. అంతేకాదు.. పార్టీ పరంగా కూడా మార్పులు ఉంటాయని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోయిన తర్వాత.. ఆ వెంటనే హరీష్ రావుకు అసెంబ్లీలో అప్పోజిషన్ లీడర్ పదవిని అప్పగిస్తారని అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒక్కటేనని చెప్పారు. “త్వరలోనే మీరు చూస్తారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. ప్రస్తుతం కవిత ఆపశోపాలు పడుతోంది. బెయిల్ రావడం లేదు. విలీనం అయిపోయిన వెంటనే ఆమెకు బెయిల్ వచ్చేస్తుంది. ఆ వెంటనే అప్పోజిషన్ లీడర్గా హరీష్రావు ఉంటారు. తర్వాత.. కొన్నాళ్లకు కేసీఆర్కు గవర్నర్కు పదవి దక్కుతుంది. ఇది రాసిపెట్టుకోండి” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వీరిని బీజేపీలోకి పంపించేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే అయిపోయిందన్నారు. త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. కవిత బెయిల్ కోసం.. పార్టీని విలీనం చేస్తున్నారని చెప్పారు. ఇక, కేసీఆర్కు గవర్నర్కు పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కుతాయని తెలిపారు. ఇవన్నీ పక్కా అని ఉద్ఘాటించారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో రుణ మాఫీ జరిగిందని సీఎం తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తాము రైతులకు రుణ మాఫీ చేశామని అన్నారు. ఇంకా ఎవరికైనా అందకపోతే.. వారికి కూడా ఇచ్చేందుకు మరో 5 వేల కోట్ల రూపాయలను రిజర్వ్ చేసి పెట్టామని తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నా రు. అందరికీ రుణమాఫీ చేస్తామని.. ఇచ్చిన మాటకు కట్టుబడతామని చెప్పారు.
This post was last modified on August 16, 2024 4:32 pm
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……