Political News

‘ఎట్ హోం’కు ఎవరూ వెళ్లకపోతే ఎలా జగన్?

ఆట కావొచ్చు.. రాజకీయం కావొచ్చు. గెలుపు ఎంత ఖాయమో.. ఓటమి అంతే పక్కా. గెలుపునకు పొంగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం అస్సలు ఉండొద్దు. ఈ విషయాన్ని గుర్తించి.. గెలుపోటముల్నిసమంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తీరుతో ఉన్నప్పుడు ఎదురయ్యే ఓటమిని తేలిగ్గా అధిగమించే వీలుంది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారా? అన్నది ప్రశ్న. పంద్రాగస్టు.. జనవరి 26న సంప్రదాయంలో భాగంగా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించటం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి రాజకీయ రంగం నుంచి సమాజంలోని అన్ని రంగాల వారు హాజరు కావటం తెలిసిందే. ఈసారి ఏపీలో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు.. వివిధ వర్గాలకు చెందిన వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు.నిజానికి ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావటం ద్వారా విమర్శలకు చెక్ చెప్పొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించటం సరికాదు.

ఏపీలో నిర్వహించిన ఎట్ హోంకు ప్రత్యేకత ఏమంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి అధికార పక్షంగా హాజరు కావటం. గతంలోనూ ఆయన ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ..ఎలాంటి అధికారం లేదు. ఈసారి అందుకు భిన్నంగా వంద శాతం స్ట్రైక్ రేటుతో పార్టీ ఎమ్మెల్యేలు.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన ఎట్ హోంకార్యక్రమం దాదాపు గంటకు పైనే సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు.. పలువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు సీనియర్ అధికారులు.. పద్మ పురస్కార గ్రహీతలు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఇంతమంది వచ్చినా వైసీపీ అధినేత జగన్ మొదలు ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరూ హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరు కూడా హాజరు కాకపోవటం సరైన పద్దతి కాదంటున్నారు. గెలుపు ఓటములు మామూలే. అంత మాత్రాన ఓడిన వేళ ఈ తరహా కార్యక్రమాలకు దూరంగా ఉండటం పరిష్కారం కాదన్న విషయాన్ని జగన్ అండ్ కో గుర్తిస్తే మంచిది.

This post was last modified on August 16, 2024 10:57 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago