గత వారం రోజుల్లో ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.
వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఇరు వైపులా మీడియాకు ఎక్కి వాళ్ల వాళ్ల వెర్షన్ వినిపిస్తున్నారు. మాధురి సైతం మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. ముందు మీడియా ప్రశ్నలకు దీటుగా బదులిస్తూ హుషారుగా కనిపించిన మాధురి.. తర్వాత తన కారును మరో కారుకు గుద్దడం ద్వారా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఆ ప్రమాదంలో పెద్దగా గాయాలేమీ కాకుండా బయటపడ్డ మాధురి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో మాధురి ఓ సినిమా కూడా ప్రొడ్యూస్ చేసిందట. ఆ సినిమా పేరు.. వలంటీర్ అని ఆమె వెల్లడించింది. శ్రీనివాస్కు సినిమాలంటే ఆసక్తి ఉందని.. ఆయన చక్కగా నటించగలరని ఆమె తెలిపింది. శ్రీనివాస్ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో నట శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. శ్రీనివాస్ ఆసక్తిని గమనించి తానే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశానంది.
తన నిజ జీవిత పాత్రే అయిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించాడంది మాధురి. పూరి జగన్నాథ్ మేనల్లుడు ఇందులో హీరోగా నటించాడని.. కేరళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశామని మాధురి వెల్లడించింది.
ఐతే ఎన్నికల హడావుడిలో పడి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయినట్లు మాధురి చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్ పాటలు కూడా బాగా పాడతాడని.. వైసీపీ క్యాడర్తో కలిసి తాము రోజూ అంత్యాక్షరి కూడా నిర్వహించేవాళ్లమంటూ.. టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె శ్రీనివాస్ కోసం ‘కరిగిపోయాను కర్పూర వీణలా..’ పాటను పాడి వినిపించడం విశేషం.
This post was last modified on August 15, 2024 4:49 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…