గత వారం రోజుల్లో ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.
వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఇరు వైపులా మీడియాకు ఎక్కి వాళ్ల వాళ్ల వెర్షన్ వినిపిస్తున్నారు. మాధురి సైతం మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. ముందు మీడియా ప్రశ్నలకు దీటుగా బదులిస్తూ హుషారుగా కనిపించిన మాధురి.. తర్వాత తన కారును మరో కారుకు గుద్దడం ద్వారా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఆ ప్రమాదంలో పెద్దగా గాయాలేమీ కాకుండా బయటపడ్డ మాధురి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో మాధురి ఓ సినిమా కూడా ప్రొడ్యూస్ చేసిందట. ఆ సినిమా పేరు.. వలంటీర్ అని ఆమె వెల్లడించింది. శ్రీనివాస్కు సినిమాలంటే ఆసక్తి ఉందని.. ఆయన చక్కగా నటించగలరని ఆమె తెలిపింది. శ్రీనివాస్ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో నట శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. శ్రీనివాస్ ఆసక్తిని గమనించి తానే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశానంది.
తన నిజ జీవిత పాత్రే అయిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించాడంది మాధురి. పూరి జగన్నాథ్ మేనల్లుడు ఇందులో హీరోగా నటించాడని.. కేరళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశామని మాధురి వెల్లడించింది.
ఐతే ఎన్నికల హడావుడిలో పడి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయినట్లు మాధురి చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్ పాటలు కూడా బాగా పాడతాడని.. వైసీపీ క్యాడర్తో కలిసి తాము రోజూ అంత్యాక్షరి కూడా నిర్వహించేవాళ్లమంటూ.. టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె శ్రీనివాస్ కోసం ‘కరిగిపోయాను కర్పూర వీణలా..’ పాటను పాడి వినిపించడం విశేషం.
This post was last modified on August 15, 2024 4:49 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…