గత వారం రోజుల్లో ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.
వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఇరు వైపులా మీడియాకు ఎక్కి వాళ్ల వాళ్ల వెర్షన్ వినిపిస్తున్నారు. మాధురి సైతం మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. ముందు మీడియా ప్రశ్నలకు దీటుగా బదులిస్తూ హుషారుగా కనిపించిన మాధురి.. తర్వాత తన కారును మరో కారుకు గుద్దడం ద్వారా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఆ ప్రమాదంలో పెద్దగా గాయాలేమీ కాకుండా బయటపడ్డ మాధురి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో మాధురి ఓ సినిమా కూడా ప్రొడ్యూస్ చేసిందట. ఆ సినిమా పేరు.. వలంటీర్ అని ఆమె వెల్లడించింది. శ్రీనివాస్కు సినిమాలంటే ఆసక్తి ఉందని.. ఆయన చక్కగా నటించగలరని ఆమె తెలిపింది. శ్రీనివాస్ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో నట శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. శ్రీనివాస్ ఆసక్తిని గమనించి తానే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశానంది.
తన నిజ జీవిత పాత్రే అయిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించాడంది మాధురి. పూరి జగన్నాథ్ మేనల్లుడు ఇందులో హీరోగా నటించాడని.. కేరళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశామని మాధురి వెల్లడించింది.
ఐతే ఎన్నికల హడావుడిలో పడి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయినట్లు మాధురి చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్ పాటలు కూడా బాగా పాడతాడని.. వైసీపీ క్యాడర్తో కలిసి తాము రోజూ అంత్యాక్షరి కూడా నిర్వహించేవాళ్లమంటూ.. టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె శ్రీనివాస్ కోసం ‘కరిగిపోయాను కర్పూర వీణలా..’ పాటను పాడి వినిపించడం విశేషం.
This post was last modified on August 15, 2024 4:49 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…