Political News

మాధురి నిర్మాతగా దువ్వాడ శ్రీనివాస్ సినిమా

గత వారం రోజుల్లో ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.

వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఇరు వైపులా మీడియాకు ఎక్కి వాళ్ల వాళ్ల వెర్షన్ వినిపిస్తున్నారు. మాధురి సైతం మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. ముందు మీడియా ప్రశ్నలకు దీటుగా బదులిస్తూ హుషారుగా కనిపించిన మాధురి.. తర్వాత తన కారును మరో కారుకు గుద్దడం ద్వారా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ప్రమాదంలో పెద్దగా గాయాలేమీ కాకుండా బయటపడ్డ మాధురి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో మాధురి ఓ సినిమా కూడా ప్రొడ్యూస్ చేసిందట. ఆ సినిమా పేరు.. వలంటీర్ అని ఆమె వెల్లడించింది. శ్రీనివాస్‌కు సినిమాలంటే ఆసక్తి ఉందని.. ఆయన చక్కగా నటించగలరని ఆమె తెలిపింది. శ్రీనివాస్ మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో నట శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. శ్రీనివాస్ ఆసక్తిని గమనించి తానే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశానంది.

తన నిజ జీవిత పాత్రే అయిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించాడంది మాధురి. పూరి జగన్నాథ్ మేనల్లుడు ఇందులో హీరోగా నటించాడని.. కేరళ అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశామని మాధురి వెల్లడించింది.

ఐతే ఎన్నికల హడావుడిలో పడి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయినట్లు మాధురి చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్ పాటలు కూడా బాగా పాడతాడని.. వైసీపీ క్యాడర్‌తో కలిసి తాము రోజూ అంత్యాక్షరి కూడా నిర్వహించేవాళ్లమంటూ.. టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె శ్రీనివాస్ కోసం ‘కరిగిపోయాను కర్పూర వీణలా..’ పాటను పాడి వినిపించడం విశేషం.

This post was last modified on August 15, 2024 4:49 pm

Share

Recent Posts

పాత రోజుల్లోకి నారా రోహిత్

రాజకీయాలకు పేరుపడ్డ నారా కుటుంబం నుంచి ఒక నటుడు వస్తున్నాడంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏమాత్రం సక్సెస్ అవుతాడో…

16 minutes ago

అఖిల్ భారతీయుడు కాదా?

భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…

1 hour ago

ష‌ర్మిల ఎక్క‌డున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్‌!?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం…

2 hours ago

మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో…

4 hours ago

అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి…

6 hours ago

36 వేల దరఖాస్తులు… పవన్‌కు పెద్ద టాస్కే!

ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇది పెద్ద పరీక్షే. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ముందడుగు వేస్తున్న ఆ…

8 hours ago