విషయం కొత్తదైనప్పుడు.. లేదా మెజారిటీ ప్రజలకు తెలియనప్పుడు గూగుల్ను ఆశ్రయించడం పరిపాటి. అరచేతిలో ఉన్న ఫోన్లో గూగుల్ను ఆశ్రయించి.. తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఇలా.. గత రెండు రోజుల్లో ఎక్కువ మంది గూగుల్ను ఆశ్రయించిన అంశం.. కుంకి. వీటి గురించే ఎక్కువగా శోధిం చారని గూగుల్ పేర్కొంది. అసలేంటి ఈ కుంకి అనేది ఎక్కువగా అన్వేషించారట. దీంతో ఇప్పుడు కుంకి కథ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్.. కర్ణాటకకు వెళ్లి.. కుంకి ఏనుగులను తమకు ఇవ్వాలని కోరారు. మొత్తం 8 ఏనుగులను ఆయన కోరగా.. అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో సాధారణ ఏనుగులకు, కుంకి ఏనుగులకు తేడా ఏంటి? అనేది చర్చగా మారింది. అన్నీ ఏనుగులే అయినప్పుడు.. కుంకి ఏనుగులకు ప్రత్యేకత ఏం ఉంటుంది? అనేది కూడా ప్రశ్న. అయితే.. అన్నీ ఏనుగులే అయినా.. కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. సాధారణ ఏనుగులపై యుద్ధానికి సిద్ధం చేస్తారు.
ఉదాహరణకు దేవాలయాల్లో స్వామివారి సేవలకు వినియోగించే ఏనుగులు ఉంటాయి. వీటి లక్షణాలను బట్టి.. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. దైవ కార్యాలయాలకు వినియోగిస్తారు. అలానే ఏనుగుల్లోనూ కొన్నింటిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి.. వాటికి కుంకి ఏనుగులుగా పేర్కొంటారు. ఇవి సాధారణ ఏనుగులను ఎదుర్కొనేలా ఉంటాయి. సాధారణ ఏనుగులపై ఇవి యుద్ధం చేసినట్టుగా విజృంభిస్తాయి. అయితే ఒక్కొక్కసారి సాధారణ ఏనుగులు బలంగా ఉంటే తిరగబడతాయి. ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. అందుకే కుంకీ ఎనుగులకు ప్రత్యేకత ఉంది.
ఏపీకి ఎందుకు?
ఇప్పటికిప్పుడు కుంకీ ఏనుగుల అవసరం ఏంటి? అనేది మరో ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలానే ఏనుగులు కూడా చిత్తూరు, అనంతపురం సహా ఇతర ప్రాంతాల్లోకి వస్తూ.. పంటలను, ఇళ్లను కూడా నాశనం చేస్తున్నాయి. దీనిని అడ్డుకునేందుకు.. చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో సాధారణ ఏనుగులను తరిమేసేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దింపుతారు. ఇవి ప్రత్యేకమైన ఘీంకారాలు, పరుగు ద్వారా.. సాధారణ ఏనుగులకు భయం కలిగించి.. ఆ ప్రాంతం నుంచి తరిమి కొడతాయి. దీనివల్ల ఏనుగులకు ఎలాంటి ప్రమాదం లేకుండా.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
This post was last modified on August 15, 2024 4:47 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…