Political News

త‌ప్పు చేసిన వాళ్ల‌కు శిక్ష ప‌డాల్సిందే

ఏపీకి ఒక బ్రాండ్ ఉంద‌ని.. కానీ, గ‌త ఐదేళ్ల‌లో ఆ బ్రాండ్ దెబ్బ‌తింద‌ని.. దీనిని తిరిగి సాధించేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 78వ పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను పుర‌స్క‌రిం చుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు తెలిపారు. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగాముందుకు సాగుతామ‌ని చెప్పారు.

టార్గెట్ 100!

త‌మ పాల‌న‌లో 100 రోజుల ప్రణాళికను ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని శాఖల‌ను గాడిలో పెడుతున్న‌ట్టు తెలిపారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప‌క్కా నిర్ణయాలతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. 15% వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సాగును బాగు చేసేందుకు కూడా తాము క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. రైతుల‌ ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామ‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డుతున్న స్కిల్ సెన్స‌స్ ద్వారా యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మ‌రింత పెరిగేలా చూస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ స‌ర్కారు నిర్వాకం కార‌ణంగా ఉపాధి, ఉద్యోగ రంగం పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని అన్నారు. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామ‌ని ఒక్క‌రిని కూడా వ‌దిలేది లేద‌ని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఉచిత ఇసుకను మ‌రింత‌గా పేద‌ల‌కు చేరువ చేస్తామ‌ని చెప్పారు. దీనిపై ఇప్ప‌టికే అనేక రూపాల్లో స‌మీక్ష‌లు చేశామ‌ని అన్నారు. పేద‌ల‌కు ఇబ్బందిలేని వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. త‌ప్పు చేసిన వారిని ఎట్టిప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టేది లేద‌ని మాజీ మంత్రి జోగిర‌మేష్ స‌హా వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా చంద్ర‌బాబు హెచ్చ‌రిం చారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ అక్రమాలపై మ‌రింతగా దర్యాప్తు చేయిస్తామ‌న్నారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on August 15, 2024 4:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

4 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

5 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

6 hours ago