Political News

త‌ప్పు చేసిన వాళ్ల‌కు శిక్ష ప‌డాల్సిందే

ఏపీకి ఒక బ్రాండ్ ఉంద‌ని.. కానీ, గ‌త ఐదేళ్ల‌లో ఆ బ్రాండ్ దెబ్బ‌తింద‌ని.. దీనిని తిరిగి సాధించేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 78వ పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను పుర‌స్క‌రిం చుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు తెలిపారు. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగాముందుకు సాగుతామ‌ని చెప్పారు.

టార్గెట్ 100!

త‌మ పాల‌న‌లో 100 రోజుల ప్రణాళికను ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని శాఖల‌ను గాడిలో పెడుతున్న‌ట్టు తెలిపారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప‌క్కా నిర్ణయాలతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. 15% వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సాగును బాగు చేసేందుకు కూడా తాము క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. రైతుల‌ ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామ‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డుతున్న స్కిల్ సెన్స‌స్ ద్వారా యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మ‌రింత పెరిగేలా చూస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ స‌ర్కారు నిర్వాకం కార‌ణంగా ఉపాధి, ఉద్యోగ రంగం పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని అన్నారు. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామ‌ని ఒక్క‌రిని కూడా వ‌దిలేది లేద‌ని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఉచిత ఇసుకను మ‌రింత‌గా పేద‌ల‌కు చేరువ చేస్తామ‌ని చెప్పారు. దీనిపై ఇప్ప‌టికే అనేక రూపాల్లో స‌మీక్ష‌లు చేశామ‌ని అన్నారు. పేద‌ల‌కు ఇబ్బందిలేని వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. త‌ప్పు చేసిన వారిని ఎట్టిప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టేది లేద‌ని మాజీ మంత్రి జోగిర‌మేష్ స‌హా వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా చంద్ర‌బాబు హెచ్చ‌రిం చారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ అక్రమాలపై మ‌రింతగా దర్యాప్తు చేయిస్తామ‌న్నారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on August 15, 2024 4:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago