“నా బీసీలు.. నా ఎస్సీలు” అంటూ.. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతజగన్ ఊదరగొట్టారు. వారికే పద వులు ఇచ్చారు. వారికే టికెట్లు కూడా ఎక్కువగా ఇచ్చారు. ఈ క్రమంలో తనకు కీలకమైన ఓటు బ్యాంకు గా.. ఆర్థిక, రాజకీయ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా దూరంగా ఉంచేశారు. దీంతో వారంతా .. జగన్ను నమ్ముకుంటే బూడిదే! అని అనుకుని రాజకీయంగా ఆయనను దూరం పెట్టారు. ఫలితం ఎలా ఉందో ఎన్నికలు చెప్పాయి.
కట్ చేస్తే.. గడిచిన వారంలో రెండు ఘటనలు జరిగాయి. ఈ రెండు ఘటనలు కూడా ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి, రెండోది బీసీ సామాజిక వర్గానికి చెందినవి. ఈ రెండు వర్గాలను నమ్ముకున్న జగన్కు.. వాస్తవానికి ఈ రెండు సామాజిక వర్గాలు అండగా ఉంటాయని.. ప్రభుత్వం కూడా భావించింది. పార్టీనాయకులు కూడా అంచనా వేసుకున్నారు. కానీ, అలా ఏమీ జరగలేదు. ఒక్క నాయకుడు కూడా.. రోడ్డెక్కలేదు., ఒక్కరు కూడా జగన్నినాదాలు చేయలేదు. అయ్యో అని కూడా అనలేదు.
1) విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం పాదాల దగ్గర ఏర్పాటు చేసుకున్న సీఎం జగన్ మోహన్రెడ్డి
అనే పేరును కొందరు దుండగులు తొలగించారు. దీంతో వైసీపీ కన్నెర్ర చేసింది. దీనిని ఎస్సీలపై జరిగిన దాడిగా చూపింది. పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది. కానీ, ఎవరూ కిమ్మనలేదు. కేవలం వైసీపీ నాయకులు, వైసీపీకి మద్దతిచ్చే కొందరు ఎస్సీలు మాత్రమే స్పందించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన శివాజీ కానీ, ఇతర నాయకులు కానీ స్పందించలేదు.
2) బీసీ నాయకుడు జోగి రమేష్ కుటుంబంపై కేసులు. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీనిని అక్రమ అరెస్టుగా వైసీపీ పేర్కొంది. అంతేకాదు.. ఇది బీసీలపై జరిగిన దాడిగా కూడా వివరించింది. ఈ క్రమంలోనే బీసీలే దీనిని ఎదుర్కొనాలని పిలుపుని చ్చింది. కానీ, ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇక్కడ కూడా.. కొందరు అనుకూల నాయకులు.. గతంలో మంత్రి పదవులు పొందిన వారు మాత్రమే స్పందించారు. తప్ప.. ఇంకెవరూ స్పందించకపోవడం గమనార్హం.
This post was last modified on August 15, 2024 11:06 am
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…