“నా బీసీలు.. నా ఎస్సీలు” అంటూ.. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతజగన్ ఊదరగొట్టారు. వారికే పద వులు ఇచ్చారు. వారికే టికెట్లు కూడా ఎక్కువగా ఇచ్చారు. ఈ క్రమంలో తనకు కీలకమైన ఓటు బ్యాంకు గా.. ఆర్థిక, రాజకీయ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా దూరంగా ఉంచేశారు. దీంతో వారంతా .. జగన్ను నమ్ముకుంటే బూడిదే! అని అనుకుని రాజకీయంగా ఆయనను దూరం పెట్టారు. ఫలితం ఎలా ఉందో ఎన్నికలు చెప్పాయి.
కట్ చేస్తే.. గడిచిన వారంలో రెండు ఘటనలు జరిగాయి. ఈ రెండు ఘటనలు కూడా ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి, రెండోది బీసీ సామాజిక వర్గానికి చెందినవి. ఈ రెండు వర్గాలను నమ్ముకున్న జగన్కు.. వాస్తవానికి ఈ రెండు సామాజిక వర్గాలు అండగా ఉంటాయని.. ప్రభుత్వం కూడా భావించింది. పార్టీనాయకులు కూడా అంచనా వేసుకున్నారు. కానీ, అలా ఏమీ జరగలేదు. ఒక్క నాయకుడు కూడా.. రోడ్డెక్కలేదు., ఒక్కరు కూడా జగన్నినాదాలు చేయలేదు. అయ్యో అని కూడా అనలేదు.
1) విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం పాదాల దగ్గర ఏర్పాటు చేసుకున్న సీఎం జగన్ మోహన్రెడ్డి అనే పేరును కొందరు దుండగులు తొలగించారు. దీంతో వైసీపీ కన్నెర్ర చేసింది. దీనిని ఎస్సీలపై జరిగిన దాడిగా చూపింది. పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది. కానీ, ఎవరూ కిమ్మనలేదు. కేవలం వైసీపీ నాయకులు, వైసీపీకి మద్దతిచ్చే కొందరు ఎస్సీలు మాత్రమే స్పందించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన శివాజీ కానీ, ఇతర నాయకులు కానీ స్పందించలేదు.
2) బీసీ నాయకుడు జోగి రమేష్ కుటుంబంపై కేసులు. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీనిని అక్రమ అరెస్టుగా వైసీపీ పేర్కొంది. అంతేకాదు.. ఇది బీసీలపై జరిగిన దాడిగా కూడా వివరించింది. ఈ క్రమంలోనే బీసీలే దీనిని ఎదుర్కొనాలని పిలుపుని చ్చింది. కానీ, ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇక్కడ కూడా.. కొందరు అనుకూల నాయకులు.. గతంలో మంత్రి పదవులు పొందిన వారు మాత్రమే స్పందించారు. తప్ప.. ఇంకెవరూ స్పందించకపోవడం గమనార్హం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…