గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా.
ఐతే శ్రీనివాస్ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు దగ్గరయ్యారనే వాదన వినిపిస్తోంది. శ్రీనివాస్, మాధురి ఇదే రకంగా మాట్లాడుతున్నారు. తమ బంధం గురించి వాళ్లు దాచి పెట్టడానికేమీ ప్రయత్నించడం లేదు. ఐతే అమెరికాలో ఉన్న మాధురి భర్త దీనిపై ఏమంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడాయన ఓ టీవీ ఛానెల్తో ఈ గొడవ మీద మాట్లాడారు.
మాధురి మీద తనకు నమ్మకముందని.. ఆమె తప్పు చేయదని ఆ ఛానెల్లో మాధురి భర్త స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఆమెకు అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.
“నాకు ఆర్థిక సమస్యలున్నాయంటే నవ్వొస్తోంది. మా నాన్న గారు లీడింగ్ లాయర్. నాకు నెలకు పది లక్షలు జీతం. ఆ పది లక్షలు మాధురికే పంపిస్తాను. తను మంచి డ్యాన్సర్. తన గురించి ఎందుకింత చెడుగా చెబుతున్నారు. నన్నొక చిన్న బాబులా.. తను తల్లిలా చూసుకుంటుంది. మాధురి గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను. నేనేం రాముడిని కాదు. ఎవరో ఏదైనా చెబితే వచ్చేయడానికి. ‘కుక్కలు మొరుగుతాయి. మొరగనీ. నాకు నీ మీద నమ్మకముంది’ అనే మాధురికి చెబుతుంటాను. తన గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నా మాధురి నా మాధురినే దట్సాల్. ఆమెను రాజకీయంగా డౌన్ చేయడానికే ఇలాంటి అభాండాలు వేస్తున్నారు” అని తేల్చేశారు మాధురి భర్త.
ఒక ఇంట్లో తన భర్తతో పాటు మరో మహిళ ఉండడాన్ని దువ్వాడ శ్రీనివాస్ భార్య తప్పుబడుతోంది కదా.. మరి ఈ విషయంలో మీకు అభ్యంతరాలు లేవా అని అడిగితే.. ఒకసారి కరెక్టే కదా అన్న మాధురి భర్త తర్వాత నో కామెంట్స్ అంటూ సైలెంట్ అయిపోయారు.
This post was last modified on August 13, 2024 5:17 pm
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…