గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా.
ఐతే శ్రీనివాస్ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు దగ్గరయ్యారనే వాదన వినిపిస్తోంది. శ్రీనివాస్, మాధురి ఇదే రకంగా మాట్లాడుతున్నారు. తమ బంధం గురించి వాళ్లు దాచి పెట్టడానికేమీ ప్రయత్నించడం లేదు. ఐతే అమెరికాలో ఉన్న మాధురి భర్త దీనిపై ఏమంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడాయన ఓ టీవీ ఛానెల్తో ఈ గొడవ మీద మాట్లాడారు.
మాధురి మీద తనకు నమ్మకముందని.. ఆమె తప్పు చేయదని ఆ ఛానెల్లో మాధురి భర్త స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఆమెకు అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.
“నాకు ఆర్థిక సమస్యలున్నాయంటే నవ్వొస్తోంది. మా నాన్న గారు లీడింగ్ లాయర్. నాకు నెలకు పది లక్షలు జీతం. ఆ పది లక్షలు మాధురికే పంపిస్తాను. తను మంచి డ్యాన్సర్. తన గురించి ఎందుకింత చెడుగా చెబుతున్నారు. నన్నొక చిన్న బాబులా.. తను తల్లిలా చూసుకుంటుంది. మాధురి గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను. నేనేం రాముడిని కాదు. ఎవరో ఏదైనా చెబితే వచ్చేయడానికి. ‘కుక్కలు మొరుగుతాయి. మొరగనీ. నాకు నీ మీద నమ్మకముంది’ అనే మాధురికి చెబుతుంటాను. తన గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నా మాధురి నా మాధురినే దట్సాల్. ఆమెను రాజకీయంగా డౌన్ చేయడానికే ఇలాంటి అభాండాలు వేస్తున్నారు” అని తేల్చేశారు మాధురి భర్త.
ఒక ఇంట్లో తన భర్తతో పాటు మరో మహిళ ఉండడాన్ని దువ్వాడ శ్రీనివాస్ భార్య తప్పుబడుతోంది కదా.. మరి ఈ విషయంలో మీకు అభ్యంతరాలు లేవా అని అడిగితే.. ఒకసారి కరెక్టే కదా అన్న మాధురి భర్త తర్వాత నో కామెంట్స్ అంటూ సైలెంట్ అయిపోయారు.
This post was last modified on August 13, 2024 5:17 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…