గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా.
ఐతే శ్రీనివాస్ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు దగ్గరయ్యారనే వాదన వినిపిస్తోంది. శ్రీనివాస్, మాధురి ఇదే రకంగా మాట్లాడుతున్నారు. తమ బంధం గురించి వాళ్లు దాచి పెట్టడానికేమీ ప్రయత్నించడం లేదు. ఐతే అమెరికాలో ఉన్న మాధురి భర్త దీనిపై ఏమంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడాయన ఓ టీవీ ఛానెల్తో ఈ గొడవ మీద మాట్లాడారు.
మాధురి మీద తనకు నమ్మకముందని.. ఆమె తప్పు చేయదని ఆ ఛానెల్లో మాధురి భర్త స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఆమెకు అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.
“నాకు ఆర్థిక సమస్యలున్నాయంటే నవ్వొస్తోంది. మా నాన్న గారు లీడింగ్ లాయర్. నాకు నెలకు పది లక్షలు జీతం. ఆ పది లక్షలు మాధురికే పంపిస్తాను. తను మంచి డ్యాన్సర్. తన గురించి ఎందుకింత చెడుగా చెబుతున్నారు. నన్నొక చిన్న బాబులా.. తను తల్లిలా చూసుకుంటుంది. మాధురి గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను. నేనేం రాముడిని కాదు. ఎవరో ఏదైనా చెబితే వచ్చేయడానికి. ‘కుక్కలు మొరుగుతాయి. మొరగనీ. నాకు నీ మీద నమ్మకముంది’ అనే మాధురికి చెబుతుంటాను. తన గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నా మాధురి నా మాధురినే దట్సాల్. ఆమెను రాజకీయంగా డౌన్ చేయడానికే ఇలాంటి అభాండాలు వేస్తున్నారు” అని తేల్చేశారు మాధురి భర్త.
ఒక ఇంట్లో తన భర్తతో పాటు మరో మహిళ ఉండడాన్ని దువ్వాడ శ్రీనివాస్ భార్య తప్పుబడుతోంది కదా.. మరి ఈ విషయంలో మీకు అభ్యంతరాలు లేవా అని అడిగితే.. ఒకసారి కరెక్టే కదా అన్న మాధురి భర్త తర్వాత నో కామెంట్స్ అంటూ సైలెంట్ అయిపోయారు.
This post was last modified on August 13, 2024 5:17 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…