గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా.
ఐతే శ్రీనివాస్ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు దగ్గరయ్యారనే వాదన వినిపిస్తోంది. శ్రీనివాస్, మాధురి ఇదే రకంగా మాట్లాడుతున్నారు. తమ బంధం గురించి వాళ్లు దాచి పెట్టడానికేమీ ప్రయత్నించడం లేదు. ఐతే అమెరికాలో ఉన్న మాధురి భర్త దీనిపై ఏమంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడాయన ఓ టీవీ ఛానెల్తో ఈ గొడవ మీద మాట్లాడారు.
మాధురి మీద తనకు నమ్మకముందని.. ఆమె తప్పు చేయదని ఆ ఛానెల్లో మాధురి భర్త స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఆమెకు అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.
“నాకు ఆర్థిక సమస్యలున్నాయంటే నవ్వొస్తోంది. మా నాన్న గారు లీడింగ్ లాయర్. నాకు నెలకు పది లక్షలు జీతం. ఆ పది లక్షలు మాధురికే పంపిస్తాను. తను మంచి డ్యాన్సర్. తన గురించి ఎందుకింత చెడుగా చెబుతున్నారు. నన్నొక చిన్న బాబులా.. తను తల్లిలా చూసుకుంటుంది. మాధురి గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను. నేనేం రాముడిని కాదు. ఎవరో ఏదైనా చెబితే వచ్చేయడానికి. ‘కుక్కలు మొరుగుతాయి. మొరగనీ. నాకు నీ మీద నమ్మకముంది’ అనే మాధురికి చెబుతుంటాను. తన గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నా మాధురి నా మాధురినే దట్సాల్. ఆమెను రాజకీయంగా డౌన్ చేయడానికే ఇలాంటి అభాండాలు వేస్తున్నారు” అని తేల్చేశారు మాధురి భర్త.
ఒక ఇంట్లో తన భర్తతో పాటు మరో మహిళ ఉండడాన్ని దువ్వాడ శ్రీనివాస్ భార్య తప్పుబడుతోంది కదా.. మరి ఈ విషయంలో మీకు అభ్యంతరాలు లేవా అని అడిగితే.. ఒకసారి కరెక్టే కదా అన్న మాధురి భర్త తర్వాత నో కామెంట్స్ అంటూ సైలెంట్ అయిపోయారు.
This post was last modified on August 13, 2024 5:17 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…