చేతిలో ఉన్న అధికారాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. ఎలా ఉంటుందో వైసీపీ ఒక పాఠం. 151 సీట్లు చూసుకుని.. తమకు తిరుగులేదని, తాము ఇస్తున్న పథకాలకు ఎదురు లేదని భావించిన వైసీపీ అధినేత జగన్ తాజా ఎన్నికల్లో తీవ్ర ఎదురు దెబ్బ తిన్నారు. అయితే.. ఈ పరాజయం ఇప్పటితో పోతుందని.. త్వరలోనే పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందని వైసీపీలో నాయకులు అంచనా వేస్తుండవచ్చు. జగన్ ఇమేజ్ పెరుగుతుందని కూడా భావిస్తుండవచ్చు.
వారి ఆశావాదాన్ని ఎవరూ కాదనలేరు. అయితే.. ఇక్కడే కొన్ని చిక్కులు చూస్తే.. వచ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి, పార్టీ అధినేత జగన్కు కూడా ఆటు పోట్లు తప్పేలా లేవని తెలుస్తోంది. తనపై నమోదైన అక్రమ కేసుల నుంచి జగన్ తప్పించుకునే పరిస్థితి లేదు. ఈ నెల 16 నుంచి తిరిగి ఆ కేసులను రోజువారీ విచారణ జరిపించేలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే.. ఇక, జగన్ పరిస్థితి కేసులు-కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంటుంది.
రాజకీయంగా చూస్తే.. పోతున్నవారెవరో.. ఉంటున్నవారెవరో తెలియని పరిస్థితిలో వైసీపీ తర్జన భర్జన పడుతోంది. పార్టీని కాపాడుకోకపోతే.. మరో ఏడాదిన్నరో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా నేల మట్టం అవుతుంది. ఇది మరింతగా జగన్కు ఇబ్బంది. కానీ, పార్టీని పుంజుకునేలా ఆయన ఇప్పటి వరకు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకోలేదు. ఇది మరో సంకట స్థితి. ఇక, వ్యక్తిగతంగా చూసుకుంటే.. ఆయన పై కేసులు నమోదు చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను కూటమి సర్కారు వెతుకుతోంది.
ఇది తప్పుకాదు. చేతకు చేత అన్నట్టుగా బదులు తీర్చుకోవడమే. గతంలో చంద్రబాబుపై కేసులు తోడి మరీ పెట్టారు. ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. మద్యం విధానం నుంచి టీడీఆర్ బాండ్ల వరకు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా.. రిజిస్ట్రేషన్ అయిన భూముల వరకుకూడా అక్రమాలు జరిగాయన్నది కూటమి సర్కారు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఈ కేసులు కూడా జగన్కు చుట్టుముట్టే అవకాశం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. వచ్చే ఐదేళ్లు అంత ఈజీ అయితే కాదని.. ఆటు పోట్లు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 12, 2024 4:24 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…