చేతిలో ఉన్న అధికారాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. ఎలా ఉంటుందో వైసీపీ ఒక పాఠం. 151 సీట్లు చూసుకుని.. తమకు తిరుగులేదని, తాము ఇస్తున్న పథకాలకు ఎదురు లేదని భావించిన వైసీపీ అధినేత జగన్ తాజా ఎన్నికల్లో తీవ్ర ఎదురు దెబ్బ తిన్నారు. అయితే.. ఈ పరాజయం ఇప్పటితో పోతుందని.. త్వరలోనే పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందని వైసీపీలో నాయకులు అంచనా వేస్తుండవచ్చు. జగన్ ఇమేజ్ పెరుగుతుందని కూడా భావిస్తుండవచ్చు.
వారి ఆశావాదాన్ని ఎవరూ కాదనలేరు. అయితే.. ఇక్కడే కొన్ని చిక్కులు చూస్తే.. వచ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి, పార్టీ అధినేత జగన్కు కూడా ఆటు పోట్లు తప్పేలా లేవని తెలుస్తోంది. తనపై నమోదైన అక్రమ కేసుల నుంచి జగన్ తప్పించుకునే పరిస్థితి లేదు. ఈ నెల 16 నుంచి తిరిగి ఆ కేసులను రోజువారీ విచారణ జరిపించేలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే.. ఇక, జగన్ పరిస్థితి కేసులు-కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంటుంది.
రాజకీయంగా చూస్తే.. పోతున్నవారెవరో.. ఉంటున్నవారెవరో తెలియని పరిస్థితిలో వైసీపీ తర్జన భర్జన పడుతోంది. పార్టీని కాపాడుకోకపోతే.. మరో ఏడాదిన్నరో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా నేల మట్టం అవుతుంది. ఇది మరింతగా జగన్కు ఇబ్బంది. కానీ, పార్టీని పుంజుకునేలా ఆయన ఇప్పటి వరకు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకోలేదు. ఇది మరో సంకట స్థితి. ఇక, వ్యక్తిగతంగా చూసుకుంటే.. ఆయన పై కేసులు నమోదు చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను కూటమి సర్కారు వెతుకుతోంది.
ఇది తప్పుకాదు. చేతకు చేత అన్నట్టుగా బదులు తీర్చుకోవడమే. గతంలో చంద్రబాబుపై కేసులు తోడి మరీ పెట్టారు. ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. మద్యం విధానం నుంచి టీడీఆర్ బాండ్ల వరకు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా.. రిజిస్ట్రేషన్ అయిన భూముల వరకుకూడా అక్రమాలు జరిగాయన్నది కూటమి సర్కారు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఈ కేసులు కూడా జగన్కు చుట్టుముట్టే అవకాశం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. వచ్చే ఐదేళ్లు అంత ఈజీ అయితే కాదని.. ఆటు పోట్లు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 12, 2024 4:24 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…