Political News

క‌విత బెయిల్ పిటిష‌న్‌.. సుప్రీంకోర్టు కామెంట్స్ ఇవే!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌వితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ త‌గిలింది. ఆమెకు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట‌యి మార్చి 21వ తేదీ నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్న క‌విత ఇప్ప‌టికి చాలా సార్లు బెయిల్ కోసం అభ్య‌ర్థ‌న చేసుకున్నారు. కానీ, ఏ కోర్టూ ఆమెను క‌రుణించ‌డం లేదు. ఈ క్ర‌మంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

క‌విత దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు సోమ‌వారం విచారించింది. అయితే.. ఈ కేసులో పూర్వాప‌రాల‌ను మ‌రింత లోతుగా ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని చెబుతూ.. ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. క‌విత‌కు మ‌ధ్యంతర బెయిల్ ఇవ్వ‌లేమ‌ని తేల్చిచెప్పింది. కేసును ఈ నెల 20 వ‌ర‌కు(అంటే.. మ‌రో వారం రోజులు) వాయిదా వేసింది. ఈ మేర‌కు న్యాయ‌మూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ బ‌ల‌మైన వాద‌న‌లే వినిపించారు. తాజాగా బెయిల్ ఇచ్చిన సిసోడియా ఉదంతాన్ని కూడా ఆయ‌న సుప్రీంకోర్టుకు వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. క‌విత‌ను మార్చి 15న ఈడీ బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకుంద‌ని.. ఆమె పాత్ర ఏమీలేద‌ని చెప్పారు. కేవ‌లం రాజ‌కీయ ఆరోప‌ణ‌లు, కుట్ర‌పూరితంగానే ఆమెపై కేసు పెట్టార‌ని తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. కేసు పూర్వాప‌రాల‌ను తాము ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని పేర్కొంటూ.. విచార‌ణ‌ను వాయిదా వేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 12, 2024 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

42 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago