బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆమెకు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి మార్చి 21వ తేదీ నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్న కవిత ఇప్పటికి చాలా సార్లు బెయిల్ కోసం అభ్యర్థన చేసుకున్నారు. కానీ, ఏ కోర్టూ ఆమెను కరుణించడం లేదు. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. అయితే.. ఈ కేసులో పూర్వాపరాలను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతూ.. ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కేసును ఈ నెల 20 వరకు(అంటే.. మరో వారం రోజులు) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ బలమైన వాదనలే వినిపించారు. తాజాగా బెయిల్ ఇచ్చిన సిసోడియా ఉదంతాన్ని కూడా ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కవితను మార్చి 15న ఈడీ బలవంతంగా అదుపులోకి తీసుకుందని.. ఆమె పాత్ర ఏమీలేదని చెప్పారు. కేవలం రాజకీయ ఆరోపణలు, కుట్రపూరితంగానే ఆమెపై కేసు పెట్టారని తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. కేసు పూర్వాపరాలను తాము పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంటూ.. విచారణను వాయిదా వేయడం గమనార్హం.
This post was last modified on August 12, 2024 3:56 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…