Political News

వైసీపీ భ‌ద్ర‌త… ఇదో రాజ‌కీయం..!

రాజ‌కీయాల్లో 2014 త‌ర్వాత వ‌చ్చిన కొత్త పోక‌డ ఇప్పుడు మ‌రింత బ‌లోపేతంగా ముందుకు సాగుతోంది. త‌మ‌ను వ్య‌తిరేకించే నాయ‌కులు, పార్టీల అధినేత‌ను టార్గెట్ చేసుకోవ‌డం ప్ర‌భుత్వాలు చేసే ప‌ని. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. ఈ క్ర‌మంలో 2014లో కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌.. కొత్త పంథాను తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌త్య‌ర్థుల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేందుకు వారికి క‌ల్పించే భ‌ద్ర‌త‌ను త‌గ్గించ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో అనేక వివాదాలు తెర‌మీదికివ‌చ్చాయి.

కానీ, అధికార పార్టీ మాత్రం తాము చేసింది క‌రెక్టేన‌ని చెబుతుంది. కానీ, కేంద్రంలో ఇలాంటి ప‌రిస్థితి లేదు. ప్ర‌త్య‌ర్థులు అయినా.. ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇవ్వాల్సిన భ‌ద్ర‌తే కాకుండా.. అడిగితే మ‌రింత మందిని ఇస్తున్న సంస్కృతి కూడా ఉంది. భద్ర‌త‌ను రాజ‌కీయాల‌కు ముడి పెట్టి చూడ‌డం అనేది లేనేలేదు. కానీ, కేసీఆర్‌తో ప్రారంభ‌మైన ఈ జాడ్యం.. త‌ర్వాత‌.. ఏపీకి కూడా అంటుకుంది. అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్నా.. భ‌ద్ర‌త విష‌యంలో మెలిక పెట్టారు.

ఆయ‌న‌కు ఇచ్చే వాహ‌నాల విష‌యంలోనూ కుదించారు. దీంతో 2014-19 మ‌ధ్య జ‌గ‌న్ హైకోర్టుకు వెళ్లి భ‌ద్ర‌త తెచ్చుకున్నారు. ఇక‌, ఇది త‌ర్వాత కాలంలో జ‌గ‌న్ కూడా అమ‌లు చేశారు. మాజీ సీఎం అయిన చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త‌ను కుదించారు. ఆయ‌న‌కు కేంద్రం ఇచ్చి బ్లాక్ క్యాట్ త‌ప్ప‌.. ప్ర‌భుత్వం ప‌రంగా ఇచ్చే భ‌ద్ర‌త‌ను అచేత‌నం చేశారు. ఇది వివాదం కావ‌డం.. కేంద్రం జోక్యం చేసుకోవ‌డం.. హైకోర్టులో కేసులు దాఖ‌లు తెలిసిందే. చివ‌ర‌కు చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త‌ను పెంచారు.

ఇక‌, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బద్రత కోసం లేఖ రాసే ప‌రిస్థితి, హైకోర్టును ఆశ్ర‌యించే ప‌రిస్థితి నెల‌కొంది. జగన్మోహన్ రెడ్డి తనకు కల్పిస్తున్న భద్రతపై సంతృప్తిగా లేరు. తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే. ఇది త‌న‌కు స‌రిపోద‌ని.. గ‌తంలో త‌న‌కు ఉన్న 139 మంది సిబ్బందిని ఇవ్వాల‌న్న‌ది జ‌గ‌న్ వాద‌న. కానీ, స‌ర్కారు దీనికి ఒప్పుకోవ‌డం లేదు. ఎలా చూసుకున్నా.. వ్య‌క్తుల భ‌ద్ర‌త కూడా రాజ‌కీయంగా మారిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 12, 2024 6:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

5 hours ago