రాజకీయాల్లో 2014 తర్వాత వచ్చిన కొత్త పోకడ ఇప్పుడు మరింత బలోపేతంగా ముందుకు సాగుతోంది. తమను వ్యతిరేకించే నాయకులు, పార్టీల అధినేతను టార్గెట్ చేసుకోవడం ప్రభుత్వాలు చేసే పని. దీనిని ఎవరూ కాదనరు. అయితే.. ఈ క్రమంలో 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కొత్త పంథాను తెరమీదికి తెచ్చారు. ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు వారికి కల్పించే భద్రతను తగ్గించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనేక వివాదాలు తెరమీదికివచ్చాయి.
కానీ, అధికార పార్టీ మాత్రం తాము చేసింది కరెక్టేనని చెబుతుంది. కానీ, కేంద్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. ప్రత్యర్థులు అయినా.. ఎన్ని విమర్శలు చేసినా.. వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భద్రతే కాకుండా.. అడిగితే మరింత మందిని ఇస్తున్న సంస్కృతి కూడా ఉంది. భద్రతను రాజకీయాలకు ముడి పెట్టి చూడడం అనేది లేనేలేదు. కానీ, కేసీఆర్తో ప్రారంభమైన ఈ జాడ్యం.. తర్వాత.. ఏపీకి కూడా అంటుకుంది. అప్పట్లోనే చంద్రబాబు జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. భద్రత విషయంలో మెలిక పెట్టారు.
ఆయనకు ఇచ్చే వాహనాల విషయంలోనూ కుదించారు. దీంతో 2014-19 మధ్య జగన్ హైకోర్టుకు వెళ్లి భద్రత తెచ్చుకున్నారు. ఇక, ఇది తర్వాత కాలంలో జగన్ కూడా అమలు చేశారు. మాజీ సీఎం అయిన చంద్రబాబుకు భద్రతను కుదించారు. ఆయనకు కేంద్రం ఇచ్చి బ్లాక్ క్యాట్ తప్ప.. ప్రభుత్వం పరంగా ఇచ్చే భద్రతను అచేతనం చేశారు. ఇది వివాదం కావడం.. కేంద్రం జోక్యం చేసుకోవడం.. హైకోర్టులో కేసులు దాఖలు తెలిసిందే. చివరకు చంద్రబాబుకు భద్రతను పెంచారు.
ఇక, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బద్రత కోసం లేఖ రాసే పరిస్థితి, హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి తనకు కల్పిస్తున్న భద్రతపై సంతృప్తిగా లేరు. తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే. ఇది తనకు సరిపోదని.. గతంలో తనకు ఉన్న 139 మంది సిబ్బందిని ఇవ్వాలన్నది జగన్ వాదన. కానీ, సర్కారు దీనికి ఒప్పుకోవడం లేదు. ఎలా చూసుకున్నా.. వ్యక్తుల భద్రత కూడా రాజకీయంగా మారిపోవడం గమనార్హం.
This post was last modified on August 12, 2024 6:40 am
కల్కి, సలార్ లాంటి భారీ విజయాలు ఖాతాలో ఉన్నా కూడా, ప్రభాస్ వాటి సీక్వెల్స్ ను హోల్డ్ లో పెట్టి…
ప్రశాంత్ నీల్ అనగానే భారీ బ్లాస్ట్ లు, తుపాకుల మోతలు, డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే రక్తపాతం గుర్తొస్తాయి.…
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయికల్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో మెయిన్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్న…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ…
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మెగా 158' ప్రారంభోత్సవ వేడుక నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో చూశాం.…