రాజకీయాల్లో 2014 తర్వాత వచ్చిన కొత్త పోకడ ఇప్పుడు మరింత బలోపేతంగా ముందుకు సాగుతోంది. తమను వ్యతిరేకించే నాయకులు, పార్టీల అధినేతను టార్గెట్ చేసుకోవడం ప్రభుత్వాలు చేసే పని. దీనిని ఎవరూ కాదనరు. అయితే.. ఈ క్రమంలో 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కొత్త పంథాను తెరమీదికి తెచ్చారు. ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు వారికి కల్పించే భద్రతను తగ్గించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనేక వివాదాలు తెరమీదికివచ్చాయి.
కానీ, అధికార పార్టీ మాత్రం తాము చేసింది కరెక్టేనని చెబుతుంది. కానీ, కేంద్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. ప్రత్యర్థులు అయినా.. ఎన్ని విమర్శలు చేసినా.. వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భద్రతే కాకుండా.. అడిగితే మరింత మందిని ఇస్తున్న సంస్కృతి కూడా ఉంది. భద్రతను రాజకీయాలకు ముడి పెట్టి చూడడం అనేది లేనేలేదు. కానీ, కేసీఆర్తో ప్రారంభమైన ఈ జాడ్యం.. తర్వాత.. ఏపీకి కూడా అంటుకుంది. అప్పట్లోనే చంద్రబాబు జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. భద్రత విషయంలో మెలిక పెట్టారు.
ఆయనకు ఇచ్చే వాహనాల విషయంలోనూ కుదించారు. దీంతో 2014-19 మధ్య జగన్ హైకోర్టుకు వెళ్లి భద్రత తెచ్చుకున్నారు. ఇక, ఇది తర్వాత కాలంలో జగన్ కూడా అమలు చేశారు. మాజీ సీఎం అయిన చంద్రబాబుకు భద్రతను కుదించారు. ఆయనకు కేంద్రం ఇచ్చి బ్లాక్ క్యాట్ తప్ప.. ప్రభుత్వం పరంగా ఇచ్చే భద్రతను అచేతనం చేశారు. ఇది వివాదం కావడం.. కేంద్రం జోక్యం చేసుకోవడం.. హైకోర్టులో కేసులు దాఖలు తెలిసిందే. చివరకు చంద్రబాబుకు భద్రతను పెంచారు.
ఇక, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బద్రత కోసం లేఖ రాసే పరిస్థితి, హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి తనకు కల్పిస్తున్న భద్రతపై సంతృప్తిగా లేరు. తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే. ఇది తనకు సరిపోదని.. గతంలో తనకు ఉన్న 139 మంది సిబ్బందిని ఇవ్వాలన్నది జగన్ వాదన. కానీ, సర్కారు దీనికి ఒప్పుకోవడం లేదు. ఎలా చూసుకున్నా.. వ్యక్తుల భద్రత కూడా రాజకీయంగా మారిపోవడం గమనార్హం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…