Political News

ఆదివాసీ మహిళలతో చంద్రబాబు సంప్రదాయ నృత్యం

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో సింపుల్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. హుందాతనానికి పెట్టింది పేరుగా పెద్దమనిషి తరహాగా చంద్రబాబు ఎందరో ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రొఫెషనల్ సీఎంగా కాస్త గంభీరంగా కనిపించే చంద్రబాబు సందర్భానుసారంగా ఆటవిడుపుగా వ్యవహరించిన దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అటువంటి అరుదైన దృశ్యం ఒకటి ఈరోజు ఆవిష్కృతమైంది.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఆదివాసి మహిళలతో కలిసి వారి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు గిరిజన మహిళలతో చేయి చేయి కలిపి చిందేశారు. ఈ సందర్భంగా గిరిజన పురుషులు ధరించే కొమ్ము పాగాను చంద్రబాబు ధరించి వారితో మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు గిరిజనుల సంప్రదాయ వాయిద్యం డప్పు వాయించి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం, అరకు కాఫీ ఉత్పత్తులను చంద్రబాబు పరిశీలించి అరకు కాఫీ రుచి చూశారు.

ఈ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు వెంట గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. ఆదివాసీ మహిళలతో చంద్రబాబు సంప్రదాయ నృత్యం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on August 9, 2024 2:59 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

1 minute ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

17 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago