Political News

ప‌నిలేదు.. కానీ.. స్కోపుంది.. జ‌గ‌న్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ‌డిచిన‌ రెండు నెలల(జూన్ 4 – ఆగ‌స్టు 4) కాలంలో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అయితే అసలు చేయడానికి పని లేదా? అంటే చాలానే ఉంది. కానీ జగన్ పట్టించుకోవడం లేదు. దెబ్బతిన్న పార్టీని గాడిన పెట్టడం, అదేవిధంగా కొంతమంది నాయకులు వెళ్లిపోతారని భావిస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జ‌గించ‌డం చేయాలి.

అంతేకాదు, వారిని తన వైపు తిప్పుకోవడంతోపాటు త‌న‌పై విశ్వాసాన్ని మ‌రింత పెంచేచ‌ర్య‌లు తీసుకోవా లి. అలానే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఈ విషయాలను జగన్ పట్టిం చుకుని కూడా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పార్టీలోనే చర్చగా మారింది. పార్టీ ఇలానే ఉంటే తమ దారి తాము చూసుకుంటాం అన్న విధంగా చాలామంది నాయకులు సంకేతాలు పంపిస్తున్నారు. ఆన్లైన్ ఛానళ్లు, సోషల్ మాధ్యమాల రూపంలో వైసిపి నాయకులు ఈ విధమైన సంకేతాలను పంపిస్తున్నారు.

ఇది పార్టీని ముందు ముందు ఇబ్బంది పెట్టడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. తనకు ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉందని చెబుతున్నప్పటికీ దీనిని కాపాడుకునేందుకు, ప్రజల్లో నిరంతరం ఉండేందుకు వేస్తున్న ప్లాన్లు కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌ ఎక్కడా కనిపించట్లేదు. పైకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతున్నా అంతర్గతం గా మాత్రం ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకునే విధంగా జగన్ ప్రయత్నాలు పెరిగిపోవడం గమనార్హం. ఉదాహరణకు రాయలసీమ వంటి జిల్లాల్లో వైసిపి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఉన్న నాయకులు కూడా కేసుల భయంతోనో లేక ఇతర కారణాలతో అధికార పార్టీ వైపు ఇప్పటికే ముగ్గు చూపారు.

అంతర్గతంగా తమకు ఉన్న పరిచయాలు, తమకు ఉన్న మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వంలోని నాయకులతో వాళ్ళు కలిసి నడుస్తున్నారు. దీనిని కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో చాలామంది కార్పొరేటర్లు జనసేన వైపు మొగ్గు చూపారు. చిత్తూరులో అయితే ఏకంగా కార్పొరేషన్ మొత్తం కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోయింది. మరి ఎప్పటికైనా జగన్ స్పందిస్తారా లేక తాడేపల్లి ప్యాలెస్‌ కే పరిమితం అవుతారా అనేది చూడాలి.

Satya

Recent Posts

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

20 minutes ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

3 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

4 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

5 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

5 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

6 hours ago