Political News

ప‌నిలేదు.. కానీ.. స్కోపుంది.. జ‌గ‌న్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ‌డిచిన‌ రెండు నెలల(జూన్ 4 – ఆగ‌స్టు 4) కాలంలో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అయితే అసలు చేయడానికి పని లేదా? అంటే చాలానే ఉంది. కానీ జగన్ పట్టించుకోవడం లేదు. దెబ్బతిన్న పార్టీని గాడిన పెట్టడం, అదేవిధంగా కొంతమంది నాయకులు వెళ్లిపోతారని భావిస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జ‌గించ‌డం చేయాలి.

అంతేకాదు, వారిని తన వైపు తిప్పుకోవడంతోపాటు త‌న‌పై విశ్వాసాన్ని మ‌రింత పెంచేచ‌ర్య‌లు తీసుకోవా లి. అలానే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఈ విషయాలను జగన్ పట్టిం చుకుని కూడా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పార్టీలోనే చర్చగా మారింది. పార్టీ ఇలానే ఉంటే తమ దారి తాము చూసుకుంటాం అన్న విధంగా చాలామంది నాయకులు సంకేతాలు పంపిస్తున్నారు. ఆన్లైన్ ఛానళ్లు, సోషల్ మాధ్యమాల రూపంలో వైసిపి నాయకులు ఈ విధమైన సంకేతాలను పంపిస్తున్నారు.

ఇది పార్టీని ముందు ముందు ఇబ్బంది పెట్టడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. తనకు ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉందని చెబుతున్నప్పటికీ దీనిని కాపాడుకునేందుకు, ప్రజల్లో నిరంతరం ఉండేందుకు వేస్తున్న ప్లాన్లు కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌ ఎక్కడా కనిపించట్లేదు. పైకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతున్నా అంతర్గతం గా మాత్రం ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకునే విధంగా జగన్ ప్రయత్నాలు పెరిగిపోవడం గమనార్హం. ఉదాహరణకు రాయలసీమ వంటి జిల్లాల్లో వైసిపి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఉన్న నాయకులు కూడా కేసుల భయంతోనో లేక ఇతర కారణాలతో అధికార పార్టీ వైపు ఇప్పటికే ముగ్గు చూపారు.

అంతర్గతంగా తమకు ఉన్న పరిచయాలు, తమకు ఉన్న మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వంలోని నాయకులతో వాళ్ళు కలిసి నడుస్తున్నారు. దీనిని కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో చాలామంది కార్పొరేటర్లు జనసేన వైపు మొగ్గు చూపారు. చిత్తూరులో అయితే ఏకంగా కార్పొరేషన్ మొత్తం కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోయింది. మరి ఎప్పటికైనా జగన్ స్పందిస్తారా లేక తాడేపల్లి ప్యాలెస్‌ కే పరిమితం అవుతారా అనేది చూడాలి.

This post was last modified on August 6, 2024 11:59 am

Share

Recent Posts

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

38 minutes ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

1 hour ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

1 hour ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

1 hour ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

2 hours ago

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు.…

2 hours ago