Political News

ప‌నిలేదు.. కానీ.. స్కోపుంది.. జ‌గ‌న్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ‌డిచిన‌ రెండు నెలల(జూన్ 4 – ఆగ‌స్టు 4) కాలంలో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అయితే అసలు చేయడానికి పని లేదా? అంటే చాలానే ఉంది. కానీ జగన్ పట్టించుకోవడం లేదు. దెబ్బతిన్న పార్టీని గాడిన పెట్టడం, అదేవిధంగా కొంతమంది నాయకులు వెళ్లిపోతారని భావిస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జ‌గించ‌డం చేయాలి.

అంతేకాదు, వారిని తన వైపు తిప్పుకోవడంతోపాటు త‌న‌పై విశ్వాసాన్ని మ‌రింత పెంచేచ‌ర్య‌లు తీసుకోవా లి. అలానే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఈ విషయాలను జగన్ పట్టిం చుకుని కూడా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పార్టీలోనే చర్చగా మారింది. పార్టీ ఇలానే ఉంటే తమ దారి తాము చూసుకుంటాం అన్న విధంగా చాలామంది నాయకులు సంకేతాలు పంపిస్తున్నారు. ఆన్లైన్ ఛానళ్లు, సోషల్ మాధ్యమాల రూపంలో వైసిపి నాయకులు ఈ విధమైన సంకేతాలను పంపిస్తున్నారు.

ఇది పార్టీని ముందు ముందు ఇబ్బంది పెట్టడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. తనకు ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉందని చెబుతున్నప్పటికీ దీనిని కాపాడుకునేందుకు, ప్రజల్లో నిరంతరం ఉండేందుకు వేస్తున్న ప్లాన్లు కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌ ఎక్కడా కనిపించట్లేదు. పైకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతున్నా అంతర్గతం గా మాత్రం ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకునే విధంగా జగన్ ప్రయత్నాలు పెరిగిపోవడం గమనార్హం. ఉదాహరణకు రాయలసీమ వంటి జిల్లాల్లో వైసిపి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఉన్న నాయకులు కూడా కేసుల భయంతోనో లేక ఇతర కారణాలతో అధికార పార్టీ వైపు ఇప్పటికే ముగ్గు చూపారు.

అంతర్గతంగా తమకు ఉన్న పరిచయాలు, తమకు ఉన్న మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వంలోని నాయకులతో వాళ్ళు కలిసి నడుస్తున్నారు. దీనిని కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో చాలామంది కార్పొరేటర్లు జనసేన వైపు మొగ్గు చూపారు. చిత్తూరులో అయితే ఏకంగా కార్పొరేషన్ మొత్తం కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోయింది. మరి ఎప్పటికైనా జగన్ స్పందిస్తారా లేక తాడేపల్లి ప్యాలెస్‌ కే పరిమితం అవుతారా అనేది చూడాలి.

This post was last modified on August 6, 2024 11:59 am

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

39 seconds ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

12 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago