Political News

వీళ్లింతే.. ఓ రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే…!

రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా వారి మాట కూడా వినిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా తొడ‌గొట్టి స‌వాళ్లు రువ్విన కొంద‌రు నాయ‌కులు.. మీసం మెలేసి స‌వాళ్లు చేసిన మ‌రికొంద‌రు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాద‌వ్‌, రోజా, కొడాలి నాని, జోగి ర‌మేష్‌, విడద‌ల ర‌జ‌నీ స‌హా ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి ప‌లువురు ఉన్నారు.

అయితే.. ఇప్పుడు వారు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఏం మాట్లాడితే ఏం కేసు పెడ‌త రోన‌న్న బెంగ వారిని వెంటాడుతోంది. దీనికితోడు క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ కూడా వీరికి దూరంగా ఉంది. ఒక‌ప్పుడు అనిల్ తాలూకా అని చెప్పుకొన్న చాలా మంది నాయ‌కులు, వ్యాపారులు ఇప్పుడు ఆయ‌న పేరును మ‌రిచిపోయారు. అబ్బే.. ఆయ‌న‌తో మాకు పెద్ద‌గా సంబంధాలు లేవు. ఎన్నిక‌ల‌కు ముందే తెంచేసుకున్నాం.. అని నెల్లూరులో చెబుతున్నారు.

ఇక, కొడాలి నాని వ‌ర్గం అయితే.. క‌కావిక‌లం అయిపోయింది. చెట్టుకొకరు.. పుట్ట‌కొక‌రు … అన్న‌ట్టుగా నాయ కులు పారిపోయారు. వీరిని కూడా కేస‌లు భ‌యం .. ముఖ్యంగా కేసినో భ‌యం వెంటాడుతోంది. అందుకే కేడ‌ర్ డ‌ర్ ఫీల‌వుతున్నారు. ఇక‌, జోగి ర‌మేష్ అయితే.. త‌ను సైలెంట్ కావ‌డంతోపాటు.. త‌న వారిని కూడా సైలెంట్ చేశారు. విడ‌ద‌ల ర‌జనీ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కంపై విమ‌ర్శ‌లుచేసినా.. త‌ర్వాత‌.. మౌనంగా ఉండిపోయారు. రోజా గుళ్ల చుట్టూ తిరుగుతూ.. పాపాలు పోయేందుకు పూజ‌లు చేయిం చుకుంటున్నారు.

మొత్తంగా చూస్తే.. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన ఫైర్ బ్రాండ్లు అంద‌రూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పైగా మ‌రో రెండేళ్ల వ‌రకు కూడా వారు లైన్‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఏ చిన్న విష‌యంలో వారు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఇబ్బందేన‌ని వారి అనుచ‌రులే చెబుతున్నారు. వాస్తానికి నెల రోజులత‌ర్వాత‌యినా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆశించినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కూట‌మి ప్ర‌భుత్వం ధాటికి వీరంతా ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. కొంద‌రు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇదీ సంగ‌తి!!

This post was last modified on August 6, 2024 11:16 am

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

13 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago