Political News

వీళ్లింతే.. ఓ రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే…!

రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా వారి మాట కూడా వినిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా తొడ‌గొట్టి స‌వాళ్లు రువ్విన కొంద‌రు నాయ‌కులు.. మీసం మెలేసి స‌వాళ్లు చేసిన మ‌రికొంద‌రు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాద‌వ్‌, రోజా, కొడాలి నాని, జోగి ర‌మేష్‌, విడద‌ల ర‌జ‌నీ స‌హా ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి ప‌లువురు ఉన్నారు.

అయితే.. ఇప్పుడు వారు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఏం మాట్లాడితే ఏం కేసు పెడ‌త రోన‌న్న బెంగ వారిని వెంటాడుతోంది. దీనికితోడు క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ కూడా వీరికి దూరంగా ఉంది. ఒక‌ప్పుడు అనిల్ తాలూకా అని చెప్పుకొన్న చాలా మంది నాయ‌కులు, వ్యాపారులు ఇప్పుడు ఆయ‌న పేరును మ‌రిచిపోయారు. అబ్బే.. ఆయ‌న‌తో మాకు పెద్ద‌గా సంబంధాలు లేవు. ఎన్నిక‌ల‌కు ముందే తెంచేసుకున్నాం.. అని నెల్లూరులో చెబుతున్నారు.

ఇక, కొడాలి నాని వ‌ర్గం అయితే.. క‌కావిక‌లం అయిపోయింది. చెట్టుకొకరు.. పుట్ట‌కొక‌రు … అన్న‌ట్టుగా నాయ కులు పారిపోయారు. వీరిని కూడా కేస‌లు భ‌యం .. ముఖ్యంగా కేసినో భ‌యం వెంటాడుతోంది. అందుకే కేడ‌ర్ డ‌ర్ ఫీల‌వుతున్నారు. ఇక‌, జోగి ర‌మేష్ అయితే.. త‌ను సైలెంట్ కావ‌డంతోపాటు.. త‌న వారిని కూడా సైలెంట్ చేశారు. విడ‌ద‌ల ర‌జనీ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కంపై విమ‌ర్శ‌లుచేసినా.. త‌ర్వాత‌.. మౌనంగా ఉండిపోయారు. రోజా గుళ్ల చుట్టూ తిరుగుతూ.. పాపాలు పోయేందుకు పూజ‌లు చేయిం చుకుంటున్నారు.

మొత్తంగా చూస్తే.. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన ఫైర్ బ్రాండ్లు అంద‌రూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పైగా మ‌రో రెండేళ్ల వ‌రకు కూడా వారు లైన్‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఏ చిన్న విష‌యంలో వారు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఇబ్బందేన‌ని వారి అనుచ‌రులే చెబుతున్నారు. వాస్తానికి నెల రోజులత‌ర్వాత‌యినా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆశించినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కూట‌మి ప్ర‌భుత్వం ధాటికి వీరంతా ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. కొంద‌రు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇదీ సంగ‌తి!!

This post was last modified on August 6, 2024 11:16 am

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

1 hour ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

2 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

2 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

3 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

3 hours ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

4 hours ago