రాజకీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వారి మాట కూడా వినిపించడం లేదు. ఎన్నికలకు ముందు కూడా తొడగొట్టి సవాళ్లు రువ్విన కొందరు నాయకులు.. మీసం మెలేసి సవాళ్లు చేసిన మరికొందరు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని, జోగి రమేష్, విడదల రజనీ సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ వంటి పలువురు ఉన్నారు.
అయితే.. ఇప్పుడు వారు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఏం మాట్లాడితే ఏం కేసు పెడత రోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో కేడర్ కూడా వీరికి దూరంగా ఉంది. ఒకప్పుడు అనిల్ తాలూకా అని చెప్పుకొన్న చాలా మంది నాయకులు, వ్యాపారులు ఇప్పుడు ఆయన పేరును మరిచిపోయారు. అబ్బే.. ఆయనతో మాకు పెద్దగా సంబంధాలు లేవు. ఎన్నికలకు ముందే తెంచేసుకున్నాం.. అని నెల్లూరులో చెబుతున్నారు.
ఇక, కొడాలి నాని వర్గం అయితే.. కకావికలం అయిపోయింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు … అన్నట్టుగా నాయ కులు పారిపోయారు. వీరిని కూడా కేసలు భయం .. ముఖ్యంగా కేసినో భయం వెంటాడుతోంది. అందుకే కేడర్ డర్ ఫీలవుతున్నారు. ఇక, జోగి రమేష్ అయితే.. తను సైలెంట్ కావడంతోపాటు.. తన వారిని కూడా సైలెంట్ చేశారు. విడదల రజనీ కూడా సైలెంట్గానే ఉన్నారు. ఆరోగ్య శ్రీ పథకంపై విమర్శలుచేసినా.. తర్వాత.. మౌనంగా ఉండిపోయారు. రోజా గుళ్ల చుట్టూ తిరుగుతూ.. పాపాలు పోయేందుకు పూజలు చేయిం చుకుంటున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏపీ రాజకీయాల్లో ఫైర్ రేపిన ఫైర్ బ్రాండ్లు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పైగా మరో రెండేళ్ల వరకు కూడా వారు లైన్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఏ చిన్న విషయంలో వారు బయటకు వచ్చినా.. ఇబ్బందేనని వారి అనుచరులే చెబుతున్నారు. వాస్తానికి నెల రోజులతర్వాతయినా బయటకు వస్తారని ఆశించినా.. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ధాటికి వీరంతా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇదీ సంగతి!!
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…