రాజకీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వారి మాట కూడా వినిపించడం లేదు. ఎన్నికలకు ముందు కూడా తొడగొట్టి సవాళ్లు రువ్విన కొందరు నాయకులు.. మీసం మెలేసి సవాళ్లు చేసిన మరికొందరు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని, జోగి రమేష్, విడదల రజనీ సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ వంటి పలువురు ఉన్నారు.
అయితే.. ఇప్పుడు వారు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఏం మాట్లాడితే ఏం కేసు పెడత రోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో కేడర్ కూడా వీరికి దూరంగా ఉంది. ఒకప్పుడు అనిల్ తాలూకా అని చెప్పుకొన్న చాలా మంది నాయకులు, వ్యాపారులు ఇప్పుడు ఆయన పేరును మరిచిపోయారు. అబ్బే.. ఆయనతో మాకు పెద్దగా సంబంధాలు లేవు. ఎన్నికలకు ముందే తెంచేసుకున్నాం.. అని నెల్లూరులో చెబుతున్నారు.
ఇక, కొడాలి నాని వర్గం అయితే.. కకావికలం అయిపోయింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు … అన్నట్టుగా నాయ కులు పారిపోయారు. వీరిని కూడా కేసలు భయం .. ముఖ్యంగా కేసినో భయం వెంటాడుతోంది. అందుకే కేడర్ డర్ ఫీలవుతున్నారు. ఇక, జోగి రమేష్ అయితే.. తను సైలెంట్ కావడంతోపాటు.. తన వారిని కూడా సైలెంట్ చేశారు. విడదల రజనీ కూడా సైలెంట్గానే ఉన్నారు. ఆరోగ్య శ్రీ పథకంపై విమర్శలుచేసినా.. తర్వాత.. మౌనంగా ఉండిపోయారు. రోజా గుళ్ల చుట్టూ తిరుగుతూ.. పాపాలు పోయేందుకు పూజలు చేయిం చుకుంటున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏపీ రాజకీయాల్లో ఫైర్ రేపిన ఫైర్ బ్రాండ్లు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పైగా మరో రెండేళ్ల వరకు కూడా వారు లైన్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఏ చిన్న విషయంలో వారు బయటకు వచ్చినా.. ఇబ్బందేనని వారి అనుచరులే చెబుతున్నారు. వాస్తానికి నెల రోజులతర్వాతయినా బయటకు వస్తారని ఆశించినా.. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ధాటికి వీరంతా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇదీ సంగతి!!
This post was last modified on August 6, 2024 11:16 am
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…