Political News

వీళ్లింతే.. ఓ రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే…!

రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా వారి మాట కూడా వినిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా తొడ‌గొట్టి స‌వాళ్లు రువ్విన కొంద‌రు నాయ‌కులు.. మీసం మెలేసి స‌వాళ్లు చేసిన మ‌రికొంద‌రు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాద‌వ్‌, రోజా, కొడాలి నాని, జోగి ర‌మేష్‌, విడద‌ల ర‌జ‌నీ స‌హా ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి ప‌లువురు ఉన్నారు.

అయితే.. ఇప్పుడు వారు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఏం మాట్లాడితే ఏం కేసు పెడ‌త రోన‌న్న బెంగ వారిని వెంటాడుతోంది. దీనికితోడు క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ కూడా వీరికి దూరంగా ఉంది. ఒక‌ప్పుడు అనిల్ తాలూకా అని చెప్పుకొన్న చాలా మంది నాయ‌కులు, వ్యాపారులు ఇప్పుడు ఆయ‌న పేరును మ‌రిచిపోయారు. అబ్బే.. ఆయ‌న‌తో మాకు పెద్ద‌గా సంబంధాలు లేవు. ఎన్నిక‌ల‌కు ముందే తెంచేసుకున్నాం.. అని నెల్లూరులో చెబుతున్నారు.

ఇక, కొడాలి నాని వ‌ర్గం అయితే.. క‌కావిక‌లం అయిపోయింది. చెట్టుకొకరు.. పుట్ట‌కొక‌రు … అన్న‌ట్టుగా నాయ కులు పారిపోయారు. వీరిని కూడా కేస‌లు భ‌యం .. ముఖ్యంగా కేసినో భ‌యం వెంటాడుతోంది. అందుకే కేడ‌ర్ డ‌ర్ ఫీల‌వుతున్నారు. ఇక‌, జోగి ర‌మేష్ అయితే.. త‌ను సైలెంట్ కావ‌డంతోపాటు.. త‌న వారిని కూడా సైలెంట్ చేశారు. విడ‌ద‌ల ర‌జనీ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కంపై విమ‌ర్శ‌లుచేసినా.. త‌ర్వాత‌.. మౌనంగా ఉండిపోయారు. రోజా గుళ్ల చుట్టూ తిరుగుతూ.. పాపాలు పోయేందుకు పూజ‌లు చేయిం చుకుంటున్నారు.

మొత్తంగా చూస్తే.. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన ఫైర్ బ్రాండ్లు అంద‌రూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పైగా మ‌రో రెండేళ్ల వ‌రకు కూడా వారు లైన్‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఏ చిన్న విష‌యంలో వారు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఇబ్బందేన‌ని వారి అనుచ‌రులే చెబుతున్నారు. వాస్తానికి నెల రోజులత‌ర్వాత‌యినా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆశించినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కూట‌మి ప్ర‌భుత్వం ధాటికి వీరంతా ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. కొంద‌రు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇదీ సంగ‌తి!!

This post was last modified on August 6, 2024 11:16 am

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

4 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

5 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

6 hours ago