Political News

క‌లెక్ట‌ర్ల‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్లిన చంద్ర‌బాబు..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌కు షాకిచ్చారు. ఆయ‌న మాట్లాడిన తీరు.. ఆయ‌న చెప్పిన విష‌యాలు విని 26 జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణం.. గ‌త ఐదేళ్ల‌లో వారు ఎన్న‌డూ విన‌ని.. ఎప్పుడూ ఊహించ‌ని విధంగా నిర్ణ‌యాలు.. సూచ‌న‌లు.. దిశానిర్దేశాలు ఉండ‌డ‌మే. ఉదాహ‌ర‌ణ‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ అనే మాట 2014-19 త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎప్పుడూ రాష్ట్రంలో వినిపించ‌లేదు. మ‌ళ్లీ ఇప్పుడే చంద్ర‌బాబు నోటి నుంచి ఆ మాట వినిపించింది.

పెట్టుబ‌డులు పెట్టేవారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాల‌సీని మ‌ళ్లీ తీసుకువ‌స్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీంతో క‌లెక్ట‌ర్లు మ‌రోసారి పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి వంటి వాటిని వారు మ‌న‌నం చేసుకున్నారు. అలాగే.. ప్ర‌తి మూడు మాసాల‌కు ఒక‌సారి క‌లెక్ట‌ర్ల ప‌నితీరును అంచ‌నా వేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇది కూడా వారు ఊహించ‌ని ప‌రిణామం. నిజానికి గ‌త 2019-24 మ‌ధ్య కాలంలో ప‌నితీరును అంచ‌నా వేసే విధానం వేరేగా ఉండేది.

తాము చెప్పిన నిర్ణ‌యాలు అమ‌లు చేసేవారిని అంద‌లం ఎక్కించ‌డం.. త‌మ నిర్ణ‌యాల్లో చెడుగును గుర్తించి అలెర్ట్ చేస్తే.. వెంట‌నే ప‌క్క‌న పెట్ట‌డం వంటివి సునాయాశంగా జ‌రిగిపోయాయి. దీంతో ప‌నితీరు అంటే.. భ‌జ‌న చేయ‌డ‌మేన‌న్న వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు అలాంటి భ‌జ‌న‌ల‌కు అవ‌కాశం లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. దీంతో నిర్దిష్టంగా క‌లెక్ట‌ర్లు ప‌నిచేసేందుకు.. ప్ర‌జ‌ల‌కు-ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధుల్లా నిలిచేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

ఈ ప‌రిణామం కూడా.. క‌లెక్ట‌ర్ల‌ను పాత రోజుల్లోకి తీసుకు వెళ్లింది. అలాగే.. పీపీపీ, పీ-4 వంటి అంశాల‌ను ప్ర‌స్తావించిన‌ప్పుడు కూడా క‌లెక్ట‌ర్లు.. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌ను మ‌న‌నం చేసుకున్నారు. వైసీపీ హ‌యాం లో ఇలాంటి ప‌దాలు కానీ.. ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఎక్క‌డా వారికి వినిపించ‌లేదు. క‌నిపించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా 1995 నాటి సీఎంను చూస్తారు.. అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ప్పుడు మ‌రింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేయ‌డంతోపాటు.. క‌లెక్ట‌ర్ల‌ను ముందుకు న‌డిపిం చ‌డంలోనూ అప్ప‌ట్లో చంద్ర‌బాబు దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే ప‌రిస్థితి పున‌రావృతం అవుతుంద‌ని చెప్ప‌డంతో క‌లెక్ట‌ర్లు.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 5, 2024 10:31 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago