ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు షాకిచ్చారు. ఆయన మాట్లాడిన తీరు.. ఆయన చెప్పిన విషయాలు విని 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి కారణం.. గత ఐదేళ్లలో వారు ఎన్నడూ వినని.. ఎప్పుడూ ఊహించని విధంగా నిర్ణయాలు.. సూచనలు.. దిశానిర్దేశాలు ఉండడమే. ఉదాహరణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట 2014-19 తర్వాత.. మళ్లీ ఎప్పుడూ రాష్ట్రంలో వినిపించలేదు. మళ్లీ ఇప్పుడే చంద్రబాబు నోటి నుంచి ఆ మాట వినిపించింది.
పెట్టుబడులు పెట్టేవారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని మళ్లీ తీసుకువస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీంతో కలెక్టర్లు మరోసారి పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో చంద్రబాబు వ్యవహార శైలి వంటి వాటిని వారు మననం చేసుకున్నారు. అలాగే.. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కలెక్టర్ల పనితీరును అంచనా వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా వారు ఊహించని పరిణామం. నిజానికి గత 2019-24 మధ్య కాలంలో పనితీరును అంచనా వేసే విధానం వేరేగా ఉండేది.
తాము చెప్పిన నిర్ణయాలు అమలు చేసేవారిని అందలం ఎక్కించడం.. తమ నిర్ణయాల్లో చెడుగును గుర్తించి అలెర్ట్ చేస్తే.. వెంటనే పక్కన పెట్టడం వంటివి సునాయాశంగా జరిగిపోయాయి. దీంతో పనితీరు అంటే.. భజన చేయడమేనన్న వాదన తెరమీదికి వచ్చింది. ఇక, ఇప్పుడు అలాంటి భజనలకు అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో నిర్దిష్టంగా కలెక్టర్లు పనిచేసేందుకు.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధుల్లా నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ పరిణామం కూడా.. కలెక్టర్లను పాత రోజుల్లోకి తీసుకు వెళ్లింది. అలాగే.. పీపీపీ, పీ-4 వంటి అంశాలను ప్రస్తావించినప్పుడు కూడా కలెక్టర్లు.. గత చంద్రబాబు పాలనను మననం చేసుకున్నారు. వైసీపీ హయాం లో ఇలాంటి పదాలు కానీ.. ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా వారికి వినిపించలేదు. కనిపించలేదు. మరీ ముఖ్యంగా 1995 నాటి సీఎంను చూస్తారు.. అని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు.. కలెక్టర్లను ముందుకు నడిపిం చడంలోనూ అప్పట్లో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని చెప్పడంతో కలెక్టర్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on August 5, 2024 10:31 pm
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…