ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు షాకిచ్చారు. ఆయన మాట్లాడిన తీరు.. ఆయన చెప్పిన విషయాలు విని 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి కారణం.. గత ఐదేళ్లలో వారు ఎన్నడూ వినని.. ఎప్పుడూ ఊహించని విధంగా నిర్ణయాలు.. సూచనలు.. దిశానిర్దేశాలు ఉండడమే. ఉదాహరణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట 2014-19 తర్వాత.. మళ్లీ ఎప్పుడూ రాష్ట్రంలో వినిపించలేదు. మళ్లీ ఇప్పుడే చంద్రబాబు నోటి నుంచి ఆ మాట వినిపించింది.
పెట్టుబడులు పెట్టేవారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని మళ్లీ తీసుకువస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీంతో కలెక్టర్లు మరోసారి పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో చంద్రబాబు వ్యవహార శైలి వంటి వాటిని వారు మననం చేసుకున్నారు. అలాగే.. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కలెక్టర్ల పనితీరును అంచనా వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా వారు ఊహించని పరిణామం. నిజానికి గత 2019-24 మధ్య కాలంలో పనితీరును అంచనా వేసే విధానం వేరేగా ఉండేది.
తాము చెప్పిన నిర్ణయాలు అమలు చేసేవారిని అందలం ఎక్కించడం.. తమ నిర్ణయాల్లో చెడుగును గుర్తించి అలెర్ట్ చేస్తే.. వెంటనే పక్కన పెట్టడం వంటివి సునాయాశంగా జరిగిపోయాయి. దీంతో పనితీరు అంటే.. భజన చేయడమేనన్న వాదన తెరమీదికి వచ్చింది. ఇక, ఇప్పుడు అలాంటి భజనలకు అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో నిర్దిష్టంగా కలెక్టర్లు పనిచేసేందుకు.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధుల్లా నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ పరిణామం కూడా.. కలెక్టర్లను పాత రోజుల్లోకి తీసుకు వెళ్లింది. అలాగే.. పీపీపీ, పీ-4 వంటి అంశాలను ప్రస్తావించినప్పుడు కూడా కలెక్టర్లు.. గత చంద్రబాబు పాలనను మననం చేసుకున్నారు. వైసీపీ హయాం లో ఇలాంటి పదాలు కానీ.. ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా వారికి వినిపించలేదు. కనిపించలేదు. మరీ ముఖ్యంగా 1995 నాటి సీఎంను చూస్తారు.. అని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు.. కలెక్టర్లను ముందుకు నడిపిం చడంలోనూ అప్పట్లో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని చెప్పడంతో కలెక్టర్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on August 5, 2024 10:31 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…