ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు షాకిచ్చారు. ఆయన మాట్లాడిన తీరు.. ఆయన చెప్పిన విషయాలు విని 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి కారణం.. గత ఐదేళ్లలో వారు ఎన్నడూ వినని.. ఎప్పుడూ ఊహించని విధంగా నిర్ణయాలు.. సూచనలు.. దిశానిర్దేశాలు ఉండడమే. ఉదాహరణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట 2014-19 తర్వాత.. మళ్లీ ఎప్పుడూ రాష్ట్రంలో వినిపించలేదు. మళ్లీ ఇప్పుడే చంద్రబాబు నోటి నుంచి ఆ మాట వినిపించింది.
పెట్టుబడులు పెట్టేవారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని మళ్లీ తీసుకువస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీంతో కలెక్టర్లు మరోసారి పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో చంద్రబాబు వ్యవహార శైలి వంటి వాటిని వారు మననం చేసుకున్నారు. అలాగే.. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కలెక్టర్ల పనితీరును అంచనా వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా వారు ఊహించని పరిణామం. నిజానికి గత 2019-24 మధ్య కాలంలో పనితీరును అంచనా వేసే విధానం వేరేగా ఉండేది.
తాము చెప్పిన నిర్ణయాలు అమలు చేసేవారిని అందలం ఎక్కించడం.. తమ నిర్ణయాల్లో చెడుగును గుర్తించి అలెర్ట్ చేస్తే.. వెంటనే పక్కన పెట్టడం వంటివి సునాయాశంగా జరిగిపోయాయి. దీంతో పనితీరు అంటే.. భజన చేయడమేనన్న వాదన తెరమీదికి వచ్చింది. ఇక, ఇప్పుడు అలాంటి భజనలకు అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో నిర్దిష్టంగా కలెక్టర్లు పనిచేసేందుకు.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధుల్లా నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ పరిణామం కూడా.. కలెక్టర్లను పాత రోజుల్లోకి తీసుకు వెళ్లింది. అలాగే.. పీపీపీ, పీ-4 వంటి అంశాలను ప్రస్తావించినప్పుడు కూడా కలెక్టర్లు.. గత చంద్రబాబు పాలనను మననం చేసుకున్నారు. వైసీపీ హయాం లో ఇలాంటి పదాలు కానీ.. ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా వారికి వినిపించలేదు. కనిపించలేదు. మరీ ముఖ్యంగా 1995 నాటి సీఎంను చూస్తారు.. అని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు.. కలెక్టర్లను ముందుకు నడిపిం చడంలోనూ అప్పట్లో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని చెప్పడంతో కలెక్టర్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on August 5, 2024 10:31 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…