ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు షాకిచ్చారు. ఆయన మాట్లాడిన తీరు.. ఆయన చెప్పిన విషయాలు విని 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి కారణం.. గత ఐదేళ్లలో వారు ఎన్నడూ వినని.. ఎప్పుడూ ఊహించని విధంగా నిర్ణయాలు.. సూచనలు.. దిశానిర్దేశాలు ఉండడమే. ఉదాహరణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట 2014-19 తర్వాత.. మళ్లీ ఎప్పుడూ రాష్ట్రంలో వినిపించలేదు. మళ్లీ ఇప్పుడే చంద్రబాబు నోటి నుంచి ఆ మాట వినిపించింది.
పెట్టుబడులు పెట్టేవారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని మళ్లీ తీసుకువస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీంతో కలెక్టర్లు మరోసారి పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో చంద్రబాబు వ్యవహార శైలి వంటి వాటిని వారు మననం చేసుకున్నారు. అలాగే.. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కలెక్టర్ల పనితీరును అంచనా వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా వారు ఊహించని పరిణామం. నిజానికి గత 2019-24 మధ్య కాలంలో పనితీరును అంచనా వేసే విధానం వేరేగా ఉండేది.
తాము చెప్పిన నిర్ణయాలు అమలు చేసేవారిని అందలం ఎక్కించడం.. తమ నిర్ణయాల్లో చెడుగును గుర్తించి అలెర్ట్ చేస్తే.. వెంటనే పక్కన పెట్టడం వంటివి సునాయాశంగా జరిగిపోయాయి. దీంతో పనితీరు అంటే.. భజన చేయడమేనన్న వాదన తెరమీదికి వచ్చింది. ఇక, ఇప్పుడు అలాంటి భజనలకు అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో నిర్దిష్టంగా కలెక్టర్లు పనిచేసేందుకు.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధుల్లా నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ పరిణామం కూడా.. కలెక్టర్లను పాత రోజుల్లోకి తీసుకు వెళ్లింది. అలాగే.. పీపీపీ, పీ-4 వంటి అంశాలను ప్రస్తావించినప్పుడు కూడా కలెక్టర్లు.. గత చంద్రబాబు పాలనను మననం చేసుకున్నారు. వైసీపీ హయాం లో ఇలాంటి పదాలు కానీ.. ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా వారికి వినిపించలేదు. కనిపించలేదు. మరీ ముఖ్యంగా 1995 నాటి సీఎంను చూస్తారు.. అని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు.. కలెక్టర్లను ముందుకు నడిపిం చడంలోనూ అప్పట్లో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని చెప్పడంతో కలెక్టర్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on August 5, 2024 10:31 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…