Political News

ఎవ‌రొచ్చినా.. ఢిల్లీ అడ్ర‌స్ చెబుతున్న‌ పురందేశ్వ‌రి!

బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు, రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి నిర్లిప్తంగా ఉన్నారా? ఏ ప‌ని అడిగినా.. నా చేతుల్లో ఏమీలేద‌ని సెల‌విస్తున్నారా? త‌న ప‌నేదే తాను చూసుకుని వెళ్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో బీజేపీ చేతులు క‌లిపి.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం పంచుకున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పురందేశ్వ‌రి ప‌లుకుబ‌డి పెరుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

పైగా.. కూట‌మి ప్ర‌భుత్వ‌మే కావ‌డం.. ఒక మంత్రి ప‌దవిని కూడా రాష్ట్రంలో తీసుకున్న నేప‌థ్యంలో బీజేపీకి సానుకూల ప‌రిణామాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంద‌రూ భావించారు. దీంతో ఏ ప‌నికావాల‌న్నా.. ముందు పురందేశ్వ‌రికి చెబుతున్నారు. సాధార‌ణంగా.. రాష్ట్రంలో టీడీపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని పంచుకున్న నేప‌థ్యంలో ఆమె చెబితే త‌మ‌కు ప‌నులు అవుతాయ‌ని అంద‌రూ భావించ‌డంలో త‌ప్పులేదు. కానీ, ఆమె మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చేవారిని తిరుగు ట‌పాలో వెన‌క్కి పంపిస్తున్నారు.

“నా చేతుల్లో ఏమీ లేదు. పైవాళ్ల‌ను క‌ల‌వండి. అధిష్టానం ద‌గ్గ‌ర‌కు వెళ్లండి” అంటూ ఢిల్లీ అడ్ర‌స్ చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల కోలాహ‌లం జ‌రుగుతోంది. పైకి అంద‌రూ సైలెంట్‌గానే ఉన్నా.. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు తెర‌చాటుగా.. త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు బీజేపీ నాయ‌కులు కూడా నామినేటెడ్ ప‌ద‌వులు ఆశిస్తున్న మాట వాస్త‌వం. అయితే.. ఎలానూ రాష్ట్ర చీఫ్ కాబ‌ట్టి పురందేశ్వ‌రిని ఆశ్ర‌యిస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం ఢిల్లీ అడ్ర‌స్ చెబుతూ.. కాలం వెళ్ల దీస్తున్నారు.

దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అని చూస్తే.. త‌న‌కు కేంద్రంలో ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని పురందేశ్వ‌రి ఆవేద‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని.. ఇస్తార‌ని ఆమె ఆశ‌లు పెట్టుకు న్నారు. కానీ, ఆమెకు ఇవ్వ‌కుండా న‌ర‌సాపురం నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న భూప‌తి రాజు కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, రాష్ట్రంలోనూ త‌న నిర్ణ‌యాల‌తో సంబంధం లేకుండా.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

దీంతో రాష్ట్రంలో తీసుకునే నిర్ణ‌యాల విష‌యంలోనూ.. కేంద్రం తీసుకునే నిర్ణ‌యాల విష‌యంలోనూ త‌న ప్ర‌మేయం లేక‌పోవ‌డంతో దీనిని అవ‌మానంగా ఫీల‌వుతున్నార‌ని పురందేశ్వ‌రి గురించి బీజేపీలో ఒక చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే వ‌చ్చిన వారికి వ‌చ్చిన‌ట్టు ఢిల్లీ అడ్ర‌స్ చెబుతున్నార‌ట‌. త‌న చేతుల్లో ఏమీ లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారట‌. ఇదీ.. సంగ‌తి!!

This post was last modified on August 5, 2024 3:07 pm

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

50 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

1 hour ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

3 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

4 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

5 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

6 hours ago