బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిర్లిప్తంగా ఉన్నారా? ఏ పని అడిగినా.. నా చేతుల్లో ఏమీలేదని సెలవిస్తున్నారా? తన పనేదే తాను చూసుకుని వెళ్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నాయకులు. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ చేతులు కలిపి.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం పంచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పురందేశ్వరి పలుకుబడి పెరుగుతుందని అందరూ అనుకున్నారు.
పైగా.. కూటమి ప్రభుత్వమే కావడం.. ఒక మంత్రి పదవిని కూడా రాష్ట్రంలో తీసుకున్న నేపథ్యంలో బీజేపీకి సానుకూల పరిణామాలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించారు. దీంతో ఏ పనికావాలన్నా.. ముందు పురందేశ్వరికి చెబుతున్నారు. సాధారణంగా.. రాష్ట్రంలో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని పంచుకున్న నేపథ్యంలో ఆమె చెబితే తమకు పనులు అవుతాయని అందరూ భావించడంలో తప్పులేదు. కానీ, ఆమె మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తనవద్దకు వచ్చేవారిని తిరుగు టపాలో వెనక్కి పంపిస్తున్నారు.
“నా చేతుల్లో ఏమీ లేదు. పైవాళ్లను కలవండి. అధిష్టానం దగ్గరకు వెళ్లండి” అంటూ ఢిల్లీ అడ్రస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం జరుగుతోంది. పైకి అందరూ సైలెంట్గానే ఉన్నా.. ఎక్కడికక్కడ నాయకులు తెరచాటుగా.. తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు బీజేపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న మాట వాస్తవం. అయితే.. ఎలానూ రాష్ట్ర చీఫ్ కాబట్టి పురందేశ్వరిని ఆశ్రయిస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం ఢిల్లీ అడ్రస్ చెబుతూ.. కాలం వెళ్ల దీస్తున్నారు.
దీనికి కారణం ఏంటి? ఎందుకు? అని చూస్తే.. తనకు కేంద్రంలో ప్రాధాన్యం దక్కలేదని పురందేశ్వరి ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని.. ఇస్తారని ఆమె ఆశలు పెట్టుకు న్నారు. కానీ, ఆమెకు ఇవ్వకుండా నరసాపురం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న భూపతి రాజు కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, రాష్ట్రంలోనూ తన నిర్ణయాలతో సంబంధం లేకుండా.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీంతో రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాల విషయంలోనూ.. కేంద్రం తీసుకునే నిర్ణయాల విషయంలోనూ తన ప్రమేయం లేకపోవడంతో దీనిని అవమానంగా ఫీలవుతున్నారని పురందేశ్వరి గురించి బీజేపీలో ఒక చర్చ సాగుతుండడం గమనార్హం. అందుకే వచ్చిన వారికి వచ్చినట్టు ఢిల్లీ అడ్రస్ చెబుతున్నారట. తన చేతుల్లో ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారట. ఇదీ.. సంగతి!!
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…