బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిర్లిప్తంగా ఉన్నారా? ఏ పని అడిగినా.. నా చేతుల్లో ఏమీలేదని సెలవిస్తున్నారా? తన పనేదే తాను చూసుకుని వెళ్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నాయకులు. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ చేతులు కలిపి.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం పంచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పురందేశ్వరి పలుకుబడి పెరుగుతుందని అందరూ అనుకున్నారు.
పైగా.. కూటమి ప్రభుత్వమే కావడం.. ఒక మంత్రి పదవిని కూడా రాష్ట్రంలో తీసుకున్న నేపథ్యంలో బీజేపీకి సానుకూల పరిణామాలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించారు. దీంతో ఏ పనికావాలన్నా.. ముందు పురందేశ్వరికి చెబుతున్నారు. సాధారణంగా.. రాష్ట్రంలో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని పంచుకున్న నేపథ్యంలో ఆమె చెబితే తమకు పనులు అవుతాయని అందరూ భావించడంలో తప్పులేదు. కానీ, ఆమె మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తనవద్దకు వచ్చేవారిని తిరుగు టపాలో వెనక్కి పంపిస్తున్నారు.
“నా చేతుల్లో ఏమీ లేదు. పైవాళ్లను కలవండి. అధిష్టానం దగ్గరకు వెళ్లండి” అంటూ ఢిల్లీ అడ్రస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం జరుగుతోంది. పైకి అందరూ సైలెంట్గానే ఉన్నా.. ఎక్కడికక్కడ నాయకులు తెరచాటుగా.. తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు బీజేపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న మాట వాస్తవం. అయితే.. ఎలానూ రాష్ట్ర చీఫ్ కాబట్టి పురందేశ్వరిని ఆశ్రయిస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం ఢిల్లీ అడ్రస్ చెబుతూ.. కాలం వెళ్ల దీస్తున్నారు.
దీనికి కారణం ఏంటి? ఎందుకు? అని చూస్తే.. తనకు కేంద్రంలో ప్రాధాన్యం దక్కలేదని పురందేశ్వరి ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని.. ఇస్తారని ఆమె ఆశలు పెట్టుకు న్నారు. కానీ, ఆమెకు ఇవ్వకుండా నరసాపురం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న భూపతి రాజు కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, రాష్ట్రంలోనూ తన నిర్ణయాలతో సంబంధం లేకుండా.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీంతో రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాల విషయంలోనూ.. కేంద్రం తీసుకునే నిర్ణయాల విషయంలోనూ తన ప్రమేయం లేకపోవడంతో దీనిని అవమానంగా ఫీలవుతున్నారని పురందేశ్వరి గురించి బీజేపీలో ఒక చర్చ సాగుతుండడం గమనార్హం. అందుకే వచ్చిన వారికి వచ్చినట్టు ఢిల్లీ అడ్రస్ చెబుతున్నారట. తన చేతుల్లో ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారట. ఇదీ.. సంగతి!!
This post was last modified on August 5, 2024 3:07 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…