Political News

ఎవ‌రొచ్చినా.. ఢిల్లీ అడ్ర‌స్ చెబుతున్న‌ పురందేశ్వ‌రి!

బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు, రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి నిర్లిప్తంగా ఉన్నారా? ఏ ప‌ని అడిగినా.. నా చేతుల్లో ఏమీలేద‌ని సెల‌విస్తున్నారా? త‌న ప‌నేదే తాను చూసుకుని వెళ్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో బీజేపీ చేతులు క‌లిపి.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం పంచుకున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పురందేశ్వ‌రి ప‌లుకుబ‌డి పెరుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

పైగా.. కూట‌మి ప్ర‌భుత్వ‌మే కావ‌డం.. ఒక మంత్రి ప‌దవిని కూడా రాష్ట్రంలో తీసుకున్న నేప‌థ్యంలో బీజేపీకి సానుకూల ప‌రిణామాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంద‌రూ భావించారు. దీంతో ఏ ప‌నికావాల‌న్నా.. ముందు పురందేశ్వ‌రికి చెబుతున్నారు. సాధార‌ణంగా.. రాష్ట్రంలో టీడీపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని పంచుకున్న నేప‌థ్యంలో ఆమె చెబితే త‌మ‌కు ప‌నులు అవుతాయ‌ని అంద‌రూ భావించ‌డంలో త‌ప్పులేదు. కానీ, ఆమె మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చేవారిని తిరుగు ట‌పాలో వెన‌క్కి పంపిస్తున్నారు.

“నా చేతుల్లో ఏమీ లేదు. పైవాళ్ల‌ను క‌ల‌వండి. అధిష్టానం ద‌గ్గ‌ర‌కు వెళ్లండి” అంటూ ఢిల్లీ అడ్ర‌స్ చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల కోలాహ‌లం జ‌రుగుతోంది. పైకి అంద‌రూ సైలెంట్‌గానే ఉన్నా.. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు తెర‌చాటుగా.. త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు బీజేపీ నాయ‌కులు కూడా నామినేటెడ్ ప‌ద‌వులు ఆశిస్తున్న మాట వాస్త‌వం. అయితే.. ఎలానూ రాష్ట్ర చీఫ్ కాబ‌ట్టి పురందేశ్వ‌రిని ఆశ్ర‌యిస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం ఢిల్లీ అడ్ర‌స్ చెబుతూ.. కాలం వెళ్ల దీస్తున్నారు.

దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అని చూస్తే.. త‌న‌కు కేంద్రంలో ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని పురందేశ్వ‌రి ఆవేద‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని.. ఇస్తార‌ని ఆమె ఆశ‌లు పెట్టుకు న్నారు. కానీ, ఆమెకు ఇవ్వ‌కుండా న‌ర‌సాపురం నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న భూప‌తి రాజు కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, రాష్ట్రంలోనూ త‌న నిర్ణ‌యాల‌తో సంబంధం లేకుండా.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

దీంతో రాష్ట్రంలో తీసుకునే నిర్ణ‌యాల విష‌యంలోనూ.. కేంద్రం తీసుకునే నిర్ణ‌యాల విష‌యంలోనూ త‌న ప్ర‌మేయం లేక‌పోవ‌డంతో దీనిని అవ‌మానంగా ఫీల‌వుతున్నార‌ని పురందేశ్వ‌రి గురించి బీజేపీలో ఒక చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే వ‌చ్చిన వారికి వ‌చ్చిన‌ట్టు ఢిల్లీ అడ్ర‌స్ చెబుతున్నార‌ట‌. త‌న చేతుల్లో ఏమీ లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారట‌. ఇదీ.. సంగ‌తి!!

This post was last modified on August 5, 2024 3:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

4 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

5 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

6 hours ago