Political News

ఫేక్‌గాళ్ల‌ను న‌మ్మొద్దు: చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు వైసీపీ అనుకూల మీడియా ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనిలో బాప‌ట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్య‌క‌ర్త‌.. స్థానికంగా ఓ ఎస్సై కాల‌ర్ ప‌ట్టుకున్న‌ట్టుగా వైసీపీ అనుకూల మీడియా ప్ర‌చారం చేసింద‌ని పేర్కొన్నారు. కానీ, దీనిలో వాస్త‌వాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎక్స్‌లో కోరారు.

ఫేక్‌ న్యూస్‌, ఫేక్‌గాళ్లను నమొద్దంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఫేక్‌ రాజకీయాల ఉచ్చులో పడి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ‘బాపట్లలో తెలుగుదేశం బరితెగింపు’ శీర్షికతో భట్టిప్రోలు ఎస్సై చొక్కాను టీడీపీ కార్యకర్త పట్టుకున్నారంటూ వైసీపీ పత్రికలో వచ్చిన కథనం ఫేక్‌ అని ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను పోలీసులు నిలువరిస్తున్న వీడియో ను పోస్టుకు జత చేశారు. ఇలాంటి వార్త‌ల‌తో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దెబ్బ‌తిన్నాయంటూ వైసీపీ ప్ర‌చారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు, త‌ప్పుడు వ్య‌క్తుల కార‌ణంగానే రాష్ట్ర బ్రాండ్ దెబ్బ‌తింటోంద‌ని గ‌తంలోనూ చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టుగా.. తాను చేయ‌ని ప‌నులు చేసిన‌ట్టుగా వైసీపీ మీడియా ప్ర‌సారం చేసింద‌ని.. ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాల‌ని అప్ప‌ట్లోనూ చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా పోలీసుల‌నే టీడీపీనాయ‌కుడు ఒక‌రు కొట్టారంటూ.. రాయ‌డంపై చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే రియాక్ట్ అయ్యారు.

This post was last modified on August 5, 2024 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago