ఏపీలో ప్రజా పాలన స్థానంలో ముఠాల పాలన జరుగుతోందని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం రాజకీయ హింసకు కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు. గత రెండు నెలల కాలంలో రాష్ట్రంలో హింసాయుత కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. రాజకీయ ప్రేరేపిత దుర్మార్గాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. రోజూ ఏదో ఒక చోట హింస జరుగుతూనే ఉందని పేర్కొన్నారు.
అంతేకాదు.. రాష్ట్రం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని జగన్ విమర్శించారు. అయితే.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని.. ఇప్పుడు తనను ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు ఈ రాజకీయ దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు.
వైసీపీ నాయకులపై జరుగుతున్న హత్యా రాజకీయాల వెనుక ప్రభుత్వ పాలకుల హస్తం ఉందని జగన్ ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దారుణాలకు బలైన పోయిన వారి కుటుంబాలకు, బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్ పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణం.. తాజాగా నంద్యాలలో జరిగిన హత్యే. నంద్యాల జిల్లాలో శనివారం అర్థ రాత్రి వైసీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. అదేరోజు.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓ నాయకుడిపై దాడి చేశారు. ఆయా ఘటనలను కోట్ చేసిన జగన్.. వీటి వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపిస్తూ.. తాజాగా ట్వీట్ చేశారు.
This post was last modified on August 5, 2024 10:10 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…