Political News

ఏపీలో ముఠాల పాల‌న‌: జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ప్ర‌జా పాల‌న స్థానంలో ముఠాల పాల‌న జ‌రుగుతోంద‌ని వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం రాజ‌కీయ హింస‌కు కేంద్రంగా మారిపోయింద‌ని విమ‌ర్శించారు. గ‌త రెండు నెల‌ల కాలంలో రాష్ట్రంలో హింసాయుత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న‌.. రాజ‌కీయ ప్రేరేపిత దుర్మార్గాలు కొన‌సాగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. రోజూ ఏదో ఒక చోట హింస జ‌రుగుతూనే ఉంద‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. రాష్ట్రం ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. అయితే.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారిపై దాడులు చేస్తున్నార‌ని.. ఇప్పుడు త‌న‌ను ప్ర‌శ్నించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో చంద్ర‌బాబు స‌ర్కారు ఈ రాజ‌కీయ దాడులు చేయిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

వైసీపీ నాయ‌కుల‌పై జ‌రుగుతున్న హ‌త్యా రాజ‌కీయాల వెనుక ప్ర‌భుత్వ పాల‌కుల హ‌స్తం ఉంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దారుణాల‌కు బ‌లైన పోయిన వారి కుటుంబాల‌కు, బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉన్న జ‌గ‌న్ ఇంత తీవ్రంగా స్పందించ‌డానికి కార‌ణం.. తాజాగా నంద్యాల‌లో జ‌రిగిన హ‌త్యే. నంద్యాల జిల్లాలో శ‌నివారం అర్థ‌ రాత్రి వైసీపీ నాయ‌కుడిని దారుణంగా హ‌త్య చేశారు. అదేరోజు.. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఓ నాయ‌కుడిపై దాడి చేశారు. ఆయా ఘ‌ట‌న‌ల‌ను కోట్ చేసిన జ‌గ‌న్‌.. వీటి వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌ని ఆరోపిస్తూ.. తాజాగా ట్వీట్ చేశారు.

This post was last modified on August 5, 2024 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏప్రిల్ 11 – ఓటిటి అభిమానులకు పండగే

థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…

48 minutes ago

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

3 hours ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 hours ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

4 hours ago

బ్రేకింగ్ : CSK కెప్టెన్ గా ధోనీ.. ఎందుకంటే..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…

4 hours ago

ఏపీలో నోటికి పని చెప్పడం ఇకపై కుదరదు

నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…

5 hours ago