టిడిపిలో నామినేటెడ్ పదవుల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు ముందు అనేక మంది నాయకులు టికెట్లను త్యాగం చేశారు. చంద్రబాబు చెప్పారని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొనకళ్ళ నారాయణ, దేవినేని ఉమా వంటి వారు పోటీకి దూరంగా ఉన్నారు. ఇలా అనేక జిల్లాల్లో నాయకులు పోటీకి సిద్ధమైన తర్వాత చంద్రబాబు నుంచి పిలుపు రావడం పోటీ నుంచి విరమించుకోవాలని ఆయన చెప్పడంతో వారంతా వెనక్కి తగ్గారు. అయితే వీరందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అయితే వచ్చింది. కానీ, రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు వారిని పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం వంటి కీలక స్థానాన్ని వదులుకున్న వర్మ తనను పట్టించుకోవడంలేదని క్షేత్రస్థాయిలో తన అనుచర వర్గానికి చెబుతున్నారు. “నాకే దిక్కులేదు మీకేం చేస్తాను” అంటూ తాజాగా ఆయన తన అనుచరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు కూడా అసంతృప్తితోనే ఉన్నారు.
ఇక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న బహిరంగంగానే తన ఆవేదనను ఆక్రోసాన్ని వెళ్ళగక్కారు. తనకు ఎలాంటి పదవులు లేవని తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. ఇలాంటివారు రాష్ట్రం వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారు. అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇంకా వేచి చూసే దారుణంలోనే కొనసాగుతున్నారు.
దీంతో టీడీపీలో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయని చెప్పాలి. మరో రెండు మూడు నెలల్లో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ్ముళ్ల అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కనక వీరందరినీ పక్కన పెడితే వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ పుంజుకోవటం కొంత కష్టంగానే ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఉన్న పదవుల్లో టిడిపికి దక్కే వాటిని సత్వరమే ఇవ్వాలని, తద్వారా తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తి తొలగించాలని పార్టీ పుంజుకునేలా ప్రయత్నం చేయాలని వారు సూచిస్తున్నారు.
This post was last modified on August 5, 2024 6:51 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…