టిడిపిలో నామినేటెడ్ పదవుల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు ముందు అనేక మంది నాయకులు టికెట్లను త్యాగం చేశారు. చంద్రబాబు చెప్పారని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొనకళ్ళ నారాయణ, దేవినేని ఉమా వంటి వారు పోటీకి దూరంగా ఉన్నారు. ఇలా అనేక జిల్లాల్లో నాయకులు పోటీకి సిద్ధమైన తర్వాత చంద్రబాబు నుంచి పిలుపు రావడం పోటీ నుంచి విరమించుకోవాలని ఆయన చెప్పడంతో వారంతా వెనక్కి తగ్గారు. అయితే వీరందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అయితే వచ్చింది. కానీ, రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు వారిని పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం వంటి కీలక స్థానాన్ని వదులుకున్న వర్మ తనను పట్టించుకోవడంలేదని క్షేత్రస్థాయిలో తన అనుచర వర్గానికి చెబుతున్నారు. “నాకే దిక్కులేదు మీకేం చేస్తాను” అంటూ తాజాగా ఆయన తన అనుచరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు కూడా అసంతృప్తితోనే ఉన్నారు.
ఇక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న బహిరంగంగానే తన ఆవేదనను ఆక్రోసాన్ని వెళ్ళగక్కారు. తనకు ఎలాంటి పదవులు లేవని తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. ఇలాంటివారు రాష్ట్రం వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారు. అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇంకా వేచి చూసే దారుణంలోనే కొనసాగుతున్నారు.
దీంతో టీడీపీలో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయని చెప్పాలి. మరో రెండు మూడు నెలల్లో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ్ముళ్ల అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కనక వీరందరినీ పక్కన పెడితే వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ పుంజుకోవటం కొంత కష్టంగానే ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఉన్న పదవుల్లో టిడిపికి దక్కే వాటిని సత్వరమే ఇవ్వాలని, తద్వారా తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తి తొలగించాలని పార్టీ పుంజుకునేలా ప్రయత్నం చేయాలని వారు సూచిస్తున్నారు.
This post was last modified on August 5, 2024 6:51 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…