Political News

టీడీపీలో ప‌ద‌వుల ప‌ద‌నిస‌లు..

టిడిపిలో నామినేటెడ్ పదవుల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు ముందు అనేక మంది నాయకులు టికెట్లను త్యాగం చేశారు. చంద్రబాబు చెప్పారని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొనకళ్ళ నారాయణ, దేవినేని ఉమా వంటి వారు పోటీకి దూరంగా ఉన్నారు. ఇలా అనేక జిల్లాల్లో నాయకులు పోటీకి సిద్ధమైన తర్వాత చంద్రబాబు నుంచి పిలుపు రావడం పోటీ నుంచి విరమించుకోవాలని ఆయన చెప్పడంతో వారంతా వెనక్కి తగ్గారు. అయితే వీరందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ప్రభుత్వం అయితే వచ్చింది. కానీ, రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు వారిని పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం వంటి కీలక స్థానాన్ని వదులుకున్న వర్మ తనను పట్టించుకోవడంలేదని క్షేత్రస్థాయిలో తన అనుచర వర్గానికి చెబుతున్నారు. “నాకే దిక్కులేదు మీకేం చేస్తాను” అంటూ తాజాగా ఆయన త‌న అనుచ‌రుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు కూడా అసంతృప్తితోనే ఉన్నారు.

ఇక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న బహిరంగంగానే తన ఆవేదనను ఆక్రోసాన్ని వెళ్ళగ‌క్కారు. తనకు ఎలాంటి పదవులు లేవని తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. ఇలాంటివారు రాష్ట్రం వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారు. అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేకమంది నాయకులు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇంకా వేచి చూసే దారుణంలోనే కొనసాగుతున్నారు.

దీంతో టీడీపీలో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయని చెప్పాలి. మరో రెండు మూడు నెలల్లో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ్ముళ్ల అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కనక వీరందరినీ పక్కన పెడితే వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ పుంజుకోవటం కొంత కష్టంగానే ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఉన్న పదవుల్లో టిడిపికి దక్కే వాటిని సత్వరమే ఇవ్వాలని, తద్వారా తమ్ముళ్లలో నెల‌కొన్న అసంతృప్తి తొలగించాలని పార్టీ పుంజుకునేలా ప్రయత్నం చేయాలని వారు సూచిస్తున్నారు.

This post was last modified on August 5, 2024 6:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

24 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago