సెంటిమెంటు ఎలా ఉంటుందో.. అది ఏ రూపంలో ఉంటుందో పసిగట్టడం.. రాజకీయ నాయకులకు వెన్న తో పెట్టిన విద్య. అందుకే.. రాజకీయాల్లో ఉన్నన్ని సెంటిమెంట్లు ఎక్కడా ఉండవు. 2019లో జగన్ అధికా రంలోకివచ్చేందుకు సెంటిమెంటే కారణమైంది. ఆయన చేసిన పాదయాత్ర కారణంగానే వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మరి అలాంటిది కీలకమైన సెంటిమెంటును అంచనా వేయడంలో జగన్ ఎక్కడో తప్పు చేశారనే భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది.
అదే.. రాజధాని అమరావతి! ఇప్పుడు ఎందుకీ చర్చ? అనే ప్రశ్న రావొచ్చు. నిశితంగా గమనిస్తే.. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. అమరావతి రాజధానిపై ప్రజలకు ఎంత సెంటిమెంటు ఉందో తెలుస్తుంది. టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు వస్తున్నవారిలో కేవలం ఫిర్యాదులు చేసేవారు.. తమ సమస్యలు చెప్పుకొనేవారు మాత్రమే కాదు. అమరావతికి విరాళాలు ఇచ్చేవారు కూడా.. తండోప తండాలుగా ఉండడమే దీనికి కారణం.
ఎంతలా ప్రజలు అమరావతి విషయంలో సెంటిమెంటు ఫీలవుతున్నారంటే.. ప్రభుత్వం పిలుపు ఇవ్వక పోయినా.. సీఎం చంద్రబాబు ఏమీ కోరకపోయినా.. వందల సంఖ్యలో ప్రజలు.. నేరుగా ప్రజాదర్బార్కు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. విజయవాడకు చెందిన చాలా మంది తమ ఒంటి పై ఉన్న నగలను విరాళంగా ఇస్తే..ఎక్కడో విజయనగరానికి చెందిన వారు కూడా వచ్చి.. రూ.లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇక, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారు కూడా.. లక్షల రూపాయల్లో విరాళం ఇస్తున్నారు.
మరికొందరైతే.. తాము దాచుకున్న సొమ్ములు కూడా అమరావతికి ఇస్తున్నారు. ఇదంతా చూస్తే.. అమరావతి రాజధాని విషయంలో ప్రజలకు ఎంత సెంటిమెంటు ఏర్పడిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెంటిమెంటు కారణంగానే జగన్ ప్రకటించిన మూడు రాజధానులకు కూడా.. ప్రజల నుంచి మద్దతు లభించలేదు. పైగా.. కర్నూలు, విజయనగరం నుంచే ప్రజలు అమరావతికి జై కొడుతున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ చిన్న సెంటిమెంటును అంచనా వేయడంలోను.. అమరావతిని కొనసాగించడంలోనూ..జగన్ విఫలమయ్యారనేది ఇప్పుడు మరోసారి రుజువు అవుతోంది.
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…