Political News

అమ‌రావ‌తికి విరాళాలు.. ఇంత సెంటిమెంటు వుందా

సెంటిమెంటు ఎలా ఉంటుందో.. అది ఏ రూపంలో ఉంటుందో ప‌సిగ‌ట్ట‌డం.. రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న తో పెట్టిన విద్య. అందుకే.. రాజ‌కీయాల్లో ఉన్న‌న్ని సెంటిమెంట్లు ఎక్క‌డా ఉండ‌వు. 2019లో జ‌గ‌న్ అధికా రంలోకివ‌చ్చేందుకు సెంటిమెంటే కార‌ణ‌మైంది. ఆయ‌న చేసిన పాద‌యాత్ర కార‌ణంగానే వైసీపీ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రి అలాంటిది కీల‌క‌మైన సెంటిమెంటును అంచ‌నా వేయ‌డంలో జ‌గ‌న్ ఎక్క‌డో త‌ప్పు చేశార‌నే భావ‌న ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతోంది.

అదే.. రాజ‌ధాని అమ‌రావ‌తి! ఇప్పుడు ఎందుకీ చ‌ర్చ? అనే ప్రశ్న రావొచ్చు. నిశితంగా గ‌మ‌నిస్తే.. గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అమ‌రావ‌తి రాజ‌ధానిపై ప్ర‌జ‌ల‌కు ఎంత సెంటిమెంటు ఉందో తెలుస్తుంది. టీడీపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌స్తున్న‌వారిలో కేవ‌లం ఫిర్యాదులు చేసేవారు.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేవారు మాత్ర‌మే కాదు. అమ‌రావ‌తికి విరాళాలు ఇచ్చేవారు కూడా.. తండోప తండాలుగా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం.

ఎంత‌లా ప్ర‌జ‌లు అమ‌రావ‌తి విష‌యంలో సెంటిమెంటు ఫీల‌వుతున్నారంటే.. ప్ర‌భుత్వం పిలుపు ఇవ్వ‌క పోయినా.. సీఎం చంద్ర‌బాబు ఏమీ కోర‌క‌పోయినా.. వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు.. నేరుగా ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌చ్చి విరాళాలు ఇస్తున్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన చాలా మంది త‌మ ఒంటి పై ఉన్న న‌గ‌ల‌ను విరాళంగా ఇస్తే..ఎక్క‌డో విజ‌య‌న‌గ‌రానికి చెందిన వారు కూడా వచ్చి.. రూ.ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు. ఇక‌, ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన వారు కూడా.. ల‌క్ష‌ల రూపాయ‌ల్లో విరాళం ఇస్తున్నారు.

మ‌రికొందరైతే.. తాము దాచుకున్న సొమ్ములు కూడా అమ‌రావ‌తికి ఇస్తున్నారు. ఇదంతా చూస్తే.. అమ‌రావతి రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎంత సెంటిమెంటు ఏర్ప‌డింద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ సెంటిమెంటు కార‌ణంగానే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానుల‌కు కూడా.. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. పైగా.. క‌ర్నూలు, విజ‌య‌న‌గ‌రం నుంచే ప్ర‌జ‌లు అమ‌రావ‌తికి జై కొడుతున్నారంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కానీ, ఈ చిన్న సెంటిమెంటును అంచ‌నా వేయ‌డంలోను.. అమ‌రావ‌తిని కొన‌సాగించ‌డంలోనూ..జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌నేది ఇప్పుడు మ‌రోసారి రుజువు అవుతోంది.

This post was last modified on August 4, 2024 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago