Political News

అమ‌రావ‌తికి విరాళాలు.. ఇంత సెంటిమెంటు వుందా

సెంటిమెంటు ఎలా ఉంటుందో.. అది ఏ రూపంలో ఉంటుందో ప‌సిగ‌ట్ట‌డం.. రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న తో పెట్టిన విద్య. అందుకే.. రాజ‌కీయాల్లో ఉన్న‌న్ని సెంటిమెంట్లు ఎక్క‌డా ఉండ‌వు. 2019లో జ‌గ‌న్ అధికా రంలోకివ‌చ్చేందుకు సెంటిమెంటే కార‌ణ‌మైంది. ఆయ‌న చేసిన పాద‌యాత్ర కార‌ణంగానే వైసీపీ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రి అలాంటిది కీల‌క‌మైన సెంటిమెంటును అంచ‌నా వేయ‌డంలో జ‌గ‌న్ ఎక్క‌డో త‌ప్పు చేశార‌నే భావ‌న ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతోంది.

అదే.. రాజ‌ధాని అమ‌రావ‌తి! ఇప్పుడు ఎందుకీ చ‌ర్చ? అనే ప్రశ్న రావొచ్చు. నిశితంగా గ‌మ‌నిస్తే.. గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అమ‌రావ‌తి రాజ‌ధానిపై ప్ర‌జ‌ల‌కు ఎంత సెంటిమెంటు ఉందో తెలుస్తుంది. టీడీపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌స్తున్న‌వారిలో కేవ‌లం ఫిర్యాదులు చేసేవారు.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేవారు మాత్ర‌మే కాదు. అమ‌రావ‌తికి విరాళాలు ఇచ్చేవారు కూడా.. తండోప తండాలుగా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం.

ఎంత‌లా ప్ర‌జ‌లు అమ‌రావ‌తి విష‌యంలో సెంటిమెంటు ఫీల‌వుతున్నారంటే.. ప్ర‌భుత్వం పిలుపు ఇవ్వ‌క పోయినా.. సీఎం చంద్ర‌బాబు ఏమీ కోర‌క‌పోయినా.. వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు.. నేరుగా ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌చ్చి విరాళాలు ఇస్తున్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన చాలా మంది త‌మ ఒంటి పై ఉన్న న‌గ‌ల‌ను విరాళంగా ఇస్తే..ఎక్క‌డో విజ‌య‌న‌గ‌రానికి చెందిన వారు కూడా వచ్చి.. రూ.ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు. ఇక‌, ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన వారు కూడా.. ల‌క్ష‌ల రూపాయ‌ల్లో విరాళం ఇస్తున్నారు.

మ‌రికొందరైతే.. తాము దాచుకున్న సొమ్ములు కూడా అమ‌రావ‌తికి ఇస్తున్నారు. ఇదంతా చూస్తే.. అమ‌రావతి రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎంత సెంటిమెంటు ఏర్ప‌డింద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ సెంటిమెంటు కార‌ణంగానే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానుల‌కు కూడా.. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. పైగా.. క‌ర్నూలు, విజ‌య‌న‌గ‌రం నుంచే ప్ర‌జ‌లు అమ‌రావ‌తికి జై కొడుతున్నారంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కానీ, ఈ చిన్న సెంటిమెంటును అంచ‌నా వేయ‌డంలోను.. అమ‌రావ‌తిని కొన‌సాగించ‌డంలోనూ..జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌నేది ఇప్పుడు మ‌రోసారి రుజువు అవుతోంది.

This post was last modified on August 4, 2024 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago