Political News

మోడీ డబుల్ గేమ్ బయటపెట్టిన షర్మిల

ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీతో ఐదేళ్లపాటు అంటకాగిన జగన్ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీని బిజెపి ఉంచుకుందంటూ పరుష పదజాలంతో సైతం షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై షర్మిల విమర్శలు గుప్పించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై స్పందించిన షర్మిల…కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కుకు నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా అని షర్మిల ప్రశ్నించారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న చందంగా కేంద్రం తీరు ఉందని షర్మిల దుయ్యబట్టారు. 6000 కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ముడి పదార్థాలు లేవని, కొనేందుకు డబ్బులు లేవని, నెల జీతాలు కష్టమే అని యాజమాన్యం చేతులెత్తేసినా సరే మోడీకి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని షర్మిల విమర్శించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, కానీ, విశాఖ ఉక్కుపై మోడీ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కు రూపాయి సాయం చేయకుండా వెంటిలేటర్ మీదకి నెట్టారని, నిధులు ఇవ్వకుండా నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నమ్మితే వెంటనే ప్లాంట్ కు సహాయం అందించేలా ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమకు కావలసిన ముడి పదాలు సమకూర్చాలని కోరారు.

This post was last modified on August 3, 2024 6:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

24 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago