Political News

ఆప్పుడు బాబు చేసిందే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ సమంజసమని, అలా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆ చరిత్రాత్మక తీర్పుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో స్పందించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో చెప్పారు. ఈ ఉప వర్గీకరణ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతోందని, అలుపెరగని పోరాటం చేసిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. 2004 లోనే ధర్మం ఏనాటికైనా గెలుస్తుందని తాను చెప్పానని, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని మందకృష్ణ చెప్పారు.

తమ జాతికి న్యాయం జరగడం కోసం దశాబ్దాల తరబడి ఎమ్మార్పీఎస్ పోరాటం చేసి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ విజయం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంతోమంది ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల చొరవ, మద్దతు, కృషి ఉన్నాయని మందకృష్ణ మాదిగ కొనియాడారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు శ్రీకారం చుట్టారని, కాకతాళీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీల వర్గీకరణకు చంద్రబాబు తమకు ఎల్లప్పుడూ మద్దతుగానే ఉన్నారని మందకృష్ణ మాదిగ గుర్తు చేసుకున్నారు.

మొదట వర్గీకరణ చేసిన సమయంలో చంద్రబాబు సీఎం అని..ఆయన స్థానంలో వేరొకరుంటే వర్గీకరణ జరిగేది కాదని గుర్తు చేసుకుంటూ చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు చంద్రబాబు వర్గీకరణ చేయకుంటే వేలాది ఉద్యోగాలు, విద్యావకాశాలు తమకు వచ్చేవి కావని గుర్తు చేసుకున్నారు. న్యాయం బతికింది అంటే ఆయన తెచ్చిన చట్టం వల్లే అని అన్నారు.

This post was last modified on August 1, 2024 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

2 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

3 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

4 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago