ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ సమంజసమని, అలా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆ చరిత్రాత్మక తీర్పుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో స్పందించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో చెప్పారు. ఈ ఉప వర్గీకరణ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతోందని, అలుపెరగని పోరాటం చేసిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. 2004 లోనే ధర్మం ఏనాటికైనా గెలుస్తుందని తాను చెప్పానని, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని మందకృష్ణ చెప్పారు.
తమ జాతికి న్యాయం జరగడం కోసం దశాబ్దాల తరబడి ఎమ్మార్పీఎస్ పోరాటం చేసి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ విజయం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంతోమంది ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల చొరవ, మద్దతు, కృషి ఉన్నాయని మందకృష్ణ మాదిగ కొనియాడారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు శ్రీకారం చుట్టారని, కాకతాళీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీల వర్గీకరణకు చంద్రబాబు తమకు ఎల్లప్పుడూ మద్దతుగానే ఉన్నారని మందకృష్ణ మాదిగ గుర్తు చేసుకున్నారు.
మొదట వర్గీకరణ చేసిన సమయంలో చంద్రబాబు సీఎం అని..ఆయన స్థానంలో వేరొకరుంటే వర్గీకరణ జరిగేది కాదని గుర్తు చేసుకుంటూ చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు చంద్రబాబు వర్గీకరణ చేయకుంటే వేలాది ఉద్యోగాలు, విద్యావకాశాలు తమకు వచ్చేవి కావని గుర్తు చేసుకున్నారు. న్యాయం బతికింది అంటే ఆయన తెచ్చిన చట్టం వల్లే అని అన్నారు.
This post was last modified on August 1, 2024 3:38 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…