Political News

ఆప్పుడు బాబు చేసిందే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ సమంజసమని, అలా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆ చరిత్రాత్మక తీర్పుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో స్పందించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో చెప్పారు. ఈ ఉప వర్గీకరణ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతోందని, అలుపెరగని పోరాటం చేసిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. 2004 లోనే ధర్మం ఏనాటికైనా గెలుస్తుందని తాను చెప్పానని, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని మందకృష్ణ చెప్పారు.

తమ జాతికి న్యాయం జరగడం కోసం దశాబ్దాల తరబడి ఎమ్మార్పీఎస్ పోరాటం చేసి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ విజయం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంతోమంది ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల చొరవ, మద్దతు, కృషి ఉన్నాయని మందకృష్ణ మాదిగ కొనియాడారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు శ్రీకారం చుట్టారని, కాకతాళీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీల వర్గీకరణకు చంద్రబాబు తమకు ఎల్లప్పుడూ మద్దతుగానే ఉన్నారని మందకృష్ణ మాదిగ గుర్తు చేసుకున్నారు.

మొదట వర్గీకరణ చేసిన సమయంలో చంద్రబాబు సీఎం అని..ఆయన స్థానంలో వేరొకరుంటే వర్గీకరణ జరిగేది కాదని గుర్తు చేసుకుంటూ చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు చంద్రబాబు వర్గీకరణ చేయకుంటే వేలాది ఉద్యోగాలు, విద్యావకాశాలు తమకు వచ్చేవి కావని గుర్తు చేసుకున్నారు. న్యాయం బతికింది అంటే ఆయన తెచ్చిన చట్టం వల్లే అని అన్నారు.

This post was last modified on August 1, 2024 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

28 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago