Political News

చివ‌ర‌కు రోగుల భోజ‌నాల బిల్లులూ ఎగ్గొట్టారు!

ద‌మ్ముంటే అసెంబ్లీకి రా.. జ‌గ‌న్‌!! అంటూ వైసీపీ మాజీ నేత‌, ప్ర‌స్తుత మంత్రి కొలుసు పార్థ‌సార‌థి స‌వాల్ రువ్వారు. “శ్వేత‌ప‌త్రాల‌ పై ఏమైనా చెప్పాల‌ని అనుకుంటే.. స‌భ‌కు వ‌చ్చి చెప్పాలి. మీడియా ముందు.. సొంత చానెళ్ల‌లోనూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం ఎందుకు? అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని ఆయ‌న హెచ్చ‌రించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొలుసు.. జ‌గ‌న్‌ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

జ‌గ‌న్‌కు ఒక విజ‌న్ అంటూ లేద‌ని.. అందువ‌ల్లే రాష్ట్రం అన్ని విధాలా నాశ‌నం అయిపోయింద‌ని చెప్పారు. క‌నీసం ఆసుప‌త్రుల్లో రోగుల‌కు అందించే భోజ‌నాల బిల్లులు కూడా ఇవ్వ‌కుండా ఎగ్గొట్టార‌ని దుయ్య‌బట్టారు.

ఆరోగ్య శ్రీ బిల్లులు ఇవ్వ‌కుండా ఆసుప‌త్రులను ముప్పుతిప్ప‌లు పెట్టార‌ని చెప్పారు. విజ‌న్ లేని నాయ‌కుడి కార‌ణంగానే రాష్ట్రం అథోగ‌తికి చేరుకుంద‌న్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు దీనిని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఈ క్ర‌మంలో అనేక ఇబ్బందులు కూడా ప‌డుతున్నార‌ని చెప్పారు.

త‌న ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రానికి జ‌గ‌న్ చేసింది ఏమీలేద‌న్నారు. కేవ‌లం రాజ‌కీయ క‌క్ష సాధింపులు త‌ప్ప‌.. రాష్ట్రానికి రూపాయి కూడా పెట్టుబ‌డులు తీసుకురాలేద‌ని తెలిపారు. దీనికి తోడు దోపిడీలు.. అక్ర‌మాల కుప్ప‌లు ఇప్పుడు బ‌య‌ట ప‌డుతున్నాయ‌ని చెప్పారు.

వీటిని అసెంబ్లీ వేదిక‌గా తాము ప్ర‌స్తావిస్తే.. తాను మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు మీడియా ముందు కూర్చుని క‌బుర్లు చెబుతున్నాడ‌ని అన్నారు. ఢిల్లీ వెళ్లింది ఎందుకు? అని కొలుసు ప్ర‌శ్నించారు.

గంజాయి బ్యాచ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన వివాదం హ‌త్య‌కు దారితీసింద‌ని కొలుసు చెప్పారు. దీనిని కూడా ఢిల్లీ వ‌ర‌కు తీసుకు వెళ్లి ధ‌ర్నా చేయ‌డానికి సిగ్గుండాల‌న్నారు. ఏం జ‌రిగినా.. ప్ర‌భుత్వానికి ఆపాదించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి జ‌గ‌న్ అండ్ కో ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. వీటిని తాము స‌మ‌ర్థంగా ఎదుర్కొంటామ‌ని కొలుసు చెప్పారు. ఏదేమైనా స‌భ‌కు వ‌చ్చి తాము స‌చ్ఛీలుర‌మని నిరూపించుకోవాల‌ని సూచించారు.

This post was last modified on July 31, 2024 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

51 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

1 hour ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

4 hours ago