Political News

ఇది నిజంగా ‘ఎర్రిప‌ప్ప‌’ వ్యాఖ్య‌ అంటున్న నెట్టిజన్లు

కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌ను చూస్తే.. వారి వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్రంగా ఉంటుంది. గ‌తంలో వైసీపీ నాయ‌కులు చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్నారు. రైతుల‌ను ‘ఎర్రిప‌ప్ప‌’లంటూ ఓ మంత్రి వ‌ర్యులు(పేరు చెబితే ఇంకా ఎందుకు వెంట‌ప‌డ‌తార‌ని బాధ‌ప‌డ‌తారు) వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మ‌రొక‌రు న్యూడ్ యాంగిల్స్‌లో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశారు. ఇవ‌న్నీ అయిపోయాయిలే.. ఇప్పుడు బాగుంటుందిలే! అని అనుకున్నారు.

కానీ, రాజ‌కీయాలు.. నాయ‌కులు.. ఇప్పుడు కూడా చిత్రంగానే అనిపిస్తున్నారు. క‌నిపిస్తున్నారు. తాజాగా ఓ ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన నాయ‌కుడు, టీడీపీ ఎమ్మెల్యే ఏసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుం డా.. సోష‌ల్ మీడియాలోనూ దుమ్మురేపుతున్నాయి. అధికారంలోకి వ‌చ్చాం.. రాష్ట్రంలో పేకాట క్ల‌బ్బులు తెరిపించే ప్ర‌య‌త్నం చేస్తా అని స‌ద‌రు ఎమ్మెల్యే అన‌డంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది.అస‌లే స‌రైన ఫీడ్ లేక‌.. సోష‌ల్ మీడియా ఇటీవ‌ల కాలంలో గొంతెండిపోయిందేమో.. ఈ వ్యాఖ్య‌ల‌ను జోరుగా వైర‌ల్ చేస్తోంది.

ఆయ‌నే అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న నాయ‌కు డు ద‌గ్గుబాటి వెంక‌శ్వ‌ర ప్ర‌సాద్‌. ఈయ‌న ఉన్న‌తోద్యోగి కూడా. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. తొలిసారే విజ‌యం అందుకున్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. దీనికి సంబంధించి త‌న‌పై ఒత్తిడి కూడా వ‌స్తోంద‌ని చెప్పారు.

అక్క‌డితో ఆగితే.. పోనీలే ఆయ‌న బాధ ఆయ‌న‌ది ఒత్తిడి వ‌స్తున్న‌ప్పుడు.. ఏం చేస్తాంలే! అని స‌రిపుచ్చుకు నే వారం. కానీ.. గ‌తంలో గుర‌జాడ వారు క‌న్యాశుల్కంలో చెప్పిన‌ట్టుగా.. పొగ‌తాగ‌ని వాడు దున్న‌పోతై పుట్టున్‌ అన్న‌ట్టు.. ద‌గ్గుబాటి పేకాట‌కు నీతి సూత్రం ప్ర‌వ‌చించారు. అదే.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని సైన్టిస్టులు చెప్పారు అని బాంబు పేల్చారు.

అంతేకాదు.. సాధ్య‌మైనంత వేగంగా.. సీఎం చంద్ర‌బాబు దృష్టికి ఈ స‌మ‌స్య‌ను తీసుకువెళ్లి.. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్ల‌బ్బులు తెరిపించే ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు. చాలా మంచి నిర్ణ‌యం అనాలా? లేక‌.. ఎలానూ నీరులేక‌, సాగులేక‌.. అల్లాడుతున్న అనంత‌పురంలో ఇక‌, ప్ర‌జ‌లు చేసేందుకు ఎలానూ ప‌నులు లేవు కాబ‌ట్టి.. ఇలా ఉపాధి చూపించార‌ని అనాలా? అని సోష‌ల్ మీడియా జ‌నాలు ఆడేసుకుంటున్నారు.

This post was last modified on July 31, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP

Recent Posts

మళ్లీ టాలీవుడ్‌కు రాధికా ఆప్టే

బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…

1 minute ago

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

53 minutes ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

59 minutes ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

1 hour ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

3 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

5 hours ago