Political News

ఇది నిజంగా ‘ఎర్రిప‌ప్ప‌’ వ్యాఖ్య‌ అంటున్న నెట్టిజన్లు

కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌ను చూస్తే.. వారి వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్రంగా ఉంటుంది. గ‌తంలో వైసీపీ నాయ‌కులు చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్నారు. రైతుల‌ను ‘ఎర్రిప‌ప్ప‌’లంటూ ఓ మంత్రి వ‌ర్యులు(పేరు చెబితే ఇంకా ఎందుకు వెంట‌ప‌డ‌తార‌ని బాధ‌ప‌డ‌తారు) వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మ‌రొక‌రు న్యూడ్ యాంగిల్స్‌లో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశారు. ఇవ‌న్నీ అయిపోయాయిలే.. ఇప్పుడు బాగుంటుందిలే! అని అనుకున్నారు.

కానీ, రాజ‌కీయాలు.. నాయ‌కులు.. ఇప్పుడు కూడా చిత్రంగానే అనిపిస్తున్నారు. క‌నిపిస్తున్నారు. తాజాగా ఓ ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన నాయ‌కుడు, టీడీపీ ఎమ్మెల్యే ఏసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుం డా.. సోష‌ల్ మీడియాలోనూ దుమ్మురేపుతున్నాయి. అధికారంలోకి వ‌చ్చాం.. రాష్ట్రంలో పేకాట క్ల‌బ్బులు తెరిపించే ప్ర‌య‌త్నం చేస్తా అని స‌ద‌రు ఎమ్మెల్యే అన‌డంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది.అస‌లే స‌రైన ఫీడ్ లేక‌.. సోష‌ల్ మీడియా ఇటీవ‌ల కాలంలో గొంతెండిపోయిందేమో.. ఈ వ్యాఖ్య‌ల‌ను జోరుగా వైర‌ల్ చేస్తోంది.

ఆయ‌నే అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న నాయ‌కు డు ద‌గ్గుబాటి వెంక‌శ్వ‌ర ప్ర‌సాద్‌. ఈయ‌న ఉన్న‌తోద్యోగి కూడా. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. తొలిసారే విజ‌యం అందుకున్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. దీనికి సంబంధించి త‌న‌పై ఒత్తిడి కూడా వ‌స్తోంద‌ని చెప్పారు.

అక్క‌డితో ఆగితే.. పోనీలే ఆయ‌న బాధ ఆయ‌న‌ది ఒత్తిడి వ‌స్తున్న‌ప్పుడు.. ఏం చేస్తాంలే! అని స‌రిపుచ్చుకు నే వారం. కానీ.. గ‌తంలో గుర‌జాడ వారు క‌న్యాశుల్కంలో చెప్పిన‌ట్టుగా.. పొగ‌తాగ‌ని వాడు దున్న‌పోతై పుట్టున్‌ అన్న‌ట్టు.. ద‌గ్గుబాటి పేకాట‌కు నీతి సూత్రం ప్ర‌వ‌చించారు. అదే.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని సైన్టిస్టులు చెప్పారు అని బాంబు పేల్చారు.

అంతేకాదు.. సాధ్య‌మైనంత వేగంగా.. సీఎం చంద్ర‌బాబు దృష్టికి ఈ స‌మ‌స్య‌ను తీసుకువెళ్లి.. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్ల‌బ్బులు తెరిపించే ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు. చాలా మంచి నిర్ణ‌యం అనాలా? లేక‌.. ఎలానూ నీరులేక‌, సాగులేక‌.. అల్లాడుతున్న అనంత‌పురంలో ఇక‌, ప్ర‌జ‌లు చేసేందుకు ఎలానూ ప‌నులు లేవు కాబ‌ట్టి.. ఇలా ఉపాధి చూపించార‌ని అనాలా? అని సోష‌ల్ మీడియా జ‌నాలు ఆడేసుకుంటున్నారు.

This post was last modified on July 31, 2024 3:03 pm

Share

Recent Posts

రామాయణం… మామూలుగా తీస్తే చూడరా?

మానవ చరిత్రలో కల్లా అత్యంత గొప్ప కథ.. నిన్నటి ‘రామాయణం’ ట్రైలర్లో మేకర్స్ ఈ కథకు ఇచ్చిన ట్యాగ్ లైన్. రామాయణ…

1 hour ago

భోగాపురం… కర్త, కర్మ, క్రియ అన్నీ బాబే!

ఏపీకి తలమానికంగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని…

1 hour ago

`హైడ్రా`… రంగ‌నాథ్‌ను కాపాడ‌డం క‌ష్ట‌మే!

హైడ్రా రంగ‌నాథ్‌గా పేరొందిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, హైడ్రా క‌మిష‌న‌ర్‌ను కాపాడుకునేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా హైకోర్టు…

2 hours ago

ఒక్క రోజు ప్రేమకే  73 కోట్లు వచ్చేశాయి

హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ పాత్ర జెన్ జీలో పుట్టుకొచ్చింది కాదు. 90 దశకం కార్టూన్ రూపంలో టీవీలో…

2 hours ago

త్వరలో బొద్దింకల అధినేత అభిజిత్ పెళ్లి

దేశ విదేశాల్లో అతి తక్కువ కాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న సీజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కు డిమాండ్ పెరిగింది. రాజకీయంగానే…

3 hours ago

రెబల్ స్టార్ లక్కీ జోడి… ఫౌజీలో కీలక పాత్ర

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో ఎక్కువ సినిమాలు హీరోయిన్ గా చేసినవాళ్లలో జయప్రద ముఖ్యులు. అప్పట్లో ఈ కలయికలో ఎన్నో…

4 hours ago