Political News

పగ తీరింది.. హమాస్ అగ్రనేతను ఏసేసిన ఇజ్రాయెల్

కారణం ఏమైనా కానీ ఇజ్రాయెల్ మీద దాడికి దిగి.. వారికి షాకిచ్చిన హమస్ అంతకంతకూ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియెను చంపేసినట్టు ఇజ్రాయల్ పేర్కొంది.

ఇరాన్ లో జరిగిన దాడిలో తమ అగ్రనేత చనిపోయినట్లుగా హమాస్ గ్రూప్ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని హనియె నివాసం మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. హమస్ అగ్రనేతతో పాటు అతడి బాడీ గార్డు కూడా మరణించాడు.

ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హనియె మీద దాడి జరిగిందని.. అందులో ఆయన చనిపోయినట్లుగా హమస్ వెల్లడించింది. అయితే.. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ బహిరంగ ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే.. పాత శత్రుత్వంతో చూసినప్పుడు ఈ హత్యకు ఇజ్రాయెల్ కారణమవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తాజా పరిణామం అంతర్జాతీయంగా కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తుందని చెబుతున్నారు. తమ దేశంలో అతిధిగా ఉన్న అగ్రనేతను చంపేయటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించే వీలుంది.

అదే జరిగితే.. కొత్త ఉద్రిక్తతలకు తెర తీసినట్లే. ఇదిలా ఉంటే.. ఈ దాడికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేవని.. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

హనియా విషయానికి వస్తే 1962లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంంలో పుట్టాడు. 1980చివర్లో హమాస్ లో చేరాడు. 1990లో అతని పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు ఇతను అత్యంత సన్నిహితుడు. రాజకీయపరమైన సలహాలు ఇస్తూ ఆయనకు కుడి భుజంగా మారాడు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సంస్థలో అనేక స్థానాల్లో పని చేశాడు.
2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హత్యకు గురైన తర్వాత అతను కీలకంగా మారారు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా పట్టీని పాలించాడు. 2007లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో ఫతా – హమాస్ యుద్ధం జరుగుతోంది. అబ్బాస్ ఆదేశాల్ని పక్కన పెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్ని కొనసాగిస్తున్నాడు. 2017లో హమాస్ చీఫ్ గా ఎన్నికయ్యాడు. అతడ్ని అమెరికాలో ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు.
2019లో గాజా పట్టీని వదిలిపెట్టేసి ఖతార్ లో ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు.. నలుగురు మనమరాళ్లు.. మనమళ్లను ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారు. తాజాగా ఆయన్ను హతమయ్యారు.

This post was last modified on July 31, 2024 1:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Iran

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

51 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

1 hour ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

4 hours ago