కారణం ఏమైనా కానీ ఇజ్రాయెల్ మీద దాడికి దిగి.. వారికి షాకిచ్చిన హమస్ అంతకంతకూ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియెను చంపేసినట్టు ఇజ్రాయల్ పేర్కొంది.
ఇరాన్ లో జరిగిన దాడిలో తమ అగ్రనేత చనిపోయినట్లుగా హమాస్ గ్రూప్ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని హనియె నివాసం మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. హమస్ అగ్రనేతతో పాటు అతడి బాడీ గార్డు కూడా మరణించాడు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హనియె మీద దాడి జరిగిందని.. అందులో ఆయన చనిపోయినట్లుగా హమస్ వెల్లడించింది. అయితే.. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ బహిరంగ ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే.. పాత శత్రుత్వంతో చూసినప్పుడు ఈ హత్యకు ఇజ్రాయెల్ కారణమవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తాజా పరిణామం అంతర్జాతీయంగా కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తుందని చెబుతున్నారు. తమ దేశంలో అతిధిగా ఉన్న అగ్రనేతను చంపేయటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించే వీలుంది.
అదే జరిగితే.. కొత్త ఉద్రిక్తతలకు తెర తీసినట్లే. ఇదిలా ఉంటే.. ఈ దాడికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేవని.. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
హనియా విషయానికి వస్తే 1962లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంంలో పుట్టాడు. 1980చివర్లో హమాస్ లో చేరాడు. 1990లో అతని పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు ఇతను అత్యంత సన్నిహితుడు. రాజకీయపరమైన సలహాలు ఇస్తూ ఆయనకు కుడి భుజంగా మారాడు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సంస్థలో అనేక స్థానాల్లో పని చేశాడు.
2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హత్యకు గురైన తర్వాత అతను కీలకంగా మారారు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా పట్టీని పాలించాడు. 2007లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో ఫతా – హమాస్ యుద్ధం జరుగుతోంది. అబ్బాస్ ఆదేశాల్ని పక్కన పెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్ని కొనసాగిస్తున్నాడు. 2017లో హమాస్ చీఫ్ గా ఎన్నికయ్యాడు. అతడ్ని అమెరికాలో ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు.
2019లో గాజా పట్టీని వదిలిపెట్టేసి ఖతార్ లో ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు.. నలుగురు మనమరాళ్లు.. మనమళ్లను ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారు. తాజాగా ఆయన్ను హతమయ్యారు.
This post was last modified on July 31, 2024 1:58 pm
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…