Political News

అసెంబ్లీలో చంద్రబాబుపై రేవంత్ ప్రశంసలు

తెలంగాణ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. విద్యుత్ కమిషన్ అంశంపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి…ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించిన వైనం చర్చనీయాంశమైంది. 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం చంద్రబాబు హయాంలోనే జరిగిందని చంద్రబాబు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు ప్రస్తావించారు.

20 ఏళ్లు కలిసి పనిచేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. గ్లాస్ మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి అని, కానీ, అన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన వారిని గౌరవించకపోవడం సరికాదని హితవు పలికారు. తనకు అటువంటి గుణం లేదని, మిత్రులను సహచరులను బాగా చూసుకుంటానని, పెద్దవారిని గౌరవిస్తానని రేవంత్ అన్నారు . తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం బీఆర్ఎస్ కు అలవాటేనని రేవంత్ ఘాటుగా విమర్శించారు.

కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడి ప్రతిరూపం అన్న రీతిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ విద్యుత్ కమిషన్ ముందుకు వచ్చి వాదనలు వినిపిస్తేనే ఆ నిజాయితీ ఏంటో తేటతెల్లమవుతుందని చెప్పారు. చర్లపల్లి జైల్లో ఉన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని, కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం విచారణ కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తామని రేవంత్ ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్లే హైదరాబాద్ కి ఆదాయం పెరిగిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

This post was last modified on July 29, 2024 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago