తెలంగాణ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. విద్యుత్ కమిషన్ అంశంపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి…ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించిన వైనం చర్చనీయాంశమైంది. 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం చంద్రబాబు హయాంలోనే జరిగిందని చంద్రబాబు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు ప్రస్తావించారు.
20 ఏళ్లు కలిసి పనిచేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. గ్లాస్ మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి అని, కానీ, అన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన వారిని గౌరవించకపోవడం సరికాదని హితవు పలికారు. తనకు అటువంటి గుణం లేదని, మిత్రులను సహచరులను బాగా చూసుకుంటానని, పెద్దవారిని గౌరవిస్తానని రేవంత్ అన్నారు . తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం బీఆర్ఎస్ కు అలవాటేనని రేవంత్ ఘాటుగా విమర్శించారు.
కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడి ప్రతిరూపం అన్న రీతిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ విద్యుత్ కమిషన్ ముందుకు వచ్చి వాదనలు వినిపిస్తేనే ఆ నిజాయితీ ఏంటో తేటతెల్లమవుతుందని చెప్పారు. చర్లపల్లి జైల్లో ఉన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని, కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం విచారణ కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తామని రేవంత్ ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్లే హైదరాబాద్ కి ఆదాయం పెరిగిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
This post was last modified on July 29, 2024 2:23 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…