తెలంగాణ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. విద్యుత్ కమిషన్ అంశంపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి…ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించిన వైనం చర్చనీయాంశమైంది. 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం చంద్రబాబు హయాంలోనే జరిగిందని చంద్రబాబు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు ప్రస్తావించారు.
20 ఏళ్లు కలిసి పనిచేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. గ్లాస్ మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి అని, కానీ, అన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన వారిని గౌరవించకపోవడం సరికాదని హితవు పలికారు. తనకు అటువంటి గుణం లేదని, మిత్రులను సహచరులను బాగా చూసుకుంటానని, పెద్దవారిని గౌరవిస్తానని రేవంత్ అన్నారు . తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం బీఆర్ఎస్ కు అలవాటేనని రేవంత్ ఘాటుగా విమర్శించారు.
కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడి ప్రతిరూపం అన్న రీతిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ విద్యుత్ కమిషన్ ముందుకు వచ్చి వాదనలు వినిపిస్తేనే ఆ నిజాయితీ ఏంటో తేటతెల్లమవుతుందని చెప్పారు. చర్లపల్లి జైల్లో ఉన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని, కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం విచారణ కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తామని రేవంత్ ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్లే హైదరాబాద్ కి ఆదాయం పెరిగిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…