Political News

కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా తీసేయాలి: రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి కాంగ్రెస్ నేతలది కాదంటున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

అటువంటప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని, వేరే వారు తీసుకోవచ్చు కదా అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పులలోకి నెట్టేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందని అన్నారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్ ను యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని, జనాభా ప్రాతిపదికన కాదని గుర్తు చేశారు.

పదేళ్లపాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్…ఈ రోజు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ఆయన మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. తమపైన నిందలు వేయడం ఏంటని రాజగోపాల్ అసహనం వ్యక్తం చేశారు అన్ని సవ్యంగా ఉంటే విద్యుత్ సంస్థలు నష్టాలలోకి ఎందుకు వెళ్తాయని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నాడూ నేడూ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్, బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on July 29, 2024 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago