తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి కాంగ్రెస్ నేతలది కాదంటున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
అటువంటప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని, వేరే వారు తీసుకోవచ్చు కదా అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పులలోకి నెట్టేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందని అన్నారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్ ను యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని, జనాభా ప్రాతిపదికన కాదని గుర్తు చేశారు.
పదేళ్లపాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్…ఈ రోజు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ఆయన మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. తమపైన నిందలు వేయడం ఏంటని రాజగోపాల్ అసహనం వ్యక్తం చేశారు అన్ని సవ్యంగా ఉంటే విద్యుత్ సంస్థలు నష్టాలలోకి ఎందుకు వెళ్తాయని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నాడూ నేడూ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్, బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 29, 2024 2:19 pm
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…