Political News

కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా తీసేయాలి: రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి కాంగ్రెస్ నేతలది కాదంటున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

అటువంటప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని, వేరే వారు తీసుకోవచ్చు కదా అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పులలోకి నెట్టేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందని అన్నారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్ ను యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని, జనాభా ప్రాతిపదికన కాదని గుర్తు చేశారు.

పదేళ్లపాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్…ఈ రోజు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ఆయన మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. తమపైన నిందలు వేయడం ఏంటని రాజగోపాల్ అసహనం వ్యక్తం చేశారు అన్ని సవ్యంగా ఉంటే విద్యుత్ సంస్థలు నష్టాలలోకి ఎందుకు వెళ్తాయని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నాడూ నేడూ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్, బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on July 29, 2024 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

1 hour ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago