గ్రేటర్ విశాఖ పట్నం కార్పొరేషన్ పీఠంపై జనసేన కన్నేసినట్టు తెలిస్తోంది. ప్రస్తుతం విశాఖ, శ్రీకాకుళం, సహా.. అనంతపురం, చిత్తూరుపై జనసేన ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఇక, ఇప్పుడు విశాఖ గ్రేటర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. విషయంలోకి వెళ్తే.. విశాఖ కార్పొరేషన్ను గత 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. విజయసాయిరెడ్డి ఏకంగా పాదయాత్ర చేసి మరీ.. ఇక్కడ పార్టీని నిలబెట్టారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో విజయం దక్కేలా వ్యూహాలు వేశారు. విజయం సాధించారు.
అయితే.. విశాఖలో ఇప్పుడు వైసీపీ చాలా బలహీన పడింది. దీంతో నాయకులు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటే..జనసేన బలపడేందుకు అవకాశం ఉంటుందని క్షేత్రస్థాయిలో కొందరు వైసీపీ నుంచి జనసేనలోకి ఇప్పటికే వచ్చిన నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని కొందరు ప్రయత్నించారు. కానీ, వారిని స్థానికంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న నాయకులు అడ్డుకుంటున్నారు. దీంతో వారంతా జనసేన వైపు చూస్తున్నారు. వీరిని చేర్చుకునేందుకు జనసేన సిద్ధంగానే ఉంది.
ముఖ్యంగా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటే.. తమకు మరింత వెసులుబాటు వస్తుందని పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్ట సవరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కొంత వెనుకంజ వేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్పటికే 20 మంది కార్పొరేటర్లు వైసీపీకి దూరమయ్యారు. మరో 9 మంది వరకు పార్టీ మారుతామని బాహాటంగానే చెబుతున్నారు. ఈ పరిణామాలను నిలువరించేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్గా ఉన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. మరో వైపు జిల్లాకే చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా.. నిలువరించేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో వైసీపీ ఖాళీ కావడం.. గ్రేటర్ పీఠంపై జనసేన జెండా ఎగరడం ఖాయమనే చర్చ సాగుతోంది.
This post was last modified on July 29, 2024 4:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…