Political News

విశాఖ గ్రేట‌ర్ పీఠంపై జ‌న‌సేన క‌న్ను!

గ్రేట‌ర్ విశాఖ ప‌ట్నం కార్పొరేష‌న్ పీఠంపై జ‌న‌సేన క‌న్నేసిన‌ట్టు తెలిస్తోంది. ప్ర‌స్తుతం విశాఖ‌, శ్రీకాకుళం, స‌హా.. అనంత‌పురం, చిత్తూరుపై జ‌న‌సేన ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ ప్రారంభించింది. ఇక‌, ఇప్పుడు విశాఖ గ్రేట‌ర్ పీఠాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. విశాఖ కార్పొరేష‌న్‌ను గ‌త 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా పాద‌యాత్ర చేసి మ‌రీ.. ఇక్క‌డ పార్టీని నిల‌బెట్టారు. అదేవిధంగా స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కేలా వ్యూహాలు వేశారు. విజ‌యం సాధించారు.

అయితే.. విశాఖ‌లో ఇప్పుడు వైసీపీ చాలా బ‌ల‌హీన ప‌డింది. దీంతో నాయ‌కులు కూడా పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. గ్రేట‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంటే..జ‌న‌సేన బ‌లప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి ఇప్ప‌టికే వ‌చ్చిన నాయ‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి వైసీపీ నుంచి టీడీపీలోకి రావాల‌ని కొందరు ప్ర‌య‌త్నించారు. కానీ, వారిని స్థానికంగా కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న నాయ‌కులు అడ్డుకుంటున్నారు. దీంతో వారంతా జ‌న‌సేన వైపు చూస్తున్నారు. వీరిని చేర్చుకునేందుకు జ‌న‌సేన సిద్ధంగానే ఉంది.

ముఖ్యంగా గ్రేట‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంటే.. త‌మ‌కు మ‌రింత వెసులుబాటు వ‌స్తుంద‌ని పార్టీ కీల‌క నాయ‌కులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో కొంత వెనుకంజ వేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్ప‌టికే 20 మంది కార్పొరేట‌ర్లు వైసీపీకి దూర‌మ‌య్యారు. మ‌రో 9 మంది వ‌ర‌కు పార్టీ మారుతామ‌ని బాహాటంగానే చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను నిలువ‌రించేందుకు పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఉత్త‌రాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. మ‌రో వైపు జిల్లాకే చెందిన మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కూడా.. నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. దీంతో వైసీపీ ఖాళీ కావ‌డం.. గ్రేట‌ర్ పీఠంపై జ‌న‌సేన జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on July 29, 2024 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

42 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

56 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago