Political News

ప్రశాంత్ కిషోర్ ‘కోటి’ ఆశలు !

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన జన్ సురాజ్ అనే సంస్థను ప్రారంభించాడు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబరు 2 న పార్టీని ప్రారంభిస్తున్నానని, పార్టీ నాయకత్వం, విధివిధానాలను త్వరలో వెల్లడిస్తానని పీకే స్పష్టం చేశాడు.

బీహార్ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం జన్ సురాజ్ లక్ష్యమని, బీహార్ భవిష్యత్తు కోసం శ్రమిస్తామని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ మనవరాలు జాగృతి ఠాకూర్‌, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌బలి సింగ్‌ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆనంద్‌ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు. కోటి మంది తన పార్టీలో చేరుతారని భావిస్తున్నట్లు ప్రశాంత్‌ కిశోర్‌ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలలో కూడా కోటి మంది కార్యకర్తలు లేరు. మరి కోటి మంది చేరతారన్న పీకే వ్యాఖ్యలు ఆసక్తికరమే.

2012లో మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకె 2014లో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. అంతకుముందు ఐక్యరాజ్యసమితిలో ఐదేళ్లపాటు పనిచేశాడు. 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టం నితీష్ కుమార్ అవలంబించిన వైఖరిని తప్పుపట్టాడు. దీంతో 2020 జనవరిలో పీకేను జేడీయూ నుండి బహిష్కరించారు. మరి బీహార్ లో రాజకీయ అరంగేట్రం చేయనున్న పీకే బీజేపీ, జేడీయూతో కలిసి పనిచేస్తాడా ? లేక వాటికి వ్యతిరేకంగా పోరాడతాడా ? వేచిచూడాలి.

This post was last modified on July 29, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

20 minutes ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

1 hour ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

2 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

2 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

2 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

2 hours ago