Political News

ప్రశాంత్ కిషోర్ ‘కోటి’ ఆశలు !

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన జన్ సురాజ్ అనే సంస్థను ప్రారంభించాడు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబరు 2 న పార్టీని ప్రారంభిస్తున్నానని, పార్టీ నాయకత్వం, విధివిధానాలను త్వరలో వెల్లడిస్తానని పీకే స్పష్టం చేశాడు.

బీహార్ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం జన్ సురాజ్ లక్ష్యమని, బీహార్ భవిష్యత్తు కోసం శ్రమిస్తామని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ మనవరాలు జాగృతి ఠాకూర్‌, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌బలి సింగ్‌ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆనంద్‌ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు. కోటి మంది తన పార్టీలో చేరుతారని భావిస్తున్నట్లు ప్రశాంత్‌ కిశోర్‌ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలలో కూడా కోటి మంది కార్యకర్తలు లేరు. మరి కోటి మంది చేరతారన్న పీకే వ్యాఖ్యలు ఆసక్తికరమే.

2012లో మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకె 2014లో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. అంతకుముందు ఐక్యరాజ్యసమితిలో ఐదేళ్లపాటు పనిచేశాడు. 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టం నితీష్ కుమార్ అవలంబించిన వైఖరిని తప్పుపట్టాడు. దీంతో 2020 జనవరిలో పీకేను జేడీయూ నుండి బహిష్కరించారు. మరి బీహార్ లో రాజకీయ అరంగేట్రం చేయనున్న పీకే బీజేపీ, జేడీయూతో కలిసి పనిచేస్తాడా ? లేక వాటికి వ్యతిరేకంగా పోరాడతాడా ? వేచిచూడాలి.

This post was last modified on July 29, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తల్లి సినిమాలు ఒక్కటీ చూడని హీరో పిల్లలు

సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు…

33 minutes ago

ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి..…

1 hour ago

వద్దే వద్దంటున్న అజిత్ ఫ్యాన్స్

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో…

3 hours ago

జననాగయన్… విజయ్ కీలక నిర్ణయం?

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. తమిళ టాప్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ విడుదలై ఆరు వారాలు…

3 hours ago

కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా…

4 hours ago

బలవంత్ బిజినెస్ వర్కౌట్ అయ్యిందా

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ప్రమోషన్ల పరంగా బాగా హడావిడి చేసింది హే బలవంత్ ఒక్కటే. మిగిలినవి కూడా పబ్లిసిటీ…

4 hours ago