Political News

ప్రశాంత్ కిషోర్ ‘కోటి’ ఆశలు !

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన జన్ సురాజ్ అనే సంస్థను ప్రారంభించాడు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబరు 2 న పార్టీని ప్రారంభిస్తున్నానని, పార్టీ నాయకత్వం, విధివిధానాలను త్వరలో వెల్లడిస్తానని పీకే స్పష్టం చేశాడు.

బీహార్ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం జన్ సురాజ్ లక్ష్యమని, బీహార్ భవిష్యత్తు కోసం శ్రమిస్తామని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ మనవరాలు జాగృతి ఠాకూర్‌, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌బలి సింగ్‌ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆనంద్‌ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు. కోటి మంది తన పార్టీలో చేరుతారని భావిస్తున్నట్లు ప్రశాంత్‌ కిశోర్‌ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలలో కూడా కోటి మంది కార్యకర్తలు లేరు. మరి కోటి మంది చేరతారన్న పీకే వ్యాఖ్యలు ఆసక్తికరమే.

2012లో మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకె 2014లో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. అంతకుముందు ఐక్యరాజ్యసమితిలో ఐదేళ్లపాటు పనిచేశాడు. 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టం నితీష్ కుమార్ అవలంబించిన వైఖరిని తప్పుపట్టాడు. దీంతో 2020 జనవరిలో పీకేను జేడీయూ నుండి బహిష్కరించారు. మరి బీహార్ లో రాజకీయ అరంగేట్రం చేయనున్న పీకే బీజేపీ, జేడీయూతో కలిసి పనిచేస్తాడా ? లేక వాటికి వ్యతిరేకంగా పోరాడతాడా ? వేచిచూడాలి.

This post was last modified on July 29, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

2 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

3 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

4 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

6 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

6 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

8 hours ago