తమకు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నా.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చని.. అలా ఇవ్వనప్పుడు తాము సభలకు వెళ్లినా.. ప్రయోజనం ఏంటని వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే.. అసెంబ్లీకి వెళ్లేది లేదని.. సభలో తమపై చేసే విమర్శలకు కౌంటర్గా.. తాము మీడియా సమావేశాలు పెట్టి నిజాలు చెబుతామని జగన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది.
అయితే.. జగన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. ఇదే సమయంలో తనదైన శైలిలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల.. ఆయన షార్ప్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు.. మీకు పదవులు ఎందుకు? రాజీనామాలు చేయండి.. అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎంఎల్ ఏ అంటే.. శాసన సభ్యులు అని, మీడియా అసెంబ్లీ సభ్యులు కాదని పేర్కొన్నారు. ప్రజలు ఆ 11 మందిని గెలిపించింది.. చట్ట సభల్లో తమ సమస్యలను ప్రస్తావిస్తారనే నమ్మకంతోనేనని, మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకునేందుకు కాదని అన్నారు. ఇదే విషయాన్ని కూడా ప్రశ్నల రూపంలో సంధించారు.
ఆ బాధ్యత లేదా?
అసెంబ్లీలో గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దందాలు, దోపిడీపై ప్రస్తుత ప్రబుత్వం శ్వేత పత్రాల రూపంలో వివరాలు తెలిపిందని షర్మిల పేర్కొన్నారు. ఇలాంటి విమర్శలకు అసెంబ్లీలోనే ఆన్ రికార్డుగా మీరు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉందని.. ఆ బాధ్యత మీది కాదా? అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లనని చెబుతున్న మీకు ప్రతిపక్ష హోదా ఎందుకు? అసలు మీరు ఎమ్మెల్యేగానే అర్హులు కారు. వెంటనే రాజీనామాలు చేయండి! అని షర్మిల వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి పోను అంటూ.. గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనప్పుడు.. మీరు ఆఫ్రికా అడవులకు పోతారో.. అంటార్కిటికా మంచు ఖండానికి పోతారో.. ఎవడికి కావాలి. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో.. తక్షణం రాజీనామాలు చేయాలి.. అని షర్మిల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సైతం సంధించారు. బడికి పోననే పిల్లవాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి తీసేస్తారు. ఇప్పుడు ప్రజాతీర్పున గౌరవించకుండా.. అసెంబ్లీకి పోనంటూ.. గౌరవ సభను అవమానించేవారు రాజీనామాలు చేయాలి అని అన్నారు.
This post was last modified on July 28, 2024 2:04 pm
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…